Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి

Wed 25 Jan 03:33:48.665395 2023

- ఏర్పాటు ప్రక్రియలో సంప్రదించలేదు
- రెజ్లర్లు వినేశ్‌, సాక్షి, బజరంగ్‌ ట్వీట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ), బిజెపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలను విచారణ చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ పట్ల రెజ్లింగ్‌ క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ నియంతృత్వ విధానాలతో దశాబ్దకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ క్రీడాకారులు, బిజెపీ ఎంపీపై చట్టపర చర్యలు తీసుకోవాలని మూడు రోజుల పాటు జంతర్‌మంతర్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. జంతర్‌ మంతర్‌ ఆందోళనలో భారత్‌కు ఒలింపిక్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పతకాలు సాధించిన వినేశ్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, అన్షు మాలిక్‌, బజరంగ్‌ పూనియా, దీపక్‌ పూనియాలు ఉన్నారు. రెజ్లర్ల ఆందోళనకు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూఎఫ్‌ఐ బాధ్యతల నుంచి బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తాత్కాలికంగా తప్పిస్తూ, విచారణ కమిటీ ఏర్పాటు అంగీకారం తెలిపింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీతో రెజ్లర్లు మూడు రోజుల ఆందోళనను విరమించారు.
సంప్రదించలేదు! : డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సహా ఆఫీస్‌ బేరర్లను బాధ్యతలకు దూరంగా ఉండమని ఆదేశిస్తూ క్రీడాశాఖ సర్క్యూలర్‌ జారీ చేసింది. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలను విచారణ చేసే కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో రెజ్లింగ్‌ క్రీడాకారులతో భాగం చేస్తామని మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు. దిగ్గజ బాక్సర్‌ ఎంసీ మేరీకోమ్‌ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల విచారణ, పర్యవేక్షణ కమిటీని క్రీడాశాఖ సోమవారం ప్రకటించింది. మంత్రి హామీ మేరకు విచారణ కమిటీ ఏర్పాటు అంశంలో ఎటువంటి సంప్రదింపులు జరుపలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒలింపిక్‌ మెడలిస్ట్‌, దిగ్గజ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌, మిషన్‌ ఒలింపిక్‌ సభ్యురాలు, మాజీ షట్లర్‌ తృప్తి, సారు మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాధికా శ్రీమాన్‌, టాప్స్‌ మాజీ సీఈవో రాజేశ్‌ రాజగోపాలన్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నాలుగు వారాల్లో ఈ కమిటీ విచారణ నివేదికను క్రీడాశాఖకు అందజేయాల్సి ఉంది. కమిటీ నివేదికపై క్రీడాశాఖ తదుపరి నిర్ణయం తీసుకునే వరకు మేరీకోమ్‌ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీ డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను చూడనుంది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) సైతం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. మేరీకోమ్‌ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీతో కలిసి ఐఓఏ కమిటీ సైతం సమాంతర విచారణ జరుపనుంది. ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ (ప్రభుత్వ ఉద్యోగి)ను సస్పెండ్‌ చేస్తూ క్రీడాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట తప్పడంపై రెజ్లర్లు ట్విట్టర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'డబ్ల్యూఎఫ్‌ఐపై విచారణ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు ముందు మమ్మల్ని (రెజ్లర్లు) సంప్రదిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియలో ఎవరూ సంప్రదించే ప్రయత్నం చేయకపోవటం అత్యంత విచారకరం' అంటూ వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని నరెంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌లను ట్యాగ్‌ చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.