Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?

Sat 18 Mar 05:53:10.863715 2023

- పెండింగ్‌ హామీలపై ఇకనైనా దృష్టి
- పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వాలి
- మోడీ, అమిత్‌షాతో జగన్‌ భేటీ
న్యూఢిల్లీ : ''రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లైనా ఇప్పటి వరకు రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టి సారించాలి'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. పార్లమెంట్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సిఎం ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపు 35 నిమిషాల పాటు భేటీ సాగింది. అనంతరం సిఎం జగన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సుమారు 30 నిమిషాలపాటు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ఆయన చర్చించారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసినప్పటికీ, కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయని తెలిపారు. 2014-15 నాటి రెవెన్యూ లోటు కింద పెండింగ్‌లో ఉన్న రూ.36,625 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సిఎం కోరారు. రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని, పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.2,600.74 కోట్లు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన రూ.55,548 కోట్లను వెంటనే ఆమోదించాలని కోరారు. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వారీగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని, ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. నగదు బదిలీ (డిబిటి) పద్ధతిలో ముంపు బాధితులకు పరిహారమందిస్తే జాప్యాన్ని నివారించవచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనివల్ల పిఎంజికెఎవై కార్యక్రమం కిందకు రాని 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇవ్వడం వల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందని తెలిపారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్‌ కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 12 మెడికల్‌ కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌కు ఖనిజ కొరత లేకుండా ఎపిఎండిసికి గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.