Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు

Thu 02 Feb 03:36:38.567703 2023

- రాష్ట్రంలో తొలి అడుగు గంభీరావుపేట విద్యాసంస్థలు
- మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కె.తారకరామారావు
- రాష్ట్ర వ్యాప్తంగా 'మన ఊరు-మనబడి' ప్రారంభం
నవతెలంగాణ - విలేకరులు
దేశంలోనే ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కేజీ టూ పీజీలాంటి విద్యా సంస్థలు లేవని, గంభీరావుపేట కేజీ టూ పీజీ విద్యాసంస్థలు తెలంగాణకు తొలి అడుగుగా ఉంటాయని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 'మన ఊరు- మన బడి' మొదటి దశ పాఠశాలలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ను మంత్రులు సబిత, కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ క్యాంపస్‌కు ఆచార్య జయశంకర్‌ పేరుగా నామకరణం చేయాలన్నారు. అనంతరం క్యాంపస్‌లోని కిండర్‌ గార్డెన్‌ నుంచి పీజీ కళాశాల బ్లాక్‌లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, డిజిటల్‌ లైబ్రరీతోపాటు వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేజీ టూ పీజీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. ఆయన హామీ ప్రతి రూపమే కేజీ టూ పీజీ క్యాంపస్‌ అన్నారు. కేజీ టు పీజీ క్యాంపస్‌ నిర్మాణానికి తోడ్పాటు అందించిన రహెజా, దివిస్‌ ల్యాబరేటరీ, గివ్‌ తెలంగాణ, ఎంఆర్‌ఎఫ్‌ ప్రతినిధులను సన్మానించారు. క్యాంపస్‌లో విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేశారు.
చింతకుంట మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. విద్యకు దూరం కావద్దని సీఎం కేసీఆర్‌ వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశారన్నారు. జిల్లాలో మొదటి విడత మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా 230 పాఠశాలలను రూ.92 కోట్లలతో ఆధునీకరణ చేయనున్నట్టు తెలిపారు. నిర్మిల్‌లో పాఠశాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.
మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో పలు చోట్ల అభివృద్ధి చేసిన పాఠశాలలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. పద్మారావునగర్‌లోని మైలార్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మినగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని రాజ్‌భవన్‌ ప్రాథమిక పాఠశాలలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సాయన్న, దానం నాగేందర్‌, హైదరాబాద్‌ డీఈవో ఆర్‌.రోహిణీతో కలిసి మంత్రి ప్రారంభించారు.
నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తున్నామన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కమలానగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల, నార్కట్‌పల్లి ప్రాథమిక పాఠశాలను పరిషత్‌ చైర్మెన్‌ బండా నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌తో కలిసి ప్రారంభించారు.
ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాథమిక పాఠశాలను రూ.12.49 లక్షలు, శాంతినగర్‌ ఉన్నత పాఠశాలను రూ.1.14 కోట్లతో మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయగా.. మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ ప్రారంభించారు.జనగామ జిల్లా దేవరుప్పల ప్రభుత్వ పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భగ్గుమన్న కేయూ విద్యార్థి సంఘాలు
హిందువులంటే అదానీ-అంబానీలేనా?
చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది
సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్‌
విద్యార్థులకు పిఎన్‌బి మద్దతు
కలుషిత నీరు తాగి 25మంది కూలీలకు అస్వస్థత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు కుటుంబాన్ని.. పరామర్శించిన తమ్మినేని
దేశంలో అంబానీ, అదానీ ఆదాయం పెంచిన బీజేపీ
నేడే సీతారాముల కల్యాణం
ఇంకెంత మందికి 'లీక్‌' ?
'ఆరోగ్య మహిళ'కు విశేష ఆదరణ
ఉప్పొంగిన ఉత్సా‌హం
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి
టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఇన్సూరెన్స్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
'దిశ' ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా
టోల్‌ పన్ను పెంచి వసూలు చేయడం న్యాయమా?
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం సైబర్‌ నేరాలే
రెండో రోజు కూడా ఈడీ ముందుకు...
ఏప్రిల్‌ 9 వరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ముగిసిన ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
ముగ్గురు ఎల్‌ఈటీ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌
రూ. 6 కోట్లు స్వాహా చేసి పరారైన మోసగాడు అరెస్టు
డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం సొంత జిల్లాల్లో కేటాయించాలి:టీజూడా
బీజేపీ హిందువుల మేలు కోరే పార్టీ కాదు
ఏప్రిల్‌ 17 నుంచి కరెంటోళ్ల సమ్మె
అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.