Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఏం ఒరగబెట్టారు... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఏం ఒరగబెట్టారు...

Wed 25 Jan 01:58:36.277893 2023

- దేశాన్ని అప్పులపాలు చేసింది మోడీ ప్రభుత్వమే..
- ఏం చేశారని పాలమూరు నుంచి పోటీ చేస్తారు?
- పాలమూరు -రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించారా? : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి పాలమూరు జిల్లాకు మీరు ఏం ఒరగబెట్టారు.. కృష్ణా జలాల్లో ఈ జిల్లాకు దక్కాల్సిన నీటి వాటాలను తేల్చారా..? పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారా.. అసలు మీరు ఈ జిల్లాకు ఏమి చేశారని ఇక్కడి నుంచి ప్రధాని మోడీని పోటీ చేయించాలని చూస్తున్నారని ఐటీ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ బీజేపీని ప్రశ్నించారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రగతి నివేదన సభలో మంత్రి ప్రసంగించారు.
బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల కోసం పోట్లాడుతుంటే పరిస్థితులను చక్కదిద్దలేని ప్రధాన మంత్రి ఉక్రెయిన్‌-రష్యా యుద్దాన్ని నిలువరించేందుకు యత్నిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. గతంలో ఈ దేశాన్ని 14 మంది ప్రధాన మంత్రులు పరిపాలించిన కాలంలో రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే బీజేపీ ప్రభుత్వం రూ.100 కోట్ల లక్షల అప్పులు చేసిందని ఆరోపించారు.
బీజేపీ నేతలకు దమ్ముంటే.. పాలమూరు జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతోపాటు జాతీయ హోదా తీసుకురావడంపై తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించగలిగామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండని కోరారు. కేసీఆర్‌ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్‌ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
రైతులపై ఆదాయపు పన్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోడీ ఆర్థిక సలహాదారు విబేక్‌ దేబ్‌రారు ఒక జాతీయ పత్రికలో వ్యాసం రాశారన్నారు. ఈ దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిపోయిందని, వారిపై ఆదాయపు పన్ను వేయాలని ఆయన రాసుకొచ్చారన్నారు. ఆదాయమే లేదని ఏడుస్తుంటే.. రైతు మీద ఆదాయపు పన్ను వేయాలంటున్నరు.. దయచేసి రైతన్నలు ఆలోచించాలి అని కేటీఆర్‌ సూచించారు. ప్రధాని మోడీ కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, తాను చెప్పింది అబద్ధమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఒక వేళ వాస్తవమైతే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకోవడంతోపాటు.. ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సాగు నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, కృష్ణ మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ విఎం.అబ్రహం, జడ్పీ చైర్‌పర్సన్స్‌ కె.వనజ ఆంజనేయులు గౌడ్‌, సరిత, పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.అనసూయ, వైస్‌ చైర్మెన్‌ హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆర్థిక వ్యవస్థలో.. విప్లవాత్మక సంస్కరణలు
వ్యాపారంగా విద్య
సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలి
కుల గణన చేపట్టాలి
నేడే రాష్ట్ర పద్దు
భద్రాచలం కాకుండా ములుగే ఎందుకు?
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే...
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని రక్షించాలి
పత్తికి మద్దతు ధర కల్పించాలి
మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో.. శనగలు కొనుగోలు చేస్తాం
బదిలీలు చేపట్టండి
వైద్య పరంగా తీసుకునే నిర్ణయాల్లో.. ఐఎంఏను ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలి
వీఆర్‌ఏలకు సీఎం శుభవార్త చెప్తారు
ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ. 6వేల కోట్లు కేటాయించాలి
రైతుల ప్రయివేటు అప్పులు తీర్చేందుకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి :పాకాల
నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభతుస్సుమంది : బండి
మంత్రుల చేతుల మీదుగా బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
వాణి జయరాం మృతి సంగీత, సాహిత్య రంగాలకు తీరని లోటు
రైతు బంధు ఒక్కటే సర్వరోగ నివారిణి కాదు
నిరసనలు జయప్రదం చేయండి
భూపాలపల్లిలో.. 'మేడారం జాతర'...
నిర్మలా సీతారామన్‌కు గవర్నర్‌ శుభాకాంక్షలు
పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం
ఉత్తమ్‌ వ్యాఖ్యలు ఊహాజనితం
వర్గ పోరాటాల కేంద్రంగా సీఐటీయూ కార్యాలయం
రైతు రాజ్యం రావాలే..!
దేశాభివృద్ధికి ప్రజారవాణా జీవనాడి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏమైంది?
మూగబోయిన సుమధురవాణి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.