Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నేటి నుంచి నాగర్‌కర్నూల్‌లో టీఎస్‌జీపీఈడబ్ల్యూయూ నాలుగో మహాసభలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

నేటి నుంచి నాగర్‌కర్నూల్‌లో టీఎస్‌జీపీఈడబ్ల్యూయూ నాలుగో మహాసభలు

Sat 26 Nov 05:05:49.609074 2022

- మధ్యాహ్నం 12:30కి మహాప్రదర్శన ప్రారంభం
- ఆతర్వాత బహిరంగ సభ
- వేలాదిగా తరలిరానున్న గ్రామపంచాయతీ కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) నాలుగో రాష్ట్ర మహాసభ జరుగనున్నది. 26న మధ్యాహ్నం 12:30 గంటలకు నాగర్‌కర్నూల్‌లోని లహరి గార్డెన్‌ నుంచి జెడ్పీ హైస్కూల్‌ గ్రౌండ్‌ వరకు గ్రామపంచాయతీ కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. ఆ తర్వాత జెడ్పీ హైస్కూల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఉంటుంది. ప్రదర్శనలో మహిళా బృందం ముందుభాగంలో నడువనున్నది. మహాసభ అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగనున్నది. ఈ మహాసభకు 400 మంది ప్రతినిధులు రానున్నారు. ముఖ్య అతిథులుగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణపతిరెడ్డి, చాగంటి వెంకటయ్య పాల్గొననున్నారు. జీపీ కార్మికులకు ప్రస్తుతం అందుతున్న రూ.8,500 వేతనాన్ని సాధించడంలో టీఎస్‌జీపీఈడబ్ల్యూయూ పాత్ర మరువలేనిది. అయితే, పెరిగిన నిత్యావసర ధరలు, ఇతరత్రా ఖర్చుల నేపథ్యంలో ఈ వేతనాలు సరిపోవు వారికి కనీస వేతనాలు ఇవ్వడంతోపాటు పర్మినెంట్‌ చేయాలని నిఖరంగా పోరాడుతున్నది. మల్టీపర్పస్‌ విధానం రద్దు, జీవో నెంబర్‌ 51 సవరణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నది. జీపీల్లో పనిచేసే కలం కార్మికులైన కారోబార్లు, బిల్‌కలెక్టర్లకు ప్రత్యేక హౌదా కల్పించాలని రాష్ట్ర సర్కారుతో కొట్టాడుతున్నది. జీపీ కార్మికుల సమస్యలపై ఇప్పటికే ఒకసారి ప్రగతిభవన్‌ను కూడా ముట్టడించిన సంగతి తెలిసిందే.
కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నది. ఈ నేపథ్యంలో టీఎస్‌జీపీఈడబ్ల్యూయూ పోరాటాల వల్ల కొన్ని విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మున్సిపాల్టీల్లోని కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని జీపీ కార్మికులకూ ఇవ్వాలనీ, ఒకే పనిచేసేవారికి వేతనాల్లో తేడా ఎందుకు అని రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నది. గ్రామ పంచాయతీల నిధులను సకాలంలో ఇవ్వాలనీ, కార్మికుల వేతనాలను ప్రభుత్వమే వారి ఖాతాల్లో వేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కారును ఎప్పటి నుంచో కోరుతున్నది. హక్కుల కోసం, కనీస వేతనాల కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ గ్రామపంచాయతీ కార్మికుల ఆదరాభిమానాలను చూరగొంటున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆ యూనియన్‌ రాష్ట్ర మహాసభలకు ప్రత్యేకత నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి బహిరంగ సభకు వేలాది మంది కార్మికులు తరలిరానున్నారు. మహాసభలో గ్రామ పంచాయతీ కార్మికుల కోసం చేయాల్సిన భవిష్యత్‌ పోరాటాల కార్యాచరణ, గత మహాసభ నుంచి నేటి వరకు చేసిన పోరాటాలపై ప్రధానంగా చర్చ నడువనున్నది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణకు అన్యాయం
పేదలకు గుంట భూమి ఇవ్వరా..
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..
సీఎం సాబ్‌... ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి...
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలివ్వాలి
లోపాలు సరిదిద్దుకుంటేనే మనుగడ
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం
వేతన జీవులకు మొండి చేయి : టీఎస్‌యూటీఎఫ్‌
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
9న మహాధర్నాను విజయవంతం చేయండి
'కాసాని' తల్లి అంత్యక్రియలు పూర్తి
విద్యా వైద్యాన్ని వదిలేసిన పద్దు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక
పీఆర్సీపై యాజమాన్యంతో టీఈఈజేఏసీ చర్చలు
'యోగాసన' విజేతలకు బహుమతులు ప్రదానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన అమిత్‌జోగి
గండ్ర దంపతులకు 'డబుల్‌ ఇండ్ల'పై నిరసన సెగ
మొదలైన మేడారం మినీ జాతర
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌ బాధ్యతల స్వీకరణ
బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు
తెలంగాణ ఊసే లేదు :వైఎస్‌ షర్మిల
కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్టా..? కొన్ని రాష్ట్రాల పద్దా...?
ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే రాయితీలు
'ఆపరేషన్‌ స్మైల్‌'తో 2814 మంది పిల్లలకు విముక్తి
ఉపాధ్యాయ బదిలీలకు 59,741 దరఖాస్తులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.