Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఐటీ రూల్స్‌లో మార్పులపై మీడియా సంస్థల ఆందోళన | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఐటీ రూల్స్‌లో మార్పులపై మీడియా సంస్థల ఆందోళన

Wed 25 Jan 01:58:44.398184 2023

- సంబంధిత వర్గాలతో చర్చించకుండా ముందుకు వెళ్లొద్దు : ఐఎన్‌ఎస్‌
న్యూఢిల్లీ : ఐటీ నిబంధనావళికి సవరిస్తూ మోడీ సర్కార్‌ విడుదల చేసిన ముసాయిదా ప్రతి మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మోడీ సర్కార్‌ చర్యను 'ద ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ' (ఐఎన్‌ఎస్‌) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపాదిత సవరణలను వెంటనే నిలుపుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఏకపక్షంగా నిబంధనల్లో మార్పులు చేయరాదని, సంబంధిత వర్గాలతో చర్చించాకే ముందుకు వెళ్లాలని కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖకు తెలిపింది. ఐటీ చట్టాన్ని సవరిస్తూ మోడీ సర్కార్‌ కొద్ది రోజుల క్రితం ముసాయిదా ప్రతిని సిద్ధం చేయగా, దీనిపై మీడియా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ యూనిట్‌ ఏదైనా వార్తను 'ఫేక్‌' అని నిర్ధారిస్తే..సామాజిక మాధ్యమాలు, వార్తా వెబ్‌సైట్స్‌ ఆ వార్తను ప్రచురించడానికి వీల్లేదని ముసాయిదా చట్టంలో నిబంధనల్ని చేర్చారు. ప్రభుత్వ వ్యవహారాలు, ఇతర సమాచారం గురించిన నివేదికల వాస్తవ కచ్చితత్వాన్ని, అత్యున్నత ప్రమాణాలు, సరైన ప్రక్రియకు అనుగుణంగా ఉండేలా ఒక యంత్రాంగాన్ని తీసుకొచ్చేందుకు సంప్రదింపులు ప్రారంభించాలని ఐఎన్‌ఎస్‌ అభిప్రాయపడింది. ఐటీ నిబంధనావళికి సవరణలు చేయటాన్ని 'ఎడిటర్స్‌ గిల్డ్‌', ప్రెస్‌ అసోసియేషన్‌, డిజిపబ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌, డిజిటల్‌ అసోసియేషన్‌ తీవ్రంగా వ్యతిరేకించాయి. వివాదాస్పద అంశాల్ని ముసాయదా చట్టం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి.
ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) అన్నది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నోడల్‌ ఏజెన్సీ. ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయటం పీఐబీ ప్రధాన విధి. ఇలాంటి సంస్థకు నకిలీ వార్తలను తొలగించే పని అప్పగించడాన్ని ఏకపక్ష నిర్ణయంగా ఐఎన్‌ఎస్‌ భావిస్తోంది.
గతవారం కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఐటీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్‌, 2021కి సవరణలు చేసి ముసాయిదా ప్రతిని జారీచేసింది. పీఐబీలోని ఫ్యాక్ట్‌ చెకింగ్‌ యూనిట్‌కు 'నకిలీ వార్తల'ను గుర్తించే పని అప్పగించింది. ఇలా గుర్తించిన వార్తల్ని సోషల్‌మీడియా, న్యూస్‌ వెబ్‌పోర్టల్స్‌ ప్రచురించరాదు. ఒకవేళ ప్రచురిస్తే.. వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీ అయిన పీఐబీకి న్యాయ అధికారం కల్పించటాన్ని ఐఎన్‌ఎస్‌ తప్పుబట్టింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే ప్రభుత్వ చర్యగా అభివర్ణించింది. ముసాయిదా చట్టంలో పేర్కొన్న నిబంధనలు, ఇతర విషయాలు పత్రికల స్వేచ్ఛకు విఘాతమని తెలిపింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి
కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...
బాల్య వివాహాల కేసుల్లో అసోం సర్కార్‌ దూకుడు
9న బ్లాక్‌ డే
యూపీ పోలీసులు వేధించారు..
రక్షణ దిగుమతులు రూ.2లక్షల కోట్లు
పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..
నైకా నుంచి 'జెంటిల్‌మెన్స్‌ క్రూ' ఉత్పత్తులు
కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?
కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం
మతమార్పిడి నిరోధక చట్టంపై ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు
అమెరికన్‌ డోజోన్స్‌ నుంచి అదానీ ఔట్‌..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.