Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఏఎమ్‌ టూ పీఎమ్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఏఎమ్‌ టూ పీఎమ్‌

Sat 28 Jan 03:23:01.94409 2023

- టీఎస్‌ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీస్‌ ప్రారంభం
- వినియోగదారులకు మరింత చేరువవుతాం-ఎమ్‌డీ సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌లో భాగంగా 'ఏఎమ్‌ టూ పీఎమ్‌' ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీస్‌ను ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఎంపిక చేయబడిన 99 కేంద్రాలకు ఒక కేజీ పార్సిల్‌ (రూ.5వేల వరకు విలువైనవి)ను కేవలం రూ.99 కే ఉదయం బుక్‌ చేస్తే, సాయంత్రానికి డెలివరీ చేసే సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల లోపు (ఏఎమ్‌) పార్సిల్‌ను బుక్‌ చేస్తే, అదే రోజు రాత్రి 9 గంటలకల్లా డెలివరీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత (పీఎమ్‌) పార్సిల్‌ బుక్‌ చేస్తే మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా డెలివరీ చేస్తారు. దీనికే 'ఏమ్‌ టూ పీఎమ్‌' అని పేరుపెట్టారు. ఈ సర్వీసులకు నగదు, యూపీఐ పేమెంట్స్‌ చెల్లుబాటు అవుతాయి. మరిన్ని వివరాల కోసం ఫోన్‌ నెంబర్‌ 9154680020లో సంప్రదించవచ్చు. అలాగే టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtcparcel.in లో సంప్రదించవచ్చని ఎమ్‌డీ సజ్జనార్‌ తెలిపారు. ఈ సందర్భంగా బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన లాజిస్టిక్‌ సర్వీసుల గురించి వివరించారు. ప్రస్తుతం ఈ-కామర్స్‌ యుగం నడుస్తున్నదనీ, దానికి తగినట్టే ఆర్టీసీ సేవల్ని విస్తరిస్తున్నామన్నారు. టైర్‌-3 సిటీలకు ఆర్టీసీ లాజిస్టిక్‌ సేవల్ని మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 'ఏఎమ్‌ టూ పీఎమ్‌' సర్వీసులు చిన్న వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎంపిక చేసిన రూట్లలోనే ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయని వివరించారు. టిక్కెట్‌ ఆదాయానికి అదనంగా పెట్రోల్‌ బంకుల నిర్వహణ, లాజిస్టిక్స్‌, జీవా వాటర్‌ బాటిళ్ల మార్కెట్‌లోకి ప్రవేశించామని చెప్పారు. 2020 జూన్‌లో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సేవల్ని ప్రారంభించామనీ, రోజుకు 14వేల పార్సిళ్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 37.31 లక్షల పార్సిళ్లు బట్వాడా చేశామన్నారు. సమీప రాష్ట్రాల్లోని 88 ప్రాంతాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 364 మంది ఏజెంట్ల ద్వారా 192 ప్రత్యేక వాహనాలతో కార్గో సర్వీసులు నిర్వహిస్తున్నామన్నారు. రవాణారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయనీ, దానికి అనుగుణంగా అవసరాలను బట్టి బస్సు డిజైన్లలో మార్పులూ అవసరమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సేవల్ని వినియోగించుకుంటున్నాయనీ, ప్రయివేటు నుంచి కూడా ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తున్నదని వివరించారు. టీఎస్‌ఆర్టీసీ సేవలపై ప్రజలు, ప్రయాణీకులు, వినియోగదారులు సంస్థకు తప్పనిసరిగా ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలనీ, దీనివల్ల సేవల్ని మరింత విస్త్రుత పరచడంతో పాటు, మెరుగైన నిర్వహణ సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగాధిపతి సంతోష్‌కుమార్‌, హన్సా గ్రూప్‌ ఆఫ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు త్రినాధ్‌బాబు, శ్రవణ్‌కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) పుష్పకుమారి, చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.