Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
గెలుపే లక్ష్యంగా..! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

గెలుపే లక్ష్యంగా..!

Wed 30 Nov 03:27:26.676696 2022

         న్యూజిలాండ్‌ పర్యటన అఖరు అంకానికి చేరుకుంది. టీ20 సిరీస్‌ రెండు మ్యాచుల పోరుగా మారగా, తాజాగా వన్డే సిరీస్‌ను సైతం రెండు మ్యాచుల సమరంగా మారింది. వన్డే సిరీస్‌ కోల్పోకుండా ఉండేందుకు భారత్‌ నేడు చివరి వన్డేలో గెలిచి తీరాలి. 1-0 ఆధిక్యంలో ఉన్న కివీస్‌ నేడు మ్యాచ్‌లో ఓడినా, ఫలితం తేలకపోయినా సిరీస్‌ను కోల్పోయే పరిస్థితి లేదు. దీంతో నేడు ఒత్తిడంతా టీమ్‌ఇండియాపైనే. భారత్‌,న్యూజిలాండ్‌ మూడో వన్డే నేడు.
- ధావన్‌సేనకు ఇక చావోరేవో
- భారత్‌, కివీస్‌ చివరి వన్డే నేడు
- ఉదయం 7 నుంచి ప్రైమ్‌లో..
నవతెలంగాణ-క్రైస్ట్‌చర్చ్‌
ఆ ఇద్దరిలో ఎవరు? :
హామిల్టన్‌ వన్డేలో సంజు శాంసన్‌ స్థానంలో దీపక్‌ హుడాను తీసుకోగానే.. సోషల్‌ మీడియాలో ఆ టాపిక్‌ వైరల్‌గా మారింది. సంజు శాంసన్‌ను పక్కనపెట్టడంపై అభిమానులు, విశ్లేషకులు మండిపడ్డారు. సెడాన్‌ పార్క్‌లో ఆరో బౌలర్‌ కోసం దీపక్‌ హుడాను ఎంచుకున్నారు. కానీ, హాగ్లే ఓవల్‌లో ఆర్‌ బౌలర్‌ అవసరం భారత్‌కు అంతగా ఉండదు. దీంతో సంజు శాంసన్‌ను తిరిగి తీసుకుంటారా? దీపక్‌ హుడాను కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరం. టాప్‌ ఆర్డర్‌లో బ్యాటర్ల శైలి మరోసారి తెరపైకి రానుంది. ధావన్‌, గిల్‌ ఆశించిన వేగంతో పవర్‌ప్లేలో పరుగులు చేయటం లేదు. ఇక కివీస్‌ పర్యటనలో ఉనికి చాటుకోవటంలో పంత్‌ విఫలమయ్యాడు. నేడు చివరి వన్డేలోనైనా పంత్‌ పటాఫట్‌ ఇన్నింగ్స్‌ ఆడతాడేమో చూడాలి. ఇక వన్డే ఫార్మాట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ మార్క్‌ ఇన్నింగ్స్‌ ఆడలేదు. హామిల్టన్‌లో సూర్య మెరుపు వేగంతో ఆరంభించినా వర్షం అంతరాయం కలిగించింది. నేడు క్రైస్ట్‌చర్చ్‌లో మెగా ఇన్నింగ్స్‌ కోసం సూర్య ఎదురుచూస్తున్నాడు. ఇక స్పీడ్‌గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు హాగ్లే ఓవల్‌ సరైన పిచ్‌. ఇక్కడ మాలిక్‌ను ఎదుర్కొవటం కివీస్‌ బ్యాటర్లకు అంత సులువు కాబోదు. దీపక్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌లు మాలిక్‌తో కలిసి పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు కివీస్‌ పర్యటనలో అవకాశమే చిక్కలేదు. చివరి మ్యాచ్‌లోనైనా కుల్దీప్‌కు చోటు ఇస్తారేమో చూడాలి. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కొనసాగనున్నాడు.
జోరుమీదున్న కివీస్‌ :
వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ జోరుమీదుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌ దిశగా కివీస్‌ అప్పుడే ప్రణాళిక ఆరంభించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, డార్లీ మిచెల్‌, టామ్‌ లేథమ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ఫిన్‌ అలెన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మైకల్‌ బ్రాస్‌వెల్‌లు ఈ ఫార్మాట్‌లో తక్కువ ర్యాంక్‌ జట్లతో ఆడారు. అగ్రజట్లతో ఆడిన అనుభవం తక్కువ. భారత్‌తో మ్యాచుల్లో ఫిన్‌ అలెన్‌ అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వన్డేలో ఫిన్‌ అలెన్‌ స్వేచ్ఛగా ఆడేందుకు కెప్టెన్‌ కేన్‌ చాన్స్‌ ఇవ్వనున్నాడు. పేసర్‌ మైకల్‌ బ్రాస్‌వెల్‌ సైతం నేడు బరిలోకి దిగనున్నాడు. మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గుసన్‌, టిమ్‌ సౌథీలు దూకుడు మీదున్నారు. మిచెల్‌ శాంట్నర్‌ ఏకైక స్పిన్నర్‌గా తుది జట్టులో నిలువనున్నాడు. తొలి వన్డేలో ఫామ్‌ అందుకున్న కేన్‌ విలియమ్సన్‌ నేడు పూర్తి మ్యాచ్‌ సాధ్యపడితే.. శతక దాహం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాడు.
పిచ్‌, వాతావరణం : క్రైస్ట్‌చర్చ్‌లో బుధవారం వర్షం సూచనలు ఉన్నాయి. హామిల్టన్‌ మాదిరిగానే, ఇక్కడా కుదించిన ఓవర్ల మ్యాచ్‌ లేదా మ్యాచ్‌ పూర్తిగా రద్దుకు అవకాశం ఉంది. విరామం అనంతరం జరుగుతున్న వన్డే మ్యాచ్‌కు హాగ్లే ఓవల్‌లో ఇప్పటికే పూర్తి టికెట్లు అమ్ముడయ్యాయి. క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌ స్పీడ్‌స్టర్లకు, బ్యాటర్లకు సమానంగా అనుకూలించనుంది. స్పిన్నర్లకు ఈ పిచ్‌పై కాస్త కష్టమే కానుంది. ఇక్కడ గత చివరి మూడు వన్డేల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టునే విజయం వరించింది. టాస్‌ నెగ్గిన జట్టు బౌలింగ్‌ ఎంచుకోనుంది.
తుది జట్లు (అంచనా) :
న్యూజిలాండ్‌ : ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), డార్లీ మిచెల్‌, టామ్‌ లేథమ్‌ (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ శాంట్నర్‌, మైకల్‌ బ్రాస్‌వెల్‌/ఆడం మిల్నె, మాట్‌ హెన్రీ, టిమ్‌ సౌథీ, లాకీ ఫెర్గుసన్‌.
భారత్‌ : శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌/దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వెంద్ర చాహల్‌/కుల్దీప్‌ యాదవ్‌.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.