Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మళ్లీ వానొచ్చింది! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

మళ్లీ వానొచ్చింది!

Thu 01 Dec 03:31:53.670628 2022

           ఎడతెగని వర్షంతో తొలి టీ20 టాస్‌ పడకుండానే రద్దు అవటంతో మొదలైన భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటన.. వర్షం అంతరాయంతో ఫలితం తేలకుండా ముగిసిన మూడో వన్డేతో ముగిసింది. చివరి రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దు కావటంతో.. తొలి వన్డేలో గెలుపొందిన న్యూజిలాండ్‌ 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
- ఫలితం తేలని మూడో వన్డే
- 1-0తో సిరీస్‌ కివీస్‌ వశం

నవతెలంగాణ-క్రైస్ట్‌చర్చ్‌
            వరుణుడు నిలకడగా మైదానంలో తిష్ట వేసిన వైట్‌బాల్‌ ఫార్మాట్‌ సమరంలో.. పొట్టి సిరీస్‌ టీమ్‌ ఇండియా సొంతం కాగా, వన్డే సిరీస్‌ న్యూజిలాండ్‌ వశ పర్చుకుంది. వర్షం కారణంగా రెండు, మూడో వన్డేలు ఫలితం తేలకుండా ముగిశాయి. దీంతో తొలి వన్డేలో విజయం సాధించిన న్యూజిలాండ్‌ 1-0తో వన్డే సిరీస్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. క్రైస్ట్‌చర్చ్‌ వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 219 పరుగులకు కుప్పకూలింది. వాషింగ్టన్‌ సుందర్‌ (51, 64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (49, 59 బంతుల్లో 8 ఫోర్లు) భారత్‌ను ఆదుకున్నారు. ఛేదనలో న్యూజిలాండ్‌ 18 ఓవర్లలో 104/1 వద్ద ఉండగా వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్‌ను ముందుకు సాగనివ్వలేదు. తొలి వన్డేలో అజేయ శతకం బాదిన కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ లేథమ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు అందుకున్నాడు.
బ్యాటర్లు విఫలం : హాగ్లే ఓవల్‌లో సైతం భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. కెప్టెన్‌ ధావన్‌ (28), ఓపెనర్‌ గిల్‌ (13) సహా రిషబ్‌ పంత్‌ (10), సూర్యకుమార్‌ యాదవ్‌ (6), దీపక్‌ హుడా (12) విఫలమయ్యారు. టాప్‌ ఆర్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (49), లోయర్‌ ఆర్డర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ (51) విలువైన ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. ఈ ఇద్దరు రాణించటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసింది. కివీస్‌ పేసర్లు మిల్నె (3/57), మిచెల్‌ (3/25), సౌథీ (2/36) నిప్పులు చెరిగారు.
అలెన్‌ మెరిసె : ఛేదనలో ఫిన్‌ అలెన్‌ (57, 54 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అదరగొట్టాడు. తొలి వన్డేలో విఫలమైన అలెన్‌ క్రైస్ట్‌చర్చ్‌లో ఖతర్నాక్‌ అర్థ సెంచరీ నమోదు చేశాడు. డెవాన్‌ కాన్వే (38 నాటౌట్‌)తో కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఓపెనర్లు కదం తొక్కగా కివీస్‌ లక్ష్యం దిశగా వేగంగా సాగింది. కానీ 18 ఓవర్ల ఆట అనంతరం వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్‌ మళ్లీ సాధ్యపడలేదు.
డక్‌వర్త్‌ ఎందుకు లేదంటే? : సహజంగా రెండో ఇన్నింగ్స్‌ మొదలైన మ్యాచుల్లో వర్షం ఆటంకం కలిగిస్తే ఫలితాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో తేల్చుతారు. మూడో వన్డేలో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం సైతం ఫలితం తేలలేదు. ఈ నిబంధన ప్రకారం విజేతను నిర్ణయించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టు కనీసం 20 ఓవర్లు ఆడాలి. కివీస్‌ 18 ఓవర్ల ఆట మాత్రమే ఆడింది. డక్‌వర్త్‌ ప్రకారం కివీస్‌ 50 పరుగుల ముందంజలో నిలిచింది. కానీ 18 ఓవర్ల ఆట మాత్రమే సాగటంతో మూడో వన్డే ఫలితం తేలకుండా ముగిసింది.
స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌ : ధావన్‌ (బి) మిల్నె 28, గిల్‌ (సి) శాంట్నర్‌ (బి) మిల్నె 13, శ్రేయస్‌ (సి) కాన్వే (బి) ఫెర్గుసన్‌ 49, పంత్‌ (సి) ఫిలిప్స్‌ (బి) మిచెల్‌ 10, సూర్య (సి) సౌథీ (బి) మిల్నె 6, హుడా (సి) లేథమ్‌ (బి) సౌథీ 12, సుందర్‌ (సి) లేథమ్‌ (బి) సౌథీ 51, చాహర్‌ (సి) సౌథీ (బి) మిచెల్‌ 12, చాహల్‌ (సి) సౌథీ (బి) శాంట్నర్‌ 8, అర్షదీప్‌ (ఎల్బీ) మిచెల్‌ 9, ఉమ్రాన్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 21, మొత్తం : (47.3 ఓవర్లలో ఆలౌట్‌) 219.
వికెట్ల పతనం : 1-39, 2-55,3-85, 4-110, 5-121, 6-149, 7-170, 8-201, 9-213, 10-219.
బౌలింగ్‌ : సౌథీ 8.3-1-36-2, హెన్రీ 10-2-20-0, మిల్నె 10-0-57-3, ఫెర్గుసన్‌ 10-0-49-1, మిచెల్‌ 7-0-25-3, శాంట్నర్‌ 2-0-15-1.
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : అలెన్‌ (సి) సూర్య (బి) ఉమ్రాన్‌ 57, కాన్వే నాటౌట్‌ 38, విలియమ్సన్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (18 ఓవర్లలో 1 వికెట్‌) 104.
వికెట్ల పతనం : 1-97.
బౌలింగ్‌ : దీపక్‌ చాహర్‌ 5-0-30-0, అర్షదీప్‌ 5-1-21-0, ఉమ్రాన్‌ 5-0-31-1, సుందర్‌ 3-0-16-0.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.