Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..

Sun 29 Jan 04:26:55.721771 2023

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ సంస్థల బండారం బట్టబయలైంది. హిండేన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ బయటపెట్టింది అదానీ బాగోతమే కాదు ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ అక్రమాల అసలు మతలబుని. రెండు రోజుల్లో 4,18,000 కోట్ల మేర అదాని సంస్థల సంపద ఆవిరైంది. అసాంఖ్యాక ప్రజల, ఎన్నో సంస్థలకి నమ్మక ద్రోహం చేసిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానిది ప్రధాన భూమిక. మూడు దశాబ్దాల్లో ప్రపంచ మూడవ కూబేరుణ్ణి చేసిన ఘనత కచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వానిదే. రెగ్యులేటరీ నిబంధనలను సవరింపజేసి, పెన్షన్‌, ప్రావిడేంట్‌ ఫండ్‌ను, ప్రభుత్వ రంగాలైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి దిగ్గజాలతో పెట్టుబడులు పెట్టించిన ప్రభుత్వం ప్రధాన బాధ్యురాలేనని నిపుణులు అభిప్రాయపడు తున్నారు. అయితే ఈ సీక్రెట్‌ వ్యవహారా లకు ఆశ్రిత విధానాలతో స్టాక్‌ మార్కెట్టూ అదానీకి బాగా ఉపయోగపడ్డాయి, ఒక్క వార్త వేలకోట్ల సామ్రాజ్యాన్ని పేక మేడలా కూలేటట్లు చేయగల సామర్థ్యం స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత వ్యవస్థకు మాత్రమే సాధ్యం. ప్రపంచ కుబేరుడు గౌతమ్‌ అదాని వ్యాపార వ్యవహారాలపై హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన ఒక దర్యాప్తు నివేదిక వారి సామ్రాజ్యానికి బీటలు వారేలా చేసింది. కుబేరుల్లో మూడు నుంచి ఏడవ స్థానానికి రెండు రోజుల వ్యవధిలోని పడిపోయినట్లు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైనట్లు వార్తా మాధ్యమాలన్నీ గొల్లుమన్నాయి. అయితే కూలిపోయిన అదాని పేక మేడకు ఆశపడి రాళ్ళెత్తిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు, వ్యక్తిగత మదుపుదారులందరూ కన్నీళ్లు కార్చడం తప్ప వేరే దారి లేదు. దీని పర్యవసానంగా అదాని గ్రూపులో పెట్టుబడులు పెట్టిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కంపెనీల వాటాలన్నీ కూడా పడిపోతున్నవి. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ వంటి సంస్థల వాటాలు కూడా వేలకోట్ల నష్టాలు చవిచూశాయని వార్తలున్నాయి. ఇలాంటి సంస్థల కన్నా వ్యక్తిగత మదుపుదారులే భయాందోళనకు గురై అమ్ముకున్న కారణంగా చాలా నష్టపోయారు. షేర్లలో అవకతవకలకు, అకౌంట్స్‌లో మోసాలకు, మనీలాండరింగ్‌కు అదానీ గ్రూపు పాల్పడిందన్నది హిండెన్‌బర్గ్‌ నివేదిక సారాంశం. ఆ రిపోర్టులో లేవనెత్తిన పలు అంశాలు, ప్రశ్నలపై అదానీ సమాధానం చెప్పకుండా, తమను దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని ఎదురుదాడి చేశారు. ప్రతిగా తమ నివేదికపై కట్టుబడి ఉన్నామని, ఎలాంటి చర్యలకైనా సిద్ధమని హిండెన్‌బర్గ్‌ చేసిన సవాల్‌పై అదానీ వైపు నుంచి స్పందన శూన్యం.
పైకి రోల్‌మోడల్స్‌గా కనిపించే కార్పొరేట్ల చీకటి దందాలు హిండెన్‌బర్గ్‌ నివేదికతో మరోసారి బహిర్గతం అయ్యాయి. అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన కంపెనీల షేర్లను తిమ్మినిబమ్మిని చేసి కత్రిమంగా ధరలు పెంచుకున్నారు. ఆ షేర్లను తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి అడ్డగోలుగా అప్పులు తెస్తున్నారు. అందినకాడికి పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉన్న సింగపూర్‌, మారిషస్‌, కరీబియన్‌ దీవులు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి లాభాలను వాటిలోకి మనీలాండరింగ్‌ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇటువంటి అక్రమాలతోనే అదానీ గ్రూపులోని షేర్లు ఎకాయికిన 819 శాతం పెరిగాయి. నికర విలువ 231 శాతానికి ఎగబాకింది. మూడేళ్ల క్రితం గ్రూపు వర్త్‌ రూ.1.62 లక్షల కోట్లు కాగా ఇప్పుడు 9.78 లక్షల కోట్లు. ఈ స్వల్ప సమయంలో 8.1 లక్షల కోట్లు పెరగడం అసాధారణం. కరోనా విలయంతో ప్రజలు అల్లాడుతుండగా అదానీ సంపద అనూహ్యంగా పెరిగింది మోసాల నిచ్చెనతోనేనన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదు. హిండెన్‌బర్గ్‌ పేల్చిన బాంబుతో అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. రూ.వేల కోట్ల విలువైన సంపద ఆవిరైంది. షేర్‌ మార్కెట్‌లో సంపద గాలి బుడగ అనడానికి ఇదొక ఉదాహరణ. అదానీ గ్రూపులోని షేర్లలో 85 శాతం కుప్పకూలతాయని హిండెన్‌బర్గ్‌ చేసిన హెచ్చరికకు తాజా పరిణామం బలాన్ని చేకూరుస్తోంది.
హిండెన్‌బర్గ్‌ నివేదిక అదానీకో లేదంటే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకో పరిమితం కాదు. మోడీ ప్రభుత్వానికీ పెద్ద కుదుపు. అదానీ-మోడీ మధ్య అవినాభావ సంబంధం బహిరంగం. 1988లో చిన్న ఎగుమతి, దిగుమతి కంపెనీతో వ్యాపారం ప్రారంభించిన అదానీకి 1991 నుంచి దేశంలో ప్రారంభమైన సరళీకరణ విధానాలు ఊపునిచ్చాయి. గుజరాత్‌ సిఎంగా మోడీ వచ్చాక అదానీ ప్రభ వెలిగింది. మోడీ దేశ ప్రధాని అయ్యాక అదానీ వాణిజ్య సామ్రాజ్యం అవధులు దాటింది. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వే, రోడ్డు, విద్యుత్‌, గ్యాస్‌, బొగ్గు, రియల్‌, ఒకటేమిటి... సకలం అదానీ వశమవుతున్నాయి. కేంద్ర బిజెపి ఆశ్రితపక్షపాతం లేకుండా అదానీ ఇంతగా ఎదగడం అసాధ్యం. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లోనూ అదానీ చక్రంతిప్పడానికి మోడీ సర్కారే కారణం. డ్రగ్స్‌ అక్రమ రవాణాకు అదానీ పోర్టులు కేంద్రాలుగా మారాయని వెల్లడైంది. ఇంతకుముందు అక్రమాలకు సంబంధించిన కేసులలో అదానీ కంపెనీలపై సెబి నిషేధం విధించగా, దానిని జరిమానా కింద మార్పించుకుని అదానీ బయట పడ్డారు. సెబి, ఆర్‌ఒసి, ఇడి, సిబిఐ, నిఘా సంస్థలు కొమ్ము కాస్తున్నందునే అదానీ మార్కెట్‌ మాయాజాలం సక్సెస్‌ అయింది. ఇప్పటికైనా హిండెన్‌బర్గ్‌ రిపోర్టుపై కేంద్రం అదానీ ఆర్థిక అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తుందో లేదో వెండితెరపై చూడాల్సిన బొమ్మే!
అదానీ కోసం ఎల్‌ఐసి, ఎస్‌బిఐలు బలి..!
- కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు
హైదరాబాద్‌ : అదానీ గ్రూపు మోసాలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై మంత్రి కెటిఆర్‌ స్పందించారు. అదానీ గ్రూప్‌ స్టాక్‌ల్లో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సంస్థలు వరుసగా రూ.77వేల కోట్లు, రూ.80వేల కోట్లు చొప్పున ఎందుకు పెట్టుబడులుగా పెట్టాల్సి వచ్చిందని కెటిఆర్‌ శనివారం ప్రశ్నించారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సంస్థలను అలా నెట్టిందెవరు?.. అని కేంద్రాని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు సహాయం చేశారు?.. అని పేర్కొన్నారు. ఈ తీవ్రమైన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ దెబ్బకు అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 25 శాతం వరకు పతనం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్లపై అదే విధంగా ఎల్‌ఐసి, ఎస్‌బిఐ షేర్లపై తీవ్రంగా పడుతోంది. ఇతర బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కూడా ఒత్తిడికి గురి అవుతున్నాయి.
మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించాలి : ఎంఎల్‌సి కవిత
            స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు, షేర్ల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్విట్టర్‌ ద్వారా ఆమె డిమాండ్‌ చేశారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సహా ఇతర షేర్లలో తగ్గుదల, ఒడుదొడుకులు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ప్రతీ ఒక్క భారతీయుడికి కేంద్రం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. దీనిపై నెలకొన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సెబీ చీఫ్‌ మాధవి పూరీ బుచ్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన లక్షలాది మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరఫున స్పందించాలన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.