Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రభుత్వాన్ని నడుపుతున్న కార్పొరేట్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ప్రభుత్వాన్ని నడుపుతున్న కార్పొరేట్లు

Mon 05 Dec 03:53:03.647604 2022

- వారి అభివృద్ధే దేశాభివృద్ధిగా ప్రచారం
- మీడియా కూడా వారి గుత్తాధిపత్యంలోనే...
- కామ్రేడ్‌ ఆశిష్‌సేన్‌ జన్మదిన శతవార్షికోత్సవ సభలో ప్రొఫెసర్‌ జీ హరగోపాల్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
             ''కార్పొరేట్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రమాదం సంభవిస్తుందని గ్రహించగానే మతోన్మాదాన్ని రెచ్చగొ డుతున్నారు. ప్రశ్నించకుండా భయాన్ని సృష్టిస్తున్నారు. మానవత్వాన్ని మరిచి మనిషి స్వార్థపరుడిగానే బ్రతకాలంటూ జీవితాలను సూత్రీకరిస్తున్నారు. దీనికి అనుగుణంగా మీడియా కూడా వారి గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయింది. కార్పొరేట్ల అభివృద్ధే దేశాభివృద్ధి అని ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టడంలో, ప్రజల్ని వాస్తవాలవైపు మళ్ళించడంలో ఇతర రాజకీయపార్టీలు, బాధ్యత కలిగిన ప్రభుత్వరంగ ఉద్యోగులు విఫలం చెందుతున్నారు. అందువల్లే దేశంలో ప్రయివేటీకరణ ఎలాంటి ప్రతిఘటన లేకుండా సాఫీగా సాగిపోతున్నది'' అని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జీ హరగోపాల్‌ విశ్లేషించారు. కామ్రేడ్‌ ఆశిష్‌సేన్‌ జన్మదిన శతవార్షికోత్సవాల సందర్భంగా ఏపీ-టీఎస్‌ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఆఫ్‌ ఇండియా (టీఎస్‌), ఆర్బీఐ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (హైదరాబాద్‌), నాబార్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (హైదరాబాద్‌) సంయుక్తాధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ''జాతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన-రుణపరపతి విధానం -ప్రయివేటీకరణ'' అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో అమానవీయత రాజ్యమేలుతున్నదనీ, నియో లిబరల్‌ విధానాలతో మానవ సంబంధాలు ధ్వంసం అవుతున్నాయనీ, ఇది భవిష్యత్‌ తరాలకు అత్యంత ప్రమాదకరమని అన్నారు. గ్రామీణ బ్యాంకుల ప్రయివేటీకరణతో వచ్చే ప్రమాదాలను 33 కోట్ల మంది ఖాతాదారులకు అర్థమయ్యేలా చెప్పాలనీ, వారి మద్దతు ఉంటేనే ప్రజాక్షేత్రంలో విజయం సాధించ గలుగుతారంటూ ఢిల్లీ రైతాంగ పోరాటాన్ని ఉదహ రించారు. కేంద్రంలోని ప్రభుత్వ విధానాలవల్ల జరిగే నష్టాలను ఏరంగంలో ఉండే ఉద్యోగులు వారి వారి స్థాయిల్లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. కాంగ్రెస్‌ సరళీకృత ఆర్థిక విధానాలను తెచ్చి, అమలు చేసిందనీ, ఆపార్టీ కంటే అత్యంత వేగంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అవే విధానాలను అమలు చేస్తుండటంతో కార్పొరేట్లు మోడీ పక్షాన నిలుస్తున్నారని వివరించారు. ఈ విధానాల అమలుకు మత విశ్వాసాలను వాడుకుంటూ, వాటిని విద్వేషంగా మార్చే శక్తి ఉందని కార్పొరేట్లు గ్రహించారని చెప్పారు. సంస్కృతిని వినిమయ వస్తువుగా మార్చవచ్చని రుజువైందనీ, దీన్ని సమాజంలో గందరగోళపర్చడం ద్వారా మనుగడ సాగించొచ్చని కార్పొరేట్లు భావిస్తున్నారని తెలిపారు. అయితే ఇవి సుదీర్ఘకాలం నిలవబోవనీ, హిట్లర్‌ కూడా ఇలాంటి విధానాలే అమలు చేసి, విజయం సాధించాలని ప్రయత్నించారని ఉదహరించారు. సోషలిస్టు వ్యతిరేక భావజాలాన్ని అమెరికా అక్కడి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిందనీ, ఇప్పుడు భారతదేశంలోనూ ఇదే ఒరవడి కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రయివేటీకరణ కొత్త పుంతలు తొక్కుతూ అదానీ, అంబానీకరణవైపు సాగుతున్నదని విమర్శించారు. యావత్‌ దేశ సంపద వారి చేతుల్లోకి వెళ్ళిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం ద్వారానే ప్రభుత్వ రంగ పరిరక్షణ సాధ్యమవుతుందనీ, ఉద్యోగులే ఆ బాధ్యతల్ని స్వీకరించాలని చెప్పారు. విచిత్రంగా ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్యే విభేదాలు తలెత్తేలా ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే విధాన రూపకల్పన చేస్తున్నాయని ఉదహరించారు. వాటిని అధిగమిస్తూనే ప్రజా మద్దతుతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. బెఫీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రామయ్య మాట్లాడుతూ బ్యాంకింగ్‌ రంగంలో సమాన పనికి సమాన వేతనం ధ్వంసం అవుతున్నదని అన్నారు. ఎస్‌బీఐ వంటి సంస్థ తానే స్వయంగా ఔట్‌సోర్సింగ్‌ ఏజేన్సీ ఏర్పాటు చేసుకొని రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటున్నదని చెప్పారు. గ్రామీణ బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రమాదాలు, నష్టాల పట్ల ఉద్యోగులకే సరైన అవగాహన, అధ్యయనం ఉండట్లేదని అభిప్రాయపడ్డారు. ప్రజలను సమీకరించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమానికి ఆర్‌ఆర్‌బీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. నాబార్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జీ మోహన్‌కుమార్‌, ఆర్బీఐ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అర్గనైజింగ్‌ సెక్రటరీ తిలక్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌..!
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అనురాధకు పితృవియోగం
సీపీఐ(ఎం) సానుభూతిపరులు..
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌
గవర్నర్‌ బీజేపీ ప్రతినిధే...
ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌
2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మార్చి 25లోగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పూర్తవ్వాలి
నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత
వీఐటీ వర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌ 4.0
శాస్త్రీయతతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి
నాబార్డు ద్వారా రూ.3 వేల కోట్ల రుణం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.