Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి

Sat 28 Jan 03:40:27.722422 2023

- బదిలీలు, పదోన్నతుల్లో అవకతవకల్లేకుండా చూడాలి
- కలెక్టర్లకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలోని పాఠశాల విద్యలో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్న 'మన ఊరు-మనబడి' కార్యక్రమం మొదటి విడతలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం నుంచి 'మన ఊరు-మనబడి' కార్యక్రమం పురోగతిని మంత్రి సమీక్షించారు. పాఠశాలల స్వరూపం సమూలంగా మార్చి, కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా రూపుదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సదుపాయాలను ఏర్పాటు చేయించేలా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు శ్రీకారం చుట్టారని వివరించారు. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలుంటే మొదటి విడతలో 9,123 బడుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.3,497.62 కోట్ల ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వాటిలో 7,479 పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 1,644 పాఠశాలలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు. మొదటి విడతలో చేపట్టిన పాఠశాలలను బాగు చేయడం ద్వారా 14,71,684 మంది విద్యార్థులంటే దాదాపు 63 శాతం మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. శుక్రవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు ప్రకటించే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఎలాంటి లోపాల్లేకుండా, ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరముందని సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.