Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మైనార్టీల సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యత | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

మైనార్టీల సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యత

Sat 26 Nov 05:06:05.370868 2022

- అన్ని రంగాల్లోనూ ముందు ఉండేలా ప్రణాళిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
            రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నది. ముస్లిం మైనార్టీల జీవితాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ఆచరణాత్మక విధానాన్ని అమలు చేస్తున్నది. 2022-23 బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమం కోసం రూ.1724.696 కోట్లు కేటాయించింది. ఇతర వర్గాలతో సమానంగా వారికి సముచితమైన వాటా దక్కేలా చూస్తున్నది. వారి సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా మైనార్టీల కోసం షాదీ ముబారక్‌ను అమలు చేస్తున్నది. ఇప్పటి వరకు 2014 -15 నుంచి ఇప్పటి వరకు 2,28,200 మందికి ఆర్థిక సహాయం అందించింది. ఆ పథకం ద్వారా ఒక్కొకరికి రూ.1,00,116ల ఆర్థిక సహాయం అందుతున్నది. పేద మైనార్టీలకు ఎంతో మేలు చేకూరుతున్నది. 2014-15 నుంచి 2022-23 వరకు రూ.2165 కోట్లు ఈ పథకానికి కేటాయించింది. రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యలో భాగంగా మైనార్టీలను ఉచిత విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించాలని 204 మైనార్టీల రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించడంతోపాటు జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. విద్యాసంస్థల్లో 1,30,560 మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్క సంస్థలో 640 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన జరుగుతున్నది. 107బాలురు, 97 బాలికలకు సంబంధించిన విద్యాలయాలున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించి వారికి విలువతో కూడుకున్న పరిజ్ఞానం అందిస్తున్నది. మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీఎం ఓవర్‌ సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని 2015-2016లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఇప్పటివరకు 2725 మంది ఎంపికయ్యారు. 436 కోట్ల ఆర్థికసహాయం అందించింది. ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. 2022-23 బడ్జెట్‌లో 100 కోట్లు కేటాయించింది. వారికి పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లో రూ.40 కోట్లు, ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.150 కోట్లు కేటాయించింది. 66 మంది ఉర్దూ ట్రాన్స్‌లెటర్లను నియమించింది. ఫకీర్‌ కమ్యునిటీ వారి సంక్షేమం కోసం 110 మోపెడ్లను పంపిణీ చేసింది. రంజాన్‌ సందర్భంగా గిఫ్ట్‌ ప్యాకెట్ల పంపిణీ, ప్రతినెలా ఇమామ్‌లకు రూ. 10 వేలు , మౌజమ్‌లకు రూ. 5వేల గౌరవవేతనం, 100 మంది మైనార్టీ విద్యార్థులకు ఐఏఎస్‌ కోచింగ్‌, మక్కా మసీదు రిపేర్లకు రూ.8.48 కోట్లు, అనీసుల్‌ గుర్బాకు రూ. 39 కోట్లు, జహంగీర్‌ పీర్‌ దర్గా అభివృద్ధికి 50 కోట్లు, జామియా, నిజామియా ఆడిటోరియానికి రూ.14.65 కోట్లు, ఇస్లామిక్‌ ఏఎంపీ కల్చరల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రూ.40 కోట్లు కేటాయించింది. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఓన్‌ యువర్‌ ఆటో, డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం, కుట్టు మిషన్ల పంపిణీ, సబ్సిడీతో కూడిన బ్యాంక్‌ రుణాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హిమాయత్‌నగర్‌లో కుంగిన రోడ్డు
మంత్రి సబిత రాజీనామాకు కుట్ర!
పిల్లల ప్రతిభాపాటవాలకు వేదిక తెలంగాణ బాలోత్సవం
గుడి ధ్వంసంపై ఆదివాసీల ఆగ్రహం
అమరుల ఆశయసాధనకు పునరంకితమవుదాం
9,10 తరగతులకు బోధించలేం
సింగరేణిలో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం
బస్సుల్లో రేడియో ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ వీసీ సజ్జనార్‌
ఎంపీ అవినాశ్‌రెడ్డిని నాలుగు గంటలు విచారించిన సీబీఐ
61 ఏండ్ల వరకు కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపు
టీ జూడా నూతన అధ్యక్షునిగా డాక్టర్‌ కౌశిక్‌
విద్యుత్‌ వినియోగదారులపై అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలి
జ్యూట్‌ బోర్డు వద్ద కార్మికుల ధర్నా
గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్లు కేటాయించాలి
అదానీ అవకతవకలపై సెబి, ఈడీ విచారణ జరపాలి
ఆ మూడింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించండి
ప్రారంభమైన స్టార్టప్‌-20 సమావేశం
గ్రూప్‌-4కు 7.41 లక్షల దరఖాస్తులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యం
కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్‌ కుమార్‌ భేటీ
కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే
స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.