Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..

Sat 28 Jan 03:40:45.988679 2023

- ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచాలి
- రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల ధర్నా
- గ్రాట్యుటీ, పెన్షన్‌ అమలు చేయాలని డిమాండ్‌
- మార్చిలో మూడ్రోజులు సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
ఐసీడీఎస్‌ను రక్షించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్‌వాడీ టీచర్స్‌, ఆయాలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రిటైర్‌ అయిన అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసి, వేతనంలో సగం వేతనాన్ని పెన్షన్‌గా నిర్ణయించాలని కోరారు. తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌ (టీచర్స్‌) అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నేతలు మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని, నూతన జాతీయ విద్యావిధానం చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. 2018లో కేంద్రం పెంచాలని వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం ఏరియర్స్‌తో కలిపి వెంటనే చెల్లించాలన్నారు. హెల్త్‌కార్డులు, వేతనంతో కూడిన మెడికల్‌ సెలవులు అమలు చేయాలని, బకాయి ఇంక్రిమెంట్‌, ఇన్‌చార్జి అలవెన్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని.. పశ్చిమబెంగాల్‌, కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్‌మెంట్‌ సౌకర్యాలు కల్పిస్తున్నారని, తమకూ అవి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అంగన్‌వాడీ టీచర్లకు రూ.5లక్షలు, హెల్పర్లకు రూ.3లక్షలు ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించని ఎడల మార్చి 1,2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేటలో అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పద్మ మాట్లాడారు. రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులోని ఐసీడీఎస్‌ సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. భువనగిరిలోని సీడీపీఓ ఆఫీసు ఎదుట అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీడీపీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. నార్నూర్‌ మండల కేంద్రంలో అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు సుభద్ర ఆధ్యర్యంలో ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా, అనంతరం సీడీపీఓకు వినతిపత్రం అందజేశారు. వనపర్తి ఐడీసీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు పుట్ట ఆంజనేయులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా సీడీపీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి అంగన్వాడీ పీడీ జరినా బేగంకు వినతిపత్రం అందజేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని శ్రీ శిశుసంక్షేమ అధికారి కార్యాలయం ముందు ధర్నా, సీడీపీఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. కల్వకుర్తి పట్టణంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మాపురి పట్టణంలోని సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మూడుగం రాజలింగం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. వీరిలో బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అర్బన్‌ సీడీపీఓ ఆఫీస్‌ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా అనంతరం సీడీపీఓకి మెమోరాండం అందజేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.