Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
విద్యార్థుల నిర్బంధం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

విద్యార్థుల నిర్బంధం

Sat 28 Jan 10:06:55.844975 2023

- ఢిల్లీ, అంబేద్కర్‌ యూనివర్సిటీల్లో జేఎన్‌యూ సీన్‌ రిపీట్‌
- సెక్షన్‌ 144 విధింపు.. విద్యుత్‌ సరఫరా కట్‌
- మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిషేధిస్తూ ఆదేశాలు
- వర్సిటీ యంత్రాంగాలు, పోలీసుల చర్యలు
- 24 మంది అదుపులోకి.. అయినా వెనక్కి తగ్గని విద్యార్థులు
- వీడియో లింక్‌తో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వీక్షణ
న్యూఢిల్లీ : భారత్‌లోని అగ్రస్థాయి విశ్వవిద్యాలయాలైన ఢిల్లీ, అంబేద్కర్‌ యూనివర్సిటీలలో జేఎన్‌యూ సీన్‌ రిపీట్‌ అయింది. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్‌ను వీక్షించడానికి సిద్ధమైన విద్యార్థులను వర్సిటీ యంత్రాంగాలు, పోలీసులు అడ్డుకున్నారు. బీబీసీ సిరీస్‌ ప్రదర్శనకు సిద్ధమైన ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులు అధిక సంఖ్యలో గుమిగూడటాన్ని, బహిరంగా స్క్రీనింగ్‌ను నిషేధిస్తూ సెక్షన్‌ 144 ను విధించారు. ఇటు అంబేద్కర్‌ యూనివర్సిటీలోనూ డాక్యుమెంటరీ ప్రదర్శనకు సిద్ధమైన వేళ యంత్రాంగం విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది.
సెక్షన్‌ 144 విధింపు.. విద్యార్థుల నిరసనలు
వర్సిటీ యంత్రాంగాల తీరు అక్కడి విద్యార్థుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. రెండు యూనివర్సిటీలలో విద్యార్థులు నిరసనలు చేశారు. నినాదాలు వినిపించారు. విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుక పోలీసులు రంగంలోకి దిగారు. వీరిలో చాలా మంది విద్యార్థులను పోలీసులు నిర్బంధించారు. దీంతో వర్సిటీలో విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవడంలో భాగంగా విధించిన సెక్షన్‌ 144కు వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ వద్ద మరింత మంది గుమిగూడారు. వర్సిటీ యంత్రాంగం ఆదేశాలను వారు నిరసించారు. దీంతో పోలీసులు, యూనివర్సిటీ భద్రతా సిబ్బంది విద్యార్థుల పట్ల కఠినంగా ప్రవర్తించారు. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రయత్నించినందుకు 24 విద్యార్థులను నిర్బంధించినట్టు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు ధ్రువీకరించారు.
పోలీసులు, వర్సిటీ యంత్రాంగాలు తమ అధికార, అంగ బలాన్ని ఉపయోగించి డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవాలని చూసినా.. విద్యార్థులను ఆపలేకపోయాయి. జేఎన్‌యూ లో లాగానే.. డాక్యుమెంటరీకి సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ లింక్‌ను షేర్‌ చేసుకొని విద్యార్థులు తమ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వీక్షించారు. క్యాంపస్‌లో పబ్లిక్‌ స్క్రీనింగ్‌ను అనుమతించబడదని ఢిల్లీ యూనివర్సిటీ లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ విద్యార్థులు వారి ఫోన్లలోనే చూడాలనుకుంటే.. అది వారి విచక్షణ అని చెప్పాయి. వర్సిటీలలో అలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదనీ, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు మోహరింపు భారీగా ఉంటుందనీ, ఒక వేళ ప్రదర్శన (స్క్రీనింగ్‌) కోసం విద్యార్థులు గుమిగూడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులకు తాను లేఖ రాసినట్టు, వారు (పోలీసులు) చర్యలు తీసుకుంటారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొక్టార్‌ రజిని అబ్బి తెలిపారు.ఇటు జామియా మిలియా ఇస్లామియాలో విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యుల అభ్యర్థన మేరకు తరగతులు బహిష్కరించారు. స్క్రీనింగ్‌కు కొందరు విద్యార్థులు ప్రయత్నించారనీ, యూనివర్సిటీ పూర్తిగా విఫలమైందని వైస్‌ చాన్సలర్‌ నజ్మా అక్తర్‌ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజు విద్యార్థులు తరగతులు బహిష్కరించటం గమనార్హం.
ఈ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రయత్నించిన 13 మంది విద్యార్థులను ఢిల్లీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. గుజరాత్‌ అల్లర్లలో మోడీ పాత్రకు సంబంధించి బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ '' ఇండియా : ద మోడీ క్వశ్చన్‌'' భారత్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఎస్‌ఎఫ్‌ఐ మొదలుకొని పలు విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను పలు యూనివర్సిటీల్లో జరిపాయి. మరికొన్ని వర్సిటీలు, విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాల్లో ప్రదర్శించడానికి విద్యార్థి సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. కాగా, ఈ డాక్యుమెంటరీనీ కేంద్రం ఐటీ నిబంధనల్లోని ఎమర్జెన్సీ అధికారాలను ప్రయోగిస్తూ నిషేధం విధించిన విషయం విదితమే.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.