Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రైతాంగాన్ని కాపాడుకుందాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

రైతాంగాన్ని కాపాడుకుందాం

Sun 27 Nov 04:11:14.701546 2022

- ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తాం
- పంటల విధానంలో మార్పులు చేయాలి
- రైతు బీమా ఏజ్‌లిమిట్‌ మార్చాలి
- కౌలు, పోడు రైతులకు హక్కులు రావాలి
- మహాసభల్లో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం
'దేశాన్ని రక్షించుకుందాం...రైతాంగాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ చెప్పారు. వ్యవసాయం, రైతు సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. పంటల సాగు విధానంలో చాలా వ్యత్యాసం ఉందన్నారు. దీంతో వరి, పత్తి తప్ప మిగతా పంటలకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. రైతు బంధు, రైతు బీమా అమలు చేయడం వెనక రైతు సంఘం ఒత్తిడి ఉందన్నారు. రైతు బీమా పథకంలో ఏజ్‌లిమిట్‌ (18 నుంచి 58 ) మార్చాలనీ, తద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించాలని కోరారు. కౌలు, పోడు రైతుల హక్కులతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆది, సోమ, మంగళవారాల్లో నల్లగొండ పట్టణంలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని నవతెలంగాణ ప్రతినిధి గుడిగ రఘుతో సాగర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు.
మహాసభల ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది?
           తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంటల కొనుగోళ్లు, మద్దతు ధరల సమస్య, ధరణి పోర్టల్‌తో రైతులకు కొత్త చిక్కులు, కౌలు రైతులు, పోడు సమస్య... ఇలా చెప్పుకుంటూపోతే అన్నదాతలు ఎన్నో సమస్యలతో అవస్థలు పడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మరిన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. వీటన్నింటిపై మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం. మద్దతు ధరలకు అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరమున్నది.
భూనిర్వాసితులకు ఇప్పటికీ సాయం ఉందా?
           రాష్ట్రంలో దశాబ్దాలుగా భూనిర్వాసితుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం, ఓఆర్‌ఆర్‌, జాతీయ రహదారులు, ఫార్మా, నిమ్జ్‌ తదితర ప్రాజెక్టుల్లో ఎంతో మంది రైతులు తమ భూములను కోల్పోయారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం ఇవ్వాలి. కానీ ఎక్కడా అమలు చేయడంలేదు. చట్టం తో సంబంధం లేకుండా పాలకులు నిర్వాసితులతో బేరసారాలు చేస్తున్నారు. పరిహారం విషయంలో ఆరు లక్షలు ఇస్తున్నారు. భూ నిర్వాసితులు న్యాయమైన డిమాండ్‌ సాధించాల్సి ఉన్నది. శాశ్వతంగా భూములు కోల్పోతారు. నిర్వాసితుల నష్టం తక్కువగా ప్రాజెక్టుల డిజైన్‌ మార్చాలని అడిగాం. అయితే ఎక్కడా అమలు చేయలేదు. వారికి న్యాయమైన పరిహారం అందేలా ఉద్యమిస్తాం.
తెలంగాణ రైతు సంఘం నిర్వహించిన పోరాటాలేంటి? సాధించిన ఫలితాలేంటిి?
           రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతంగా జరిగాయి. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి నష్టపరిహారం అందించాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపట్టాం. ఆయా కుటుంబాల తో ఢిల్లీలో ధర్నాలు నిర్వహించాం. గతంలో ఎక్స్‌గ్రేషియా లక్షన్నర ఉండేది. మా పోరాట ఫలితంగా ఆరు లక్షలు ఇస్తున్నారు. రైతు కుటుంబా లకు రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను ప్రకటించింది. రైతు బీమా కోసం 18 నుంచి 58 వయస్సు నిబంధనను మార్చాలి. అది మంచి స్కీమ్‌. వ్యవసాయ శాఖ నేరుగా రైతు బీమా ఇవ్వాలి. తద్వారా 25లక్షల కుటుంబాలకు అదనంగా ప్రయో జనం కలుగుతుంది. ఐదెకరాల లోపు రైతులకు పెట్టుబడి సాయం కోరాం. అనేక దేశాల్లో ఇస్తున్నారు. 13 లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు. వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహాసభకు 32 జిల్లాల నుంచి వెయ్యి మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరు అవుతు న్నారు. ఆదివారం జరగనున్న మహాప్రదర్శనలో 50వేల మంది రైతులు పాల్గొంటున్నారు.
అసైన్డ్‌ భూముల శాశ్వత పట్టాల సమస్య ఏంటి?
           అత్యంత నిరుపేదలకు అసైన్డ్‌ భూములిచ్చారు. వాటిని అమ్మకాలు, కొనుగోలు చేసేందుకు వీలులేదు. పట్టాదారులతోపాటు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి. డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతివనాలు, శ్మశాన వాటికల కోసం పేదల భూములను తీసుకున్నారు. వారికి ఏ రకమైన పరిహారం ఇవ్వలేదు. పట్టా భూమితో సమానంగా వారికి పరిహారం ఇవ్వాలి. సాగు నీటి వనరులు పెరిగాయి. సకాలంలో వానలు కురిశాయి. ఉచిత కరెంట్‌, బోర్లు తదితర కారణాలతో వడ్ల ఉత్పత్తి పెరిగింది. కొత్త ప్రాజెక్టుల కింద పంటలు బాగా పండుతున్నాయి. దాన్ని అంగీకరించాల్సిందే.
విద్యుత్‌ సవరణ బిల్లుతో రైతులకు కలిగే ఇబ్బందులేంటి?
           విద్యుత్‌ సవరణ బిల్లుతో కేవలం రైతులకే కాదు యావత్‌ ప్రజానీకానికీ నష్టమే. విద్యుత్‌ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడంలో భాగంగానే ఈ చట్టం వచ్చింది. విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలి. సోలార్‌, హైడల్‌, గాలి, థర్మల్‌ ప్రయివేటీకరణ అవుతాయి. ట్రాన్స్‌మిషన్‌ ప్రయివేటీకరణ అయితే రైతులపై తీవ్రమైన భారం పడుతుంది. రీచార్జ్‌ లేకపోతే సెల్‌ఫోన్లు ఆగిపోయినట్టు మోటార్లు ఆగిపోతాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో రైతులకు అన్యాయం చేస్తున్నది. పీఎం సమ్మాన్‌ నిధి లబ్దిదారులను 11 కోట్ల లబ్దిదారుల నుంచి మూడున్నర కోట్లకు కుదించారు. రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చదు. ఇత్యాధి విషయాలపై మహాసభల్లో చర్చిస్తాం.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హిమాయత్‌నగర్‌లో కుంగిన రోడ్డు
మంత్రి సబిత రాజీనామాకు కుట్ర!
పిల్లల ప్రతిభాపాటవాలకు వేదిక తెలంగాణ బాలోత్సవం
గుడి ధ్వంసంపై ఆదివాసీల ఆగ్రహం
అమరుల ఆశయసాధనకు పునరంకితమవుదాం
9,10 తరగతులకు బోధించలేం
సింగరేణిలో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం
బస్సుల్లో రేడియో ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ వీసీ సజ్జనార్‌
ఎంపీ అవినాశ్‌రెడ్డిని నాలుగు గంటలు విచారించిన సీబీఐ
61 ఏండ్ల వరకు కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపు
టీ జూడా నూతన అధ్యక్షునిగా డాక్టర్‌ కౌశిక్‌
విద్యుత్‌ వినియోగదారులపై అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలి
జ్యూట్‌ బోర్డు వద్ద కార్మికుల ధర్నా
గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్లు కేటాయించాలి
అదానీ అవకతవకలపై సెబి, ఈడీ విచారణ జరపాలి
ఆ మూడింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించండి
ప్రారంభమైన స్టార్టప్‌-20 సమావేశం
గ్రూప్‌-4కు 7.41 లక్షల దరఖాస్తులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యం
కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్‌ కుమార్‌ భేటీ
కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే
స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.