Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భూ పోరాటంలో ఇబ్బందులు తప్పవు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

భూ పోరాటంలో ఇబ్బందులు తప్పవు

Mon 05 Dec 02:41:53.241899 2022

- వరంగల్‌ ప్రజలు పోరాట యోధులు
- ప్రభుత్వ భూములు పేదలకు చెందాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య
- పోడుదారులకు పట్టాలు ఇవ్వాలి : వీరయ్య
నవతెలంగాణ-కాశిబుగ్గ
          భూ పోరాటంలో పేదలు ఇండ్ల స్థలాలు కాపాడుకోవడంతో పాటు ఇంటి పట్టాలు, ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం పోరాడే క్రమంలో ప్రభుత్వంతో పాటు భూకబ్జాదారుల నుంచి ఇబ్బందులు తప్పవని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. వాటి ఎదుర్కొంటూనే సమస్యల సాధనకు పోరాడుతున్న ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ మూడవ డివిజన్‌లోని పైడిపల్లి, కొత్తపేట భూపోరాట కేంద్రాలు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యులు అక్కనపెల్లి యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయనతో పాటు ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఇండ్లు, విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎనిమిదేండ్లు గడుస్తున్నా పేదలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు వెనక్కి తెచ్చి ప్రతి పేద కుటుంబానికి రూ.15 లక్షల ఇస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014, 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. వరంగల్‌ ప్రజలు పోరాటయోధులని, నాడు భూమిశిస్తుకు వ్యతిరేకంగా కాకతీయులపై పోరాడిన సమ్మక్క సారలమ్మ, అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది వీరమరణం పొందాలని గుర్తు చేశారు.
ఆ పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ నగరంలో జరిగిన భూ పోరాటంలో కుసుమ రఘునాథ్‌, రామ సురేందర్‌, సమ్మయ్య భూ కబ్జాదారుల చేతుల్లో దారణహత్యకు గురైనట్టు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములను ఇండ్లు లేని పేదలకు పంచి వారికి పట్టాలిచ్చి ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వానికి పేదల గోడు వినే సమయం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యవసర సరుకులతో పాటు డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచిందన్నారు. కేంద్రం కనీస వేతన జీవో రూ.4678 లుగా విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి గుడిసెలు వేసుకునే హక్కు ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల గురించి కూడా ఆలోచించాలని కోరారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను న్యాయబద్ధంగా సర్వే చేయించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని భూ పోరాటాలు నిర్వహించాలని, అందుకు సీపీఐ(ఎం) పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) వరంగల్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రంగయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సింగారపు బాబు, నళిగంటి రత్నమాల, ముక్కెర రామస్వామి, కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి ఎండి బషీర్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణకు అన్యాయం
పేదలకు గుంట భూమి ఇవ్వరా..
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..
సీఎం సాబ్‌... ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి...
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలివ్వాలి
లోపాలు సరిదిద్దుకుంటేనే మనుగడ
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం
వేతన జీవులకు మొండి చేయి : టీఎస్‌యూటీఎఫ్‌
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
9న మహాధర్నాను విజయవంతం చేయండి
'కాసాని' తల్లి అంత్యక్రియలు పూర్తి
విద్యా వైద్యాన్ని వదిలేసిన పద్దు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక
పీఆర్సీపై యాజమాన్యంతో టీఈఈజేఏసీ చర్చలు
'యోగాసన' విజేతలకు బహుమతులు ప్రదానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన అమిత్‌జోగి
గండ్ర దంపతులకు 'డబుల్‌ ఇండ్ల'పై నిరసన సెగ
మొదలైన మేడారం మినీ జాతర
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌ బాధ్యతల స్వీకరణ
బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు
తెలంగాణ ఊసే లేదు :వైఎస్‌ షర్మిల
కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్టా..? కొన్ని రాష్ట్రాల పద్దా...?
ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే రాయితీలు
'ఆపరేషన్‌ స్మైల్‌'తో 2814 మంది పిల్లలకు విముక్తి
ఉపాధ్యాయ బదిలీలకు 59,741 దరఖాస్తులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.