Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అమరుల ఆశయసాధనకు పునరంకితమవుదాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

అమరుల ఆశయసాధనకు పునరంకితమవుదాం

Sun 29 Jan 05:33:14.31409 2023

- కొలిశెట్టి వజ్రమ్మ సంస్మరణ సభలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
అమరవీరుల ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కొలిశెట్టి వజ్రమ్మ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. నాడు తెలంగాణ ప్రాంతంలో భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి పేద ప్రజల విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ విప్లవపోరాటంలో అనేకమంది అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొలిశెట్టి వెంకయ్య ప్రత్యక్షంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. పోరాట కాలంలో అనేక ఇబ్బందులు వచ్చిన ప్పటికీ కడవరకు భర్త వెంకయ్యతో కలిసి వజ్రమ్మ పని చేశారని కొనియాడారు. నాటి నుంచి నేటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం కమ్యూనిస్టుగా వజ్రమ్మ జీవించారని చెప్పారు. కుమారుడు కొలిశెట్టి యాదగిరిరావును పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని, పూర్తికాలం కార్యకర్తగా పంపించారని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనన్నారు. జర్నలిస్టు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్‌ మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల త్యాగాల వల్ల నేడు మనమందరం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని చెప్పారు. వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్‌, డీటీఎఫ్‌ జిల్లా నాయకులు దశరథ రామారావు మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనన్నారు. ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది కమ్యూనిజం మాత్రమేనని చెప్పారు. నేటి యువత నాటి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని, అప్పుడే సమసమాజం సాకారం అవుతుందన్నారు. అంతకుముందు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చెరుకు ఏక లక్ష్మీ, కోటగోపి, చివ్వెంల మాజీ ఎంపీపీ కరుణ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ
కాందార్‌ లోహ సభ సక్సెస్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు
కొత్త పేస్కేలుతో సెర్ప్‌ ఉద్యోగుల్లో హర్షం
ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి
ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణ అగ్రస్థానం
ఏకరూప దుస్తుల బకాయిలు చెల్లించాలి : డీటీఎఫ్‌
రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో దరఖాస్తులకు ఆహ్వానం
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఉస్మానియా విశ్వవిద్యాలయ పీహెచ్‌డీ అడ్మిషన్‌ ఫీజు తగ్గించాలి
బీజేపీ విధానాలతో దేశ సమగ్రతకు ముప్పు
హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
కాంట్రాక్టు జేఎల్‌ల ఫిబ్రవరి వేతనాలు విడుదల
కేటీఆర్‌కు నోటీసులిచ్చే దమ్ము 'సిట్‌'కు ఉందా? : బండి
ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లోకి రూ.217 కోట్లు
సేవా కార్యక్రమాల్లో...రాజ్‌ భవన్‌తో కలసి రండి : గవర్నర్‌
ఎయిడెడ్‌ టీచర్ల జీతాలు చెల్లించాలి
రైతుల పేరిట రాజకీయం వద్దు:సింగిరెడ్డి
బీజేపీవి బరితెగింపు దాడులు
హిందూ మతానికి బీజేపీకి సంబంధం లేదు
మన భూములపై అదానీ కార్పొరూట్‌
ఎర్ర బంగారం రికార్డ్‌ బ్రేక్‌
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.