Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎన్‌ఈపీ అమలుతో మహిళలు విద్యకు దూరం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఎన్‌ఈపీ అమలుతో మహిళలు విద్యకు దూరం

Sun 04 Dec 04:43:39.583381 2022

- దేశంలో అసమానతలు పెరిగే ప్రమాదం : ఎస్‌ఎఫ్‌ఐ సెమినార్‌లో ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని అమలు చేయడం వల్ల మహిళలు విద్యకు దూరమయ్యే ప్రమాదముందని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) ప్రొఫెసర్‌ ఆమంచి నాగేశ్వర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యరంగంలో అసమానతలు పెరిగే ప్రమాదముందని విమర్శించారు. దేశంలో డ్రాపౌట్స్‌ పెరుగుతారనీ, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌ కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో 'నూతన విద్యావిధానం-మహిళల విద్య'అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. ఆ సంఘం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు లెనిన్‌ గువేరా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే విద్యారంగంలో అసమానతలు పెరిగాయని అన్నారు. ఎన్‌ఈపీ అమలుతో పాఠశాలలు విలీనమవుతాయనీ, మహిళల విద్య కుంటు పడుతుందని వివరించారు. దేశంలో పురుషుల అక్షరాస్యత 82.4 శాతం ఉంటే, మహిళల అక్షరాస్యత 65.8 శాతం ఉందని చెప్పారు. నూతన విద్యా విధానం అమలైతే మహిళలు మరింత నష్టపోతారనీ, విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎన్‌ఈపీ అమల్లోకి వస్తే విద్యారంగంలో అసమానతలు మరింత పెరుగుతాయని చెప్పారు. ఇంకోవైపు ఉన్నత విద్యకు పేద విద్యార్ధులు దూరమయ్యే ప్రమాదముందన్నారు. విద్యారంగానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలనీ, నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మహిళలు ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసించేలా కేంద్రం ప్రోత్సహించాలని కోరారు. విద్యారంగంలో అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థినిలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌ మూర్తి మాట్లడుతూ రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయానికి సరిపోయినన్ని నిధులు కేటాయించి సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహిళలను ఉన్నత విద్యకు దూరం చేసే నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు వీరేందర్‌, సభ్యులు చరణ్‌ శ్రీ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆర్థిక వ్యవస్థలో.. విప్లవాత్మక సంస్కరణలు
వ్యాపారంగా విద్య
సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలి
కుల గణన చేపట్టాలి
నేడే రాష్ట్ర పద్దు
భద్రాచలం కాకుండా ములుగే ఎందుకు?
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే...
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని రక్షించాలి
పత్తికి మద్దతు ధర కల్పించాలి
మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో.. శనగలు కొనుగోలు చేస్తాం
బదిలీలు చేపట్టండి
వైద్య పరంగా తీసుకునే నిర్ణయాల్లో.. ఐఎంఏను ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలి
వీఆర్‌ఏలకు సీఎం శుభవార్త చెప్తారు
ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ. 6వేల కోట్లు కేటాయించాలి
రైతుల ప్రయివేటు అప్పులు తీర్చేందుకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి :పాకాల
నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభతుస్సుమంది : బండి
మంత్రుల చేతుల మీదుగా బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
వాణి జయరాం మృతి సంగీత, సాహిత్య రంగాలకు తీరని లోటు
రైతు బంధు ఒక్కటే సర్వరోగ నివారిణి కాదు
నిరసనలు జయప్రదం చేయండి
భూపాలపల్లిలో.. 'మేడారం జాతర'...
నిర్మలా సీతారామన్‌కు గవర్నర్‌ శుభాకాంక్షలు
పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం
ఉత్తమ్‌ వ్యాఖ్యలు ఊహాజనితం
వర్గ పోరాటాల కేంద్రంగా సీఐటీయూ కార్యాలయం
రైతు రాజ్యం రావాలే..!
దేశాభివృద్ధికి ప్రజారవాణా జీవనాడి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏమైంది?
మూగబోయిన సుమధురవాణి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.