Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
గెలిపించిన రాహుల్‌, జడేజా | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

గెలిపించిన రాహుల్‌, జడేజా

Sat 18 Mar 05:54:52.761587 2023

- పేసర్ల దెబ్బకు ఆసీస్‌ కుదేల్‌ శ్రీ మిచెల్‌ మార్ష్‌ అర్ధసెంచరీ
- తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
ముంబయి: వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ జట్టు భారత పేసర్ల ధాటికి 188పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఛేదన లో భారతజట్టు ఐదు వికెట్లు కోల్పోయి 191పరుగులు చేసి గెలిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ హెడ్‌(5) నిరాశపరిచినా.. కెప్టెన్‌ స్మిత్‌, మిఛెల్‌ మార్ష్‌ కలిసి 2వ వికెట్‌కు 72పరుగులు జతచేశారు. ఆ తర్వాత స్మిత్‌(22) ఔటైనా.. మిఛెల్‌ మార్ష్‌(81) ధాటిగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఓ దశలో 4వికెట్ల నష్టానికి 169పరుగులు భారీస్కోర్‌ చేసేలా కనిపించింది. ఆసీస్‌ జట్టు 19పరుగుల వ్యత్యాసం లో చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మిచెల్‌ మార్ష్‌ టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో షమీ, సిరాజ్‌ కు మూడేసి, జడేజాకు రెండు, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా తలా ఒక వికెట్‌ దక్కాయి.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్‌ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (3)ను స్టొయినిస్‌ ఔట్‌ చేయగా.. తర్వాత విరాట్‌ కోహ్లీ(4), సూర్యకుమార్‌(0)ను వరుస బంతుల్లో స్టార్క్‌ ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఆ దశలో క్రీజ్‌లో కుదురుకుని ఆడిన శుభమన్‌ గిల్‌(20)ను కూడా స్టార్క్‌ ఔట్‌ చేశాడు. దీంతో భారతజట్టు 39పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య(25)తో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కానీ, కీలక సమయంలో హార్దిక్‌ ఔట్‌ కావడంతో భారత్‌ 83పరుగులవద్ద ఐదో వికెట్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌ జడేజా- రాహుల్‌ కలిసి 6వ వికెట్‌కు 108 పరుగులు జతచేసి మ్యాచ్‌ ముగించారు. కేఎల్‌ రాహుల్‌ (75నాటౌట్‌), రవీంద్ర జడేజా (45నాటౌట్‌) కీలక పరుగులు చేశారు. దీంతో భారత్‌ 39.5ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191పరుగులు చేసి గెలిచింది. ఆసీస్‌ బౌలర్లు స్టార్క్‌కు మూడు, స్టొయినీస్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలువగా.. రెండో వన్డే విశాఖ వేదికగా ఆదివారం(19న) జరగనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జడేజాకు లభించింది.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి)సిరాజ్‌ 5, మిఛెల్‌ మార్ష్‌ (సి)సిరాజ్‌ (బి)జడేజా 81, స్మిత్‌ (సి)రాహుల్‌ (బి)హార్దిక్‌ 22, లబూషేన్‌ (సి)జడేజా (బి)కుల్దీప్‌ 15, ఇంగ్లిస్‌ (బి)షమీ 26, గ్రీన్‌ (బి)షమీ 12, మ్యాక్స్‌వెల్‌ (సి)హార్దిక్‌ (బి)జడేజా 8, స్టోయినీస్‌ (సి)శుభ్‌మన్‌ (బి)షమీ 5, అబట్‌ (సి)శుభ్‌మన్‌ (బి)సిరాజ్‌ 0, స్టార్క్‌ (నాటౌట్‌) 4, జంపా (సి)రాహుల్‌ (బి)సిరాజ్‌ 0, అదనం 10. (35.4ఓవర్లలో ఆలౌట్‌) 188పరుగులు. వికెట్ల పతనం: 1/5, 2/77, 3/129, 4/139, 5/169, 6/174, 7/184, 8/184, 9/188, 10/188 బౌలింగ్‌: షమీ 6-2-17-3, సిరాజ్‌ 5.4-1-29-3, హార్దిక్‌ 5-0-29-1, శార్దూల్‌ 2-0-12-0, జడేజా 9-0-46-2, కుల్దీప్‌ 8-1-48-1.
ఇండియా ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (ఎల్‌బి) స్టొయినీస్‌ 3, శుభ్‌మన్‌ (సి)లబూషేన్‌ (బి)స్టార్క్‌ 20, కోహ్లి (ఎల్‌బి) 4, సూర్యకుమార్‌ (ఎల్‌బి)స్టార్క్‌ 0, కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 75, హార్దిక్‌ పాండ్యా (సి)గ్రీన్‌ (బి)స్టొయినీస్‌ 25, జడేజా (నాటౌట్‌) 45, అదనం 19. (39.5ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 191పరుగులు. వికెట్ల పతనం: 1/5, 2/16, 3/16, 4/39, 5/83 బౌలింగ్‌: స్టార్క్‌ 9.5-0- 49-3, స్టొయినీస్‌ 7-1-27-2, అబట్‌ 9-0- 31-0, గ్రీన్‌ 6-0-35-0, జంపా 6-0-37-0, మ్యాక్స్‌వెల్‌ 2-0-7-0.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌
కథ ముగిసింది
తీరంలో తేల్చేస్తారా?
సెమీస్‌కు త్రీసా-గాయత్రి
అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ గుడ్‌బై
గిల్‌, రాహుల్‌కు పరీక్ష
నిఖత్‌ శుభారంభం
ఐపిఎల్‌-2023 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వార్నర్‌
ఫిఫా అధ్యక్షునిగా ఇన్ఫాంటినో మళ్లీ ఎన్నిక
క్వార్టర్స్‌కు త్రీషా-గాయత్రి జోడీ
వన్డే ప్రపంచకప్‌ ముందు ఆటగాళ్లకు గాయాలు
తొలిరౌండ్‌లోనే ఓడిన సింధు
ముగిసిన భారత్‌ పోరు
నందినికి రజత పతకం
పంచ్‌ పడుద్ది!
కేన్‌, సౌథీకి లైన్‌ క్లియర్‌
ఎత్తర ట్రోఫీ..నాల్గోసారి
శ్రీలంకపై కివీస్‌ గెలుపు
శాట్స్‌ సమీక్షా సమావేశం
కోహ్లి కొట్టాడు 186
కివీస్‌ లక్ష్యం 285
ఇగా స్వైటెక్‌ ముందంజ
శతక శుభ్‌మన్‌
సిట్సిపాస్‌ నిష్క్రమణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.