Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు

Sun 29 Jan 04:29:13.704583 2023

- నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కారు
- సవాళ్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులు
- ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు బ్యాంకుల జాతీయీకరణ దోహదం
- 30, 31న దేశవ్యాప్త సమ్మె వాయిదా
- ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
భారత దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే జాతీయ బ్యాంకులను కేంద్రంలోని మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేస్తున్నదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.వెంకటాచలం అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో శనివారం యూనియన్‌ బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర 2వ వార్షిక మహాసభ ఘనంగా ప్రారంభమైంది. తొలుత ఏఐబీఈఏ పతాకాన్ని సిహెచ్‌.వెంకటాచలం ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల జాతీయీకరణ దేశంలోని సాధారణ పౌరులు సురక్షితమైన బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఆధారపడటానికి సహాయపడిందన్నారు. అలాగే వ్యవసాయం, విద్య, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వంటి రంగాలకు బ్యాంకులు ప్రాధాన్యతారంగ రుణాలు అందించడంలో కూడా జాతీయీకరణ దోహదం చేసిందని తెలిపారు. అలాంటి బ్యాంకులను నేడు నిరంకుశంగా ప్రధాని మోడీ ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐబీఈఏ చరిత్రను వెనక్కి తిరిగి చూసుకుంటే గొప్ప గర్వం, స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ సంఘంలో సాధారణ మధ్యతరగతి బ్యాంక్‌ ఉద్యోగుల ప్రయాణం, వారి సంపూర్ణ ఐక్యత ద్వారా గౌరవం, భద్రత, మెరుగైన జీవన పరిస్థితులను పొందవచ్చునని తెలిపారు. ఆర్థిక సంస్థల్లో దివాలా, ఎన్‌.పీ.ఏల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రధాని మోడీ సామాన్య ప్రజల సంక్షేమాన్ని విస్మరించి.. కొంతమంది కార్పొరేట్‌ మిత్రుల సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నారని విమర్శించారు. తిరోగమన విధానాల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అందులో ఉద్యోగ భద్రత ఒకటని తెలిపారు. బ్యాంకులు, బీమా, బొగ్గు గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వరంగ ఉద్యోగులు పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. జనవరి 31న యూనియన్లతో సమావేశం నిర్వహించేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ అంగీకరించిందని, దాంతో 30, 31 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను వాయిదా వేసినట్టు తెలిపారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌, పెన్షన్‌ అప్‌డేట్‌, అవశేష సమస్యలు, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) రద్దు చేయడం, వేతన సవరణ కోసం డిమాండ్‌ల చార్టర్‌పై ఐబీఏతో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ చర్చలు జరుపుతుందని వెల్లడించారు. ప్రతినిధుల సభకు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సమద్‌ ఖాన్‌ స్వాగతం పలుకగా, అధ్యక్షులు టి.రవీంద్రనాథ్‌ అధ్యక్షత వహించారు. మహాసభ ఆహ్వాన సంఘం చైర్మెన్‌ బి.ఎస్‌.ఆర్‌.మోహన్‌ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. యూనియన్‌ బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సురేష్‌ చంద్రటెలి, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్‌.రాంబాబు, అఖిల భారత యూనియన్‌ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకర్‌, చైర్మెన్‌ విన్‌ సెంట్‌ డిసౌజా, ఏపీ యూనియన్‌ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఉదయ కుమార్‌, యూనియన్‌ బ్యాంకు రీజినల్‌ హెడ్‌లు పి.సత్యం, సీఎస్‌. జనని తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.