Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భారత్‌లో మత చీలికలు అధికం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

భారత్‌లో మత చీలికలు అధికం

Thu 01 Dec 03:57:01.386343 2022

- సామాజిక శతృత్వ సూచిక 9.4
- పాక్‌, అఫ్ఘన్‌ కంటే దారుణం
- 2020లో పెరిగిన మతపరమైన కేసులు
- ప్యూ పరిశోధనా కేంద్రం నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో మతపరమైన చీలికలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2020లో కోవిడ్‌-19 ప్రారంభ దశలో మతపరమైన శతృత్వాన్ని చూసిన కొన్ని దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉన్నది. ఈ విషయాన్ని యూఎస్‌ థింక్‌-ట్యాంక్‌ ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. 198 దేశాలను ఈ నివేదిక కవర్‌ చేసింది. మొత్తమ్మీద, భారత్‌ 2020లో ప్రపంచవ్యాప్తంగా మతపరమైన విషయంలో అత్యధిక సామాజిక ఉద్రిక్తతలను కలిగి ఉన్నది. మహమ్మారి తొలి ఏడాదిలో శతృత్వ పెరుగుదలపై భారత అధికారిక గణాంకాల్లో సైతం ప్రతిబింబించటం గమనార్హం. అయితే, ఈ నివేదికపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు.
ప్యూ పరిశోధనా కేంద్రం అధ్యయనం ప్రకారం.. 2020లో భారత సామాజిక శతృత్వ సూచీ (ఎస్‌హెచ్‌ఐ) పది మార్కులకు గానూ 9.4గా ఉన్నది. దీనర్థం భారత ప్రదర్శన దారుణంగా ఉన్నది. ఇది మన పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ ల కంటే ఘోరంగా ఉండటం గమనార్హం. ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు, గ్రూపులు ద్వారా మతపరమైన శతృత్వ చర్యలను ఎస్‌హెచ్‌ఐ కొలుస్తుంది. ఇందులో మత సంబంధిత సాయుధ పోరాటం, ఉగ్రవాదం, మతపరమైన హింస వంటి 13 అంశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్‌, నైజీరియా, పాకిస్థాన్‌, ఈజిప్టు, బంగ్లాదేశ్‌లు మతానికి సంబంధించి 'చాలా అధిక' సామాజిక శతృత్వాన్ని కలిగి ఉన్నాయి.
ప్రభుత్వ ఆంక్షలు
ఇక మత విశ్వాసాలు, ఆచారాలపై ఆంక్షల విషయంలోనూ భారత్‌ ప్రదర్శన ఆందోళనకరంగా ఉన్నది. ప్రభుత్వ పరిమితుల సూచీ(జీఆర్‌ఐ) ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. మత విశ్వాసాలు, ఆచారాల పట్ల చట్టం, విధానాలు, ఒక దేశ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఇది అంచనా వేస్తుంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత ర్యాంకు 34గా ఉన్నది. అంటే, మత విశ్వాసాలు, ఆచారాలపై భారత ప్రభుత్వ ఆంక్షలు ''అధిక'' స్థాయిల్లో ఉన్నాయి.
కోవిడ్‌లో 'ఆ వర్గం'పై దాడులు
2020లో మతపరమైన హింసపై కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావాన్ని కూడా నివేదిక పరిశీలించింది. మత సంస్థలపై ప్రయివేటు వ్యక్తులు, సంస్థల భౌతిక హింస, విధ్వంసానికి సంబంధించి సామాజిక శతృత్వాలను చూసిన మొదటి నాలుగు దేశాల్లో భారత్‌ ఒకటి. అర్జెంటీనా, ఇటలీ, అమెరికాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారన్న నెపంతో ''ఒక వర్గం''పై అనేక దాడులు జరిగాయని నివేదిక పేర్కొన్నది. ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు కరోనావైరస్‌ వ్యాప్తిని మత సమూహాలకు అనుసంధానించిన దేశాలలో భారత్‌ కూడా ఉన్నదని వివరించింది. ''కరోనా జిహాద్‌'' వంటి ఇస్లామోఫోబిక్‌ హ్యాష్‌ట్యాగ్‌ల వ్యాప్తిని నివేదిక ఉటంకించింది.
పెరిగిన మతపరమై అల్లర్ల కేసులు
మతపరమైన అల్లర్లకు సంబంధించి భారత్‌ అధికారిక డేటా కాస్త మిశ్రమంగా ఉన్నది. పోలీసు సమాచారం ప్రకారం.. మతపరమైన అలర్లకు సంబంధించిన కేసులు 2020లో గణనీయంగా పెరిగాయి. అయితే, 'మతపరమైన సంఘటనల' డేటాను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ అందించదనీ, నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇప్పుడిప్పుడే మతపరమైన 'అలర్ల' సమాచారాన్ని ప్రచురిస్తున్నదని నిపుణులు తెలిపారు. కాగా, కొన్ని అంశాల్లో హౌం మంత్రిత్వ శాఖ, ఎన్సీఆర్బీల సమాచారానికి మధ్య చాలా తేడాలున్నాయన్నారు. అయితే, పేదరికం, ఆకలి వంటి సూచీల్లో గతంలో అనేక నివేదికలనూ భారత ప్రభుత్వం ప్రశ్నించిందనీ, వీటి సర్వే తీరును ఎత్తి చూపిందని నిపుణులు గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో ప్యూ నివేదిక పైనా భారత స్పందనా అలాగే ఉండే అవకాశమున్నదనీ, ఇందు కోసం వేచి చూడాలని వారు అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.