Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఘణతంత్రం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఘణతంత్రం

Fri 27 Jan 02:02:04.395608 2023

- అట్టహాసంగా 74వ రిపబ్లిక్‌ వేడుకలు
- ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫట్టా ఎల్‌-సిసి
- సైనిక శక్తిని ప్రదర్శిస్తూ త్రివిధ దళాల కవాతు
- ప్రధాన ఆకర్షణగా నారీ శక్తి, అగ్ని వీరులు
- 17 శకటాల ప్రదర్శన
- ఢిల్లీలో కనులపండువగా కర్తవ్యపథ్‌
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవాలు జరిగాయి. దేశంలోని విభిన్న సంస్కృతులను చాటేలా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో శకటాల ప్రదర్శన జరిగింది. సైనిక శక్తిని ప్రద ర్శిస్తూ త్రివిధ దళాలు కవాతును నిర్వహించాయి. వీటిల్లో నారీ శక్తి, అగ్ని వీరులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 17 శకటాలు ప్రదర్శిం చారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నివీర్‌ పథకం కింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవాల కవాతులో పాల్గొన్నారు. గతంలో రాజ్‌పథ్‌గా పిలిచిన మార్గానికి ఇప్పుడు కర్తవ్యపథ్‌ అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టిన తరువాత తొలిసారి ఇక్కడ కవాతు జరిగింది. స్వయం సమృద్ధ భారత్‌ పథకంలో భాగంగా మన దేశంలోనే తయారు చేసిన 105 ఎంఎం లైట్‌ ఫీల్డ్‌ గన్స్‌తో 21సార్లు పేల్చి గౌరవ వందనం చేశారు. ఈ తుపాకులతో గౌరవ వందనం చేయడం ఇదే తొలిసారి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫట్టా ఎల్‌-సిసి హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు నేతను ఆహ్వానించడం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. ఆ దేశ సైన్యం గణతంత్ర దినోత్సవాల కవాతులో పాల్గొన్నది. ఇది కూడా మొదటిసారే. శకటాల ప్రదర్శనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ''ప్రభల తీర్థం - మకర సంక్రాంతికి వ్యవసాయదారుల పండుగ'' అనే ఇతివత్తంతో శకటాన్ని ప్రదర్శించింది.
ఓడిశా సంస్కృతిని ప్రతిబింబించేలా
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హౌదాలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె తన స్వరాష్ట్రమైన ఒడిశా సంస్కృతిని ప్రదర్శించే విధంగా ఆ రాష్ట్రంలో తయారైన టెంపుల్‌ బోర్డర్‌ గల పట్టుచీరను ధరించారు.
ఒంటెల దళంతో మహిళల కవాతు
ఒంటెల దళంతో మహిళలు కవాతు నిర్వహించడం ఇదే మొదటిసారి. వీరు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)కు చెందినవారు. సోనాల్‌, నిషా, భగవతి, అంబిక, కుసుమ్‌, ప్రియాంక, కౌసల్య, కాజల్‌, భావన, హీనా తదితరులు ఈ దళంలో ఉన్నారు. అందరూ మహిళలే ఉన్న సీఆర్పీఎఫ్‌-పీస్‌కీపర్స్‌ ఆఫ్‌ ది నేషన్‌ కంటింజెంట్‌ కూడా కవాతు నిర్వహించింది. దీనికి అసిస్టెంట్‌ కమాండెంట్‌ పూనమ్‌ గుప్తా నాయకత్వం వహించారు. ఉమెన్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ బెటాలియన్‌ ఏర్పాటవడం ప్రపంచంలో ఇదే తొలిసారి.
ఎన్సీబీ శకటం ప్రదర్శన
మాదక ద్రవ్యాల నియంత్రణకు కషి చేస్తున్న నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) మొట్టమొదటిసారి ఓ శకటాన్ని ప్రదర్శించింది. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి వ్యతిరేకంగా ఈ శకటాన్ని తీర్చిదిద్దింది. 35 మంది మహిళా కానిస్టేబుళ్ళతో ఢిల్లీ పోలీస్‌ ఉమెన్‌ పైప్‌ బ్యాండ్‌ ఈ కవాతులో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి. ప్రధాని మోడీ వర్ణరంజితమైన తలపాగాను ధరించారు. పొడవైన వస్త్రం వేలాడే విధంగా అనేక రంగులతో కూడిన ఈ రాజస్థానీ తలపాగా అంతరార్థం ఏమిటని చాలా మంది ఆసక్తిగా చూశారు. తెల్లని కుర్తా, ప్యాంట్స్‌, ఆ పైన నల్లని కోటు ధరించిన మోడీ రంగు రంగుల తలపాగాను ధరించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.