Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి

Thu 02 Feb 04:08:10.579505 2023

- ఫిబ్రవరి 15న చలో హైదరాబాద్‌ విజయవంతం చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
- రాష్ట్ర పశుమిత్రుల వర్కర్స్‌ యూనియన్‌ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ముషీరాబాద్‌
పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న పశుమిత్రులను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించి ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం రాష్ట్ర పశుమిత్రుల వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఎడ్ల రమేష్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ.. పశుసంవర్ధక శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 మంది పశుమిత్రులు ఎనిమిదేండ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారని చెప్పారు. వీరికి ఐకేపీ ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఎలాంటి పారితోషికమూ నిర్ణయించకుండా పశువైద్య శాఖలో పశుమిత్రులుగా నియమించిందన్నారు. వారు గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గోర్లు, మేకలకు కృత్రిమ గర్భధారణతోపాటు వ్యాక్సినేషన్‌, నట్టల మందు వేయడం, వ్యాధుల నివారణకు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పశు మిత్రులకు ఫిక్స్‌డ్‌ వేతనం, యూనిఫామ్‌, గుర్తింపు కార్డు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఫిబ్రవరి 15న చలో ప్రగతి భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంటాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతన సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, ఆశా కార్యకర్తల మాదిరిగా పశుమిత్రులకు పారితోషికం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పశుమిత్రులంతా బీఆర్‌ఎస్‌ నాయకులను నిలదీయడానికి సిద్ధం కావాలన్నారు. అనంతరం రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు.
రాష్ట్ర కమిటీ..
రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా జె.వెంకటేష్‌, అధ్యక్షులుగా కె.శారద, ప్రధాన కార్యదర్శిగా కాసు మాధవి, కోశాధికారిగా శ్రీరామ్‌ పద్మ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కవిత, మనిషా, శ్రీలత, త్రివేణి, ప్రియాంక, సహాయ కార్యదర్శిగా ఎడ్ల రమేష్‌, లక్ష్మీనరసింహ, కమిటీ సభ్యులుగా లలితా, ప్రభా, మౌనిక తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్‌, రంజిత్‌ కుమార్‌, కవిత, కడారి నరసింహ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భగ్గుమన్న కేయూ విద్యార్థి సంఘాలు
హిందువులంటే అదానీ-అంబానీలేనా?
చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది
సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్‌
విద్యార్థులకు పిఎన్‌బి మద్దతు
కలుషిత నీరు తాగి 25మంది కూలీలకు అస్వస్థత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు కుటుంబాన్ని.. పరామర్శించిన తమ్మినేని
దేశంలో అంబానీ, అదానీ ఆదాయం పెంచిన బీజేపీ
నేడే సీతారాముల కల్యాణం
ఇంకెంత మందికి 'లీక్‌' ?
'ఆరోగ్య మహిళ'కు విశేష ఆదరణ
ఉప్పొంగిన ఉత్సా‌హం
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి
టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఇన్సూరెన్స్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
'దిశ' ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా
టోల్‌ పన్ను పెంచి వసూలు చేయడం న్యాయమా?
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం సైబర్‌ నేరాలే
రెండో రోజు కూడా ఈడీ ముందుకు...
ఏప్రిల్‌ 9 వరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ముగిసిన ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
ముగ్గురు ఎల్‌ఈటీ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌
రూ. 6 కోట్లు స్వాహా చేసి పరారైన మోసగాడు అరెస్టు
డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం సొంత జిల్లాల్లో కేటాయించాలి:టీజూడా
బీజేపీ హిందువుల మేలు కోరే పార్టీ కాదు
ఏప్రిల్‌ 17 నుంచి కరెంటోళ్ల సమ్మె
అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.