Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
త్రిపుర ఎన్నికలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

త్రిపుర ఎన్నికలు

Sat 28 Jan 03:41:40.123723 2023

- 46 స్థానాల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌
- 13 చోట్ల కాంగ్రెస్‌.. స్వతంత్ర అభ్యర్థికి ఒక స్థానం
- పోటీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌
- సీపీఐ(ఎం) జాబితాలో 24 మంది కొత్త అభ్యర్థులు
న్యూఢిల్లీ : త్రిపురలో బీజేపీ పాలనకు ముగింపు పలకడానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఒక్కట య్యాయి. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో, సీట్ల పంపకాలపై దాదాపు 14 రోజులుగా వామపక్షాలు, కాంగ్రెస్‌ మధ్య జరుగుతున్న చర్చలు సఫలమయ్యాయి. 46 స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను లెఫ్ట్‌ ఫ్రంట్‌ కూటమి శుక్రవారం ప్రకటించింది. 13 స్థానాల్ని కాంగ్రెస్‌కు, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడుతున్న మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది పురుషోత్తమ్‌ రే బర్మన్‌కు కేటాయించారు. ''మొత్తం 46 స్థానాల్లో వామపక్ష అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. ఇందులో 43 స్థానాల్లో సీపీఐ(ఎం), ఒక్కో స్థానంలో సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వార్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడతారు'' అని లెఫ్ట్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ నారాయన్‌ కార్‌ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల అభ్యర్థుల పేర్లను ఇంకా విడుదల చేయాల్సి వుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సబ్రూమ్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలబడుతున్నారు.
మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, బాదల్‌ చౌదరి, మాజీ మంత్రి భన్సూలాల్‌ సాహా, సాహిద్‌ చౌదరీ, తపన్‌ చక్రవర్తి, సహా 8మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీపీఐ(ఎం) పార్టీ టికెట్లు దక్కలేదు. కొత్త వారికి, యువతకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సీనియర్‌ నాయకులు మాణిక్‌ సర్కార్‌ పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి మీడియాకు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో 24 మంది కొత్త అభ్యర్థులకు లెఫ్ట్‌ ఫ్రంట్‌ టికెట్లు ఇవ్వటం గమనార్హం. ఇందులో ఇద్దరు మహిళా అభ్యర్థులున్నారు. ఈ సందర్భంగా నారాయన్‌ కార్‌ మాట్లాడుతూ, ''ఈ ఎన్నికలు ఈ దేశానికి ఎంతో కీలకమైనవి. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలనే బీజేపీ ధ్వంసం చేస్తోంది. అరాచక, హింసాయుత పాలనకు వ్యతిరేకంగా వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఒక్కటయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్‌ తమ పోరాటాన్ని కొనసాగిస్తాయి. బీజేపీ పాలనకు ప్రజాస్వామ్యయుతంగా ముగింపు పలకాలంటే ఎన్నికలు మంచి అవకాశం. మళ్లీ బీజేపీకి అధికారం రాకూడదనేది మా ప్రధాన లక్ష్య''మని చెప్పారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గంటలు ఇంటరాగేషన్‌
సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.