సరికొత్త కాన్సెప్ట్తో 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. తాజాగా ఈ సినిమా టీజర్ను డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చూసిన ఆయన బాగుందని చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తి కరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్ ఉంది. శ్రీకాంత్ అర్పుల కెమెరా పనితనం,.ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ సంగీతం, ఆర్ఆర్ టీజర్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న ఈ సినిమా థియేటర్లోకి రానుంది అని చిత్ర బృందం పేర్కొంది.