Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సాగుకు వెతలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సాగుకు వెతలు

Thu 02 Feb 04:09:04.63424 2023

- కార్పొరేట్లకు ఊతం
- సహకారంపై కేంద్రం పట్టు బిగింపు
- ఎంఎస్‌పీ చట్టబద్ధత ఊసే లేదు
న్యూఢిల్లీ:డెబ్బయి శాతం ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. సాగు పద్దులో అన్నింటికీ కోతలు పెట్టింది. సంక్షోభం, ఆపై మాంద్యం ప్రభావంతో సేద్యపురంగం కుదేలవగా, కోవిడ్‌ విలయం తోడు కావడంతో రైతుల, వ్యవసాయ కార్మికుల, గ్రామీణ ప్రజల జీవనోపాధి దెబ్బతింది. కార్పొరేట్లకు ఎన్ని ఉద్దీపన పథకాలిచ్చినా పారిశ్రామిక వృద్ధి పెరగలేదు. కానీ కోవిడ్‌ క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నది ఒక్క వ్యవసాయమే. మోడీ ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా ఆ రంగానికి 2023-24 బడ్జెట్‌లో కత్తెర పెట్టింది. మరోవైపు వ్యవసాయ రంగ కార్పొరేటీకరణకు నడుం కట్టింది. విరివిగా ప్రకృతి సేద్యం, డ్రోన్ల వాడకం, స్టార్టప్‌లకు ప్రత్యేక నిధి, సహకారరంగంపై కేంద్ర పట్టు బిగింపునకు మరిన్ని చర్యలు చేపడతామని ప్రకటించింది. ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహానికి 'పిఎం-ప్రణామ్‌' అనే పథకాన్ని ప్రతిపాదించింది. డెయిరీ, ఫిషరీస్‌ సహా వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లుగా సర్కారు పేర్కొంది. కాగా బ్యాంక్‌ రుణాలు వాస్తవ సాగుదారులకు అందట్లేదు.
28 వేల కోట్లు కట్‌
గత బడ్జెట్‌కు ఇప్పటికి వ్యవసాయానికి రూ.28 వేల కోట్లకుపైన కోత పడింది. 2022-23లో 1,51,521 కోట్లు ప్రతిపాదించారు. అప్పటి మొత్తం బడ్జెట్‌లో 3.84 శాతం. 2023-24లో 1,44,214 కోట్లు అన్నారు. మొత్తం బడ్జెట్‌లో 3.20 శాతం మాత్రమే. మునుపటి కంటే 0.64 శాతం తగ్గింది. తగ్గుదల సుమారు 28 వేల కోట్లు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసేందుకంటూ అమలు చేస్తున్న పిఎం కిసాస్‌, విపత్తుల వలన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే క్రాప్‌ ఇన్సూరెన్స్‌, రైతులకు కనీస మద్దతు ధర, పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ఉపకరించే ఫుడ్‌ సబ్సిడీ, తిండిగింజల సేకరణ పద్దుకూ కోతలే పెట్టారు. ఎరువుల సబ్సిడీకీ కత్తెరలే. ఎంఎస్‌పి గ్యారంటీకి చట్టబద్ధత కోసం రైతులు ఉద్యమిస్తుండగా బడ్జెట్‌లో ఆ అంశం మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. వ్యవసాయ కూలీలకు పనులు కల్పించే ఉపాధి హామీకి నిధులు భారీగా తగ్గించారు. ఆర్‌కెవివై, క్రిషియోన్నతి స్కీంలదీ అదే పరిస్థితి.
కార్పొరేట్‌- మతోన్మాదం
వ్యవసాయంలో కార్పొరేట్ల జోక్యం, ప్రైవేటు ఆధిపత్యం పెంచే పలు కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. రానున్న రోజుల్లో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం కిందికి తీసుకొచ్చి రసాయన ఎరువుల వాడకం తగ్గించడం ద్వారా రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తారు. తద్వారా రైతుల ఆదాయాలను సుస్థిరం చేస్తారు. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు పిఎం-ప్రణామ్‌ పథకాన్ని ప్రకటించారు. పైకి సేంద్రీయం అంటున్నా గోవు విసర్జితాలకు అధిక ప్రాధాన్యమిచ్చి మతోన్మాదాన్ని రైతులకు ఎక్కిస్తారు. వ్యవసాయంలో డ్రోన్లను ప్రవేశపెడతారు. కిసాన్‌ డ్రోన్లను పంటలపై అంచనాలు, భూరికార్డుల డిజిటలైజేషన్‌, ఎరువులు, పురుగుమందుల పిచికారీ వంటికి ఉపయోగిస్తారు.
సహకారరంగంపై కేంద్ర పెత్తనాన్ని పెంచేందుకు దేశంలోని 63 వేల పిఎసిఎస్‌ల కార్యకలాపాల డిజిటలైజేషన్‌ కోసం రూ.2,516 కోట్లు ఖర్చు చేస్తారు. భవిష్యత్తులో పిఎసిఎస్‌లను మల్టీపర్పస్‌ ప్రయోజన కేంద్రాలుగా మారుస్తారు. డెయిరీ, మత్స్య సహకార సొసైటీలను నెలకొల్పుతారు. గ్రామాల్లో స్టార్టప్‌లకు నాబార్డు ద్వారా ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. పత్తి పంట దిగుబడి, నాణ్యత పెంచేందుకు క్లస్టర్‌ తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ప్రవేశపెడతారు. నూనెల దిగుమతులు తగ్గించేందుకు నూనెగింజల సాగును, ఆరోగ్యం కోసం చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.