Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇంటర్నెట్‌ లేని ప్రభుత్వ స్కూల్స్‌ 66శాతం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఇంటర్నెట్‌ లేని ప్రభుత్వ స్కూల్స్‌ 66శాతం

Sat 03 Dec 04:31:45.260126 2022

- సగానికిపైగా కంప్యూటర్లు పనిచేయటం లేదు : ఎడ్యుకేషన్‌ ప్లస్‌ నివేదిక
- డిజిటల్‌ బోధనలో దేశంలోనే కేరళ టాప్‌.. అక్కడ 94.6శాతం సర్కారు బడుల్లో ఇంటర్నెట్‌
న్యూఢిల్లీ : ప్రయివేటు స్కూల్స్‌లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉండి..ప్రభుత్వ స్కూల్స్‌లో లేకపోతే? అది సమాజంలో డిజిటల్‌ అంత రాలకు దారితీస్తుంది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని ప్రభుత్వ స్కూల్స్‌ 66 శాతమున్నాయని, ఒక్క కేరళలో మాత్రం..ఇంటర్నెట్‌ కనెక్షన్‌, కంప్యూటర్లు ఉన్న ప్రయివేట్‌ స్కూల్స్‌ కన్నా ప్రభుత్వ స్కూల్స్‌ ఎక్కువని 'ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ' విడుదల చేసిన 'ఎడ్యుకేషన్‌ ప్లస్‌- 2021-22' నివేదిక చెబుతోంది. డిజిటల్‌ బోధనలో (కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌) కేరళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
అక్కడ 94.6శాతం ప్రభుత్వ స్కూల్స్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉందని ఈ సర్వే తేల్చింది. డిజిటల్‌ బోధనలో ఢిల్లీ, లక్ష్యద్వీప్‌, గుజరాత్‌, చండీ గఢ్‌, పంజాబ్‌, హర్యానా.. ముందుండగా, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, మధ్య ప్రదేశ్‌, మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌, మేఘాలయ, ఒడిషా, తెలంగాణ, త్రిపుర చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని ప్రభుత్వ స్కూల్స్‌ 80 నుంచి 85 శాతం ఉన్నాయని లేదని సర్వే తెలిపింది.
స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌
పాఠశాల విద్యా బోధనలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం..కీలకంగా మారాయి. కేరళ, పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాల్లో 90శాతానికిపైగా ప్రభుత్వ స్కూల్స్‌లో స్మార్ట్‌రూమ్‌ బోధన ఉందని సర్వే వెల్లడించింది. అయితే దేశం లోని 14 లక్షల స్కూల్స్‌లో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ ఉన్నవి 2,22,155 మాత్రమే. డిజిటల్‌ బోధన, స్మార్ట్‌ బోర్డ్స్‌ ద్వారా టీచింగ్‌ ఈ స్కూల్స్‌లో కొనసాగుతోంది. తమిళనాడులో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ ఉన్నవి జీరో. కంప్యూటర్ల గురించి స్కూల్‌ పిల్లలకు చెప్పాలన్నా, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌లో బోధన ముందుకు సాగా లన్నా..ఇంటర్నెట్‌ వసతి చాలా ముఖ్యం. ప్రయివేటు స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ పోటీ పడాలంటే కంప్యూటర్లు, వాటి వాడకం అందుబాటులో ఉండాలి. కేరళ, గుజరాత్‌, ఢిల్లీ, లక్షద్వీప్‌ తదితర రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌.. మొదలైనవి చాలా వెనుకబడి ఉన్నాయి.
ఇంటర్నెట్‌ కనెక్షన్‌
ఈ విషయంలో కేరళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఇంటర్నెట్‌ కనెక్షన్లున్న ప్రయివేటు స్కూల్స్‌ కన్నా ప్రభుత్వ సూల్స్‌ ఎక్కువ.
అయితే తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఇంటర్నెట్‌ వసతి లేని స్కూల్స్‌ బీహార్‌లో 92శాతం, మిజోరాంలో 90 శాతము న్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, లక్షద్వీప్‌ల్లోని అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో కంప్యూటర్లు న్నాయి. ఇంటర్నెట్‌ కనెక్షన్లతో వాడుతు న్నవి 97.4 శాతమున్నాయి. ఇంట ర్నెట్‌ కనెక్షన్లున్న స్కూల్స్‌ చండీగఢ్‌లో 98.7శాతం, పాండిచ్చెరిలో 98.4 శాతం ఉన్నాయని సర్వే తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్తంగా చూస్తే.. 59.6శాతం ప్రయివేటు, అన్‌ ఎయిడెడ్‌, 53.1శాతం గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌, 24.2 శాతం ప్రభుత్వ స్కూల్స్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంది. కంప్యూటర్ల వాడకమున్న స్కూల్స్‌ 50శాతం లోపే. టీచింగ్‌ కోసం ఇచ్చిన మొబైల్స్‌లో 20శాతం పనిచేస్తున్నాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.