Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి మృతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి మృతి

Sun 29 Jan 05:32:27.339393 2023

- ఫ్లోరైడ్‌పై అలుపెరుగని పోరాటం
- ఇటీవల మంత్రి కేటీఆర్‌తో భోజనం చేసిన స్వామి
- సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ దిగ్భ్రాంతి
నవతెలంగాణ- నల్లగొండ
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడేనికి చెందిన ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు అంశాల స్వామి(32) శనివారం ఉదయం మృతిచెందాడు. శుక్రవారం రాత్రి తన ట్రై సైకిల్‌ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడటంతో తలకు తీవ్రగాయాల య్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమిం చడంతో శనివారం ఉదయం మృతి చెందాడు. స్వామికి ముగ్గురు చెల్లెళ్లు. తండ్రి సత్యనారాయణకు ఐదేండ్ల కిందట పక్షవాతం వచ్చింది.
తల్లి వెంకటమ్మ 20 ఏండ్ల నుంచి నరాల వ్యాధితో బాధపడుతూ ఎటూ కదల లేక జీవత్సంలా ఉంది. ఒక చెల్లి ఫ్లోరోసిస్‌తో బాధపడుతూ చని పోయింది. మరో చెల్లి అనారోగ్యంతో మృతిచెందింది. ఫ్లోరైడ్‌ బారినపడిన అంశాల స్వామి ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. బాధితుడిగానే కాదు తనలాంటి సమస్యతో బాధపడుతున్న వారి తరపున గట్టిగా పోరాడారు. ఫ్లోరైడ్‌ రక్కసి పోరాటంలో భాగంగా జలసాధన సమితిని స్థాపించిన దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి కన్వీనర్‌ కంచుకట్ల సుభాష్‌ అప్పట్లోనే ఫ్లోరైడ్‌ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లారు. స్వయంగా నాటి ప్రధాని వాజ్‌పేరు టేబుల్‌పై ఐదేండ్ల వయస్సున్న అంశాల స్వామిని కూర్చోబెట్టి సమస్యను వివరించారు. వరుసగా ఢిల్లీలో ఐదుగురు ప్రధాన మంత్రులను కలిసి బాధితుల గోడును వివరించారు.
గతేడాదే అంశాల స్వామి సొంత ఇంటి కల నెరవేరింది. మంత్రి కేటీఆర్‌ సాయంతో ఇంటిని పూర్తి చేశాడు. ఉపాధి కోసం హెయిర్‌ కటింగ్‌ షాపు ఏర్పాటు చేయించారు. గృహప్రవేశ కార్యక్రమానికి హాజరుకాని కేటీఆర్‌.. మునుగోడు ఉపఎన్నిక సందర్భంలో స్వామి ఇంటికి వెళ్లారు. స్వయంగా స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం గురించి ఆరా తీశారు. స్వామితో కలిసి మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి భోజనం చేశారు. స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా కల్పించిన సంగతి తెలిసిందే.
మానవీయ కోణాన్ని తట్టి లేపిన స్వామి : సీఎం కేసీఆర్‌
ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్‌ సమస్యతోపాటు తక్షణమే గుర్తుకు వచ్చే పేరు అంశాల స్వామి అని సీఎం గుర్తుకు చేసుకున్నారు. మానవీయ కోణాన్ని తట్టి లేపుతూ తెలంగాణ ఉద్యమంలో అంశాల స్వామి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా, ఫ్లోరోసిస్‌ రహిత శుద్ది చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి, ఫ్లోరోసిస్‌ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని తెలిపారు. సీఎం స్వామి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
స్వామి మతి పట్ల మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి
స్వామి మరణ వార్త విన్న మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. స్వామి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వామి ఫ్లోరోసిస్‌ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. ఎంతో మందికి ఆయన ఆదర్శమన్నారు. స్వామి ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్‌ చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
రేవంత్‌ దీక్షను అడ్డుకుంటాం
రికార్డు స్థాయిలో రూ.9.62 కోట్లు జరిమానా
అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
23,24 తేదీల్లో ఈదురుగాలులతో వర్షాలు!
ఉగాది శుభాకాంక్షలు: టీడీపీ అధ్యక్షులు కాసాని
ఈ-కుబేర్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
విప్లవాత్మక పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో మెరుగుదల
నిమ్స్‌ డైరెక్టర్‌ను మార్చాలి
24,25 తేదీల్లో ఇంటర్‌-కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఫోన్ల ధ్వంసం ఆరోపణలకు కవిత ఖండన
ఉపాధి పనులకు 25 లోగా ఎఫ్‌టీవో పూర్తి చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌లైన్లను పునరుద్ధరించండి
31న 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
ప్రజలకు గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు
కేసీఆర్‌కు జై కొడుతున్న ''మహా''జనం
జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతి
రైతుల పట్ల బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలి
పట్టణ ప్రగతితో పురపాలికల్లో మౌలిక వసతులు
'ధరల కారం'తో షడ్రురుచుల పండుగ
పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ దూకుడు
బీసీ జనగణన చెయ్యరేం?
దిగజారుతున్న సీసీఐ ప్రతిష్ట!
విభజన హామీలపై 25 నుంచి పాదయాత్ర
నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
ప్రమాదంలో దేశం
సిట్‌కు ఆధారాలు ఇవ్వ.. సీబీఐకి ఇస్తా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.