Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
జీపీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

జీపీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

Sun 27 Nov 04:41:53.030924 2022

- హక్కులను హరిస్తే ఊరుకోం...
- మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న ఢిల్లీ ముట్టడి
- సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు
- గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాలుగో మహాసభ ప్రారంభం
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
''కార్మికుల హక్కులను హరిస్తే పాలకవర్గాలకు శంకరగిరి మాన్యాలు తప్పవు.. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న పంచాయతీ కార్మికులకు కనీస వేతన చట్టం ఎందుకు అమలు చేయడం లేదు? కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలి..''అని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు డిమాండ్‌ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాలుగో మహాసభ శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా గ్రామపంచాయతీ పరిధిలో సేవలందిస్తున్న కార్మికులకు కనీస వేతనం ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, విధానాలు మారుతున్నా కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మురికిలో పనిచేస్తూ అనారోగ్యాలకు గురవుతున్న కార్మికులు బలమైన ఆహారం తీసుకోలేని దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కనీస వేతనం రూ.26000 పెంచాలని దేశ ఉన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 24 గంటలు అత్యవసర సేవలు అందిస్తున్న ఆశాలు, అంగన్‌వాడీలు, గ్రామపంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ వెలిగిపోతుందన్న మోడీ.. ఆకలి దారిద్య్రంలో మన దేశం ప్రపంచంలో 107వ స్థానంలో ఎందుకు నిలిచిందని ప్రశ్నించారు. దేశ ఆహార నిలువలను పందికొక్కులు కాజేస్తున్నా.. బడుగు బలహీన వర్గాలు, పేదలకు పంపిణీ చేయడం లేదన్నారు. దేశ సంపద 100 రూపాయల్లో 73 రూపాయలు ఒకరికి చెందితే. 27 రూపాయలు 99 మందికి వెళ్తున్నాయని చెప్పారు. శాశ్వత పనుల దగ్గర ఉద్యోగస్తులను సైతం శాశ్వత ఉద్యోగులుగా నియమించాలన్న నిబంధనలను తుంగలో తొక్కడం దారుణం అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తానన్న కేసీఆర్‌ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గజపతి, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి మల్లేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణకు అన్యాయం
పేదలకు గుంట భూమి ఇవ్వరా..
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..
సీఎం సాబ్‌... ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి...
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలివ్వాలి
లోపాలు సరిదిద్దుకుంటేనే మనుగడ
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం
వేతన జీవులకు మొండి చేయి : టీఎస్‌యూటీఎఫ్‌
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
9న మహాధర్నాను విజయవంతం చేయండి
'కాసాని' తల్లి అంత్యక్రియలు పూర్తి
విద్యా వైద్యాన్ని వదిలేసిన పద్దు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక
పీఆర్సీపై యాజమాన్యంతో టీఈఈజేఏసీ చర్చలు
'యోగాసన' విజేతలకు బహుమతులు ప్రదానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన అమిత్‌జోగి
గండ్ర దంపతులకు 'డబుల్‌ ఇండ్ల'పై నిరసన సెగ
మొదలైన మేడారం మినీ జాతర
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌ బాధ్యతల స్వీకరణ
బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు
తెలంగాణ ఊసే లేదు :వైఎస్‌ షర్మిల
కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్టా..? కొన్ని రాష్ట్రాల పద్దా...?
ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే రాయితీలు
'ఆపరేషన్‌ స్మైల్‌'తో 2814 మంది పిల్లలకు విముక్తి
ఉపాధ్యాయ బదిలీలకు 59,741 దరఖాస్తులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.