Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మానవ హక్కులు కీలకం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

మానవ హక్కులు కీలకం

Sat 03 Dec 02:53:42.310881 2022

- వాటి నిబంధనలను ఉన్నత విద్య, బోధనా శాస్త్రంలో చేర్చాలి
- వాటి ప్రాముఖ్యతను గుర్తించాలి
- విద్యా నిపుణుల సూచన
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యారంగంలో సంస్కరణల కోసం పలు డిమాం డ్‌లు వినిపిస్తున్నాయి. విలువలతో ఆద ర్శంగా నిలిచే ఉన్నత విద్యను పొందటం చాలా ముఖ్యమని విద్యావేత్తలు, నిపుణులు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మానవ హక్కులు చాలా ముఖ్య మైనవనీ, వీటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇందులో భాగంగా మానవ హక్కుల నిబంధనలను ఉన్నత విద్యతో పాటు బోధనా శాస్త్రంలో చేర్చాల్సిన అవసరమున్నదని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మానవ హక్కులు కాలరాయబడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ఆయా దేశాల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఈ హక్కుల ప్రాముఖ్యతపై సాధారణ ప్రజలలో అవ గాహన తక్కువన్నారు. ముఖ్యంగా, చదువుకున్న యువతలోనూ మానవ హక్కుల గురించి తెలిసింది తక్కువేనని నిపుణులు తెలిపారు. స్కూళ్లలో, కళాశాలల్లో, ఉన్నత విద్యనభ్యసించే సమయంలో మానవ హక్కుల ప్రస్తావన ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అన్నారు. చదువుకున్న సమాజం మానవ హక్కుల ప్రాముఖ్యతను గుర్తించాలని చెప్పారు. విద్యపై అత్యంత ముఖ్యమైన ప్రపంచ పత్రం ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ఐసీఈ ఎస్‌సీఆర్‌). దీనిని ఐక్యరాజ్య సమితి 1966లో ఆమోదించింది. భారత్‌ దీనిపై 1979లో సంతకం చేసింది. దీని ప్రకారం, విద్యకు సంబంధించిన అత్యంత ముఖ్యమైనది ఆర్టికల్‌ 13. ఆర్టికల్‌ 13 ప్రతి ఒక్కరికీ విద్యను పొందే హక్కును ప్రసాదించింది. విద్య మానవ వ్యక్తిత్వం పూర్తి వికాసానికి, దాని గౌరవం యొక్క భావాన్ని నిర్దేశిస్తుందన్న విషయాన్ని ఇది చెప్తుంది. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని బలపరుస్తుందన్న విషయం ఇందులో ఉటంకించబడిందని విద్యావేత్తలు, నిపుణులు తెలిపారు. ఉన్నత విద్య వైపు మళ్లటం గురించి ఆర్టికల్‌ 2(సీ) వివరిస్తుంది. అన్ని స్థాయిలలో పాఠశాలల వ్యవస్థ అభివృద్ధిని చురుకుగా కొన సాగించాలని ఆర్టికల్‌ 2(ఈ) చెప్తుంది. బోధనా సిబ్బంది, భౌతిక పరిస్థితులు నిరంతరం మెరుగు పర్చటం గురించి ఇది వివరిస్తుంది. అయితే, ఉన్నత విద్య అనేది ఐసీఈఎస్‌సీఆర్‌ సిఫారసులకు విరు ద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నదని నిపుణులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో యునెస్కో ఎవాల్వింగ్‌ రైట్‌ టు ఎడ్యుకేషన్‌ సెమినార్‌కు కంట్రిబ్యూటర్‌లలో ఒకరైన క్లాస్‌ డి. బీటర్‌.. ఐసీ ఈఎస్‌సీఆర్‌ మానవ హక్కుల ఆధారిత దృష్టిని బలహానపరిచే ఉన్నత విద్యలోని కొన్ని పరిణామాలను జాబితా చేశారు. ప్రజావస్తువుల ప్రయివేటీకరణ, అంతర్జాతీయ మానవ హక్కుల బాధ్యత గురించి తెలియకపోవటం, వలసలు, ప్లూరలైజేషన్‌, 'ఇతరత్వం'ని అంగీకరించకపోవటం వంటి అంశాలను ఆయన లేవనెత్తారు. ఉన్నత విద్యలో సంస్కరణలు కేవలం సిఫారసుల రూపంలో కాకుండా అంతర్జాతీయ చట్టాల రూపంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉండాలని ఆయన ప్రతిపాదించారు. ఉన్నత విద్య శాంతి నిర్వహణ కోసం ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలను మరింతగా కొనసాగించటానికి విద్యార్థులకు శిక్షణనిస్తుందని నిపుణులు చెప్పారు. 'ది హ్యూమన్‌ రైట్స్‌-బేస్డ్‌ అప్రో చ్‌ టు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (2018)'లో జేన్‌ కోట్జ్‌ మాన్‌ తన వివరణాత్మక అధ్యయనంలో మార్కెట్‌ ఆధారిత సూత్రాలపై ఉన్నత విద్యా విధాన రూప కల్పనలో మానవ హక్కుల ప్రాముఖ్యతపై బలమైన వాదనను అందించారని తెలిపారు. మానవ హక్కు లకు భంగం వాటిల్లకుండా ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలూ తమ వంతు పాత్రను పోషించాలని విద్యావేత్తలు, నిపుణులు చెప్పారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.