Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నా యాత్ర ప్రజల కోసమే | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

నా యాత్ర ప్రజల కోసమే

Tue 31 Jan 04:14:00.926692 2023

- బీజేపీ నాయకులు ఇలా చేయలేరు.. వారికి భయం
- యాత్ర లక్ష్యం నెరవేరింది
- 'భారత్‌ జోడో' ముగింపు సభలో రాహుల్‌

- పాల్గొన్న మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక, ప్రతిపక్ష పార్టీల నాయకులు
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ కాశ్మీర్‌లో జరిగింది. కాంగ్రెస్‌ అగ్రనాయకులు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా, పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీగా మంచు వర్షం కురుస్తున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా వేలాది మంది కాంగ్రెస్‌ అభిమానులు, కార్య కర్తలు, మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ కురుస్తున్న మంచులోనే సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ యాత్ర ముగింపు సభ శ్రీనగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జెండా వందనంతో మొదలైంది. ప్రతికూల వాతారణ పరిస్థితుల్లోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా మంచు కురుస్తున్నప్పటికీ రాహుల్‌తో పాటు కాశ్మీర్‌ అగ్రనాయకులు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలు ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. '' దీనిని (యాత్ర) నేను నా కోసమో లేదా కాంగ్రెస్‌ పార్టీ కోసమో చేయలేదు. దేశ ప్రజల కోసం చేశాను. ఈ దేశ పునాదిని నాశనం చేయాలన్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా నిలబడటమే మా లక్ష్యం. జమ్మూకాశ్మీర్‌లో ఏ బీజేపీ నాయకుడూ ఈ విధంగా యాత్ర చేయలేడని నేను చెప్పగలను. భయం చేతనే వారు ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేరు'' అని తెలిపారు. కాశ్మీర్‌లో నాపై దాడి జరగొచ్చని నన్ను హెచ్చరించారనీ, కానీ.. ఇక్కడ ప్రజలు నాకు హ్యాండ్‌ గ్రెనేడ్లు ఇవ్వలేదనీ, ప్రేమతో నిండిన హృదయాలను ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, పీడీపీ, ఎన్‌సీ, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఐయూఎంఎల్‌ లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. భారత్‌ జోడో యాత్ర అనేది ఎన్నికల్లో విజయం సాధించడానికి కాదనీ, ఇది ద్వేషానికి వ్యతిరేకం అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రాహుల్‌ గాంధీ ఒక ఆశాకిరణమనీ మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలు అన్నారు.
భారత్‌వ్యాప్తంగా చేపట్టిన యాత్ర ముగింపు వేడుకలో భాగంగా 135 రోజుల సుదీర్ఘ కన్యాకుమరీ నుంచి కాశ్మీర్‌ యాత్రకు గుర్తుగా షెర్‌-ఇ-కాశ్మీర్‌ క్రికెట్‌ స్టేడియం వద్ద కాంగ్రెస్‌ మెగా ర్యాలీని చేపట్టింది. గతేడాది సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి లో భారత్‌ జోడో యాత్ర ప్రారంభమై 14 రాష్ట్రాలు.. 75 జిల్లాలను కవర్‌ చేస్తూ కాశ్మీర్‌లో ఆదివారం ముగిసిన విషయం విదితమే. ఈ యాత్రలో రాహుల్‌ మొత్తం 3500 కిలో మీటర్లు నడిచారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేయాలని చేపట్టిన భారత్‌ జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని ఆయన అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.