Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌

Tue 31 Jan 03:22:54.467058 2023

- ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థిక సర్వే
- రేపు నిర్మలమ్మ పద్దు 
- అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌ గైర్హాజరు

- అదానీ వల్ల ఎల్‌ఐసీకి జరిగిన నష్టాన్ని లేవనెత్తిన ప్రతిపక్షం 
- ప్రతి అంశంపై చర్చకు సిద్ధం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

న్యూఢిల్లీ : నేటీ (మంగళవారం) నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. అఖిలపక్ష సమావేశంలో అదానీ కంపెనీ వల్ల ఎల్‌ఐసీకి జరిగిన నష్టాన్ని, చైనా అంశాన్ని, బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం, కుల ఆధారిత జన గణనకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో నిబంధనల ప్రకారం ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల మద్దతును కోరుతున్నామని ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ జోషి, పియూష్‌ గోయల్‌, అర్జున్‌ రామ్‌ మేఫ్‌ు వాల్‌, వి.మురళీధరన్‌, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, టీఎంసీ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, సుఖేందు శేఖర్‌ రారు, సీపీఐ(ఎం) నేతలు ఎలమారం కరీం, పిఆర్‌ నటరాజన్‌, డీఎంకే నేత టిఆర్‌ బాలు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, వైసీపీ నేత వి.విజయసాయి రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేతలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఆర్‌జేడీ నేత మనోజ్‌ ఝా, ఆప్‌ నేత సంజరు సింగ్‌, జేడీయూ నేత రామ్‌ నాథ్‌ ఠాకూర్‌, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో 27 పార్టీలకు చెందిన 37 మంది నేతలు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌ రాజ్యసభ, లోక్‌సభ నేతలు జమ్మూ కాశ్మీర్‌లో భారత్‌ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఉండటంతో సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు.
సమావేశ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పార్లమెంట్‌లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం కోరుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నేత ఎలమారం కరీం, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజరు సింగ్‌, ఆర్జేడి నేత మనోజ్‌ కుమార్‌ ఝా, డీఎంకే ఎంపి టిఆర్‌ బాలు తదితరులు అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికలో ఉన్న అదానీ గ్రూప్‌ స్టాక్‌ మానిప్యులేషన్‌ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్‌లో దానిపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన ఆర్థిక గణన చేపట్టాలని జేడీయూ, ఆర్‌జేడీ వంటి పార్టీలతో కలిసి వైసీపీ డిమాండ్‌ చేసింది. మహిళ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని సీపీఐ(ఎం), టీఆర్‌ఎస్‌, టీఎంసీ, బీజేడీ సహా ఇతర పార్టీలు డిమాండ్‌ చేశాయి. సామాజిక, అభివృద్ధి సూచికల్లో వెనుకబడిన కులాల ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ పేర్కొంది. మొత్తం జనాభాలో వెనుకబడిన కులాల జనాభా 50 శాతానికి పైగా ఉన్నాయనీ, వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జనాభా గణన దోహదపడుతుందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో రిజర్వేషన్లు కల్పించేందుకు మహిళా కోటా బిల్లును కూడా ఆమోదించాలని తమ పార్టీ డిమాండ్‌ చేసిందని విజయసాయి రెడ్డి అన్నారు.
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో లోక్‌సభ, రాజ్యసభల ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు (నేడే) ఆర్థిక సర్వేను కూడా ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న (బుధవారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గురువారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. బడ్జెట్‌ సెషన్‌ మొదటి భాగం ఫిబ్రవరి 13న ముగుస్తుంది. డిపార్ట్‌మెంట్‌ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలు గ్రాంట్స్‌ కోసం డిమాండ్‌లను పరిశీలించడానికి, మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నివేదికలను రూపొందించడానికి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు దీనికి విరామం ఉంటుంది. బడ్జెట్‌ సెషన్‌ రెండో భాగం కోసం పార్లమెంట్‌ మార్చి 13న తిరిగి సమావేశమవుతుంది. బడ్జెట్‌ పత్రాలను పరిశీలించడానికి నెల రోజుల విరామంతో ఏప్రిల్‌ 6 వరకు కొనసాగుతుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే నిర్ణయించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.