Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక

Sat 04 Feb 03:37:09.73923 2023

- పెరిగిన రాష్ట్ర ఆదాయం
- రెండంకెలకు చేరిన వృద్ధిరేటు
- కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు
- వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల కోసం రూ.1000కోట్లు
- కేరళ బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి బాలగోపాల్‌
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలతో ఒత్తిళ్ళు పెరుగుతున్నప్పటికీ కేరళ సమగ్రాభివృద్ధికి అనుసరించే ప్రణాళికను ఆర్థిక మంత్రి కె.ఎన్‌.బాలగోపాల్‌ శుక్రవారం వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేరళ వార్షిక బడ్జెట్‌ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ, ప్రకృతి విపత్తులు, కరోనా వంటి మహమ్మారులు విసిరిన సవాళ్ళన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగామని చెప్పారు. అభివృద్ధి రేటు రెండంకెలకు చేరుకుందనీ, 2012 తర్వాత ఇదే అత్యధికమని అన్నారు. అన్ని అడ్డంకులను, అవరోధాలను ప్రభుత్వం దాటగలిగిందని చెప్పారు. దుర్భర దారిద్య్రమనేది పూర్తిగా నిర్మూలించబడుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర స్వంత ఆదాయం పెరిగిందని, ఈ ఏడాది రూ.85వేల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. రుణాల ఉచ్చులో రాష్ట్రం చిక్కుకోదని చెప్పారు. అవసరమైతే మరిన్ని రుణాలు తీసుకోవడానికి రాష్ట్రానికి ఇంకా అవకాశం వుందన్నారు. కేంద్రం అనుసరించే ఘర్షణాయుత వైఖరే రాష్ట్రానికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి బోర్డు (కేఐఐఎఫ్‌బీ) ఇప్పటివరకు రూ.22,801 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అయితే, రాష్ట్ర అభివృద్ధి కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న కేఐఐఎఫ్‌బీని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు రూ.2వేల కోట్లను కేటాయించామని చెప్పారు. రబ్బర్‌ సబ్సిడీకి రూ.600కోట్లు కేటాయించామన్నారు. రూ.1000 వరకు ధర వుండే లిక్కర్‌పై రూ.20ను సామాజిక భద్రతా సెస్‌గా విధించనున్నట్లు ప్రకటించారు. వెయ్యి రూపాయిల ధర దాటిన వాటిపై రూ.40 సెస్సు వుంటుందన్నారు. పెట్రోల్‌పై రూ.2ను సామాజిక భద్రతా సెస్‌గా విధిస్తున్నట్టు బాలగోపాల్‌ ప్రకటించారు. టెక్నో పార్క్‌లో కొత్త డిజిటల్‌ సైన్స్‌ విభాగం ప్రారంభించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను ప్రారంభించేందుకు గానూ మేక్‌ ఇన్‌ కేరళ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లను కేటాయించినట్టు ప్రకటించారు. విజిళం రింగ్‌ రోడ్‌కు రూ.1000కోట్లు, విజిళం పోర్టు ప్రాజెక్టుతో సంబంధమున్న అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. వ్యవసాయాభివృద్ధి కోసం రూ.971కోట్ల ప్రాజెక్టును చేపడుతున్నట్టు తెలిపారు. కొబ్బరి కనీస మద్దతు ధరను రూ.2 పెంచారు. దాని ధరను రూ.34గా నిర్ధారించారు. కేరళ ఆర్‌టీసీకి రూ.3400కోట్లు కేటాయింపులు ప్రకటించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.