Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..

Thu 02 Feb 04:07:58.850152 2023

- రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రతిపాదించిన బడ్జెట్‌.. రాష్ట్రాలను నిరుత్సాహ పరిచేదిగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అది రైతులు, పేదలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. బడ్జెట్‌లో అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో డొల్లతనమే కనబడుతున్నదని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడు ప్రాధాన్యతారంగాలకు పెద్ద పీట వేశామని చెబుతూనే అసలు రంగాలను గాలికొదిలేశారని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌ ద్వారా తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. పారిశ్రామిక వాడలకు సంబంధించి తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తగా ఇస్తామంటూ చెప్పలేదని తెలిపారు. రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోతలు విధించారు.. ఎరువుల సబ్సిడీలు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారు, ఆహార సబ్సిడీలు తగ్గించారని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామంటూ బడ్జెట్లలో ఎక్కడా చెప్పలేదనీ, ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేవని తెలిపారు. ఉద్యోగులను సైతం భ్రమల్లో ముంచారని విమర్శించారు. సెస్సుల భారం తగ్గించలేదు.. పన్నుల భారం నుంచి ఉపశమనం లేదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన పద్దును ఆయన భ్రమల బడ్జెట్‌గా అభివర్ణించారు.
కేంద్ర బడ్జెట్‌పై హరీశ్‌రావుతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా స్పందించారు. ఈ పద్దు రైతులకు వ్యతిరేకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీకి కేంద్రం మెల్లగా మంగళం పాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, క్రిమి సంహారక మందులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో రైతులు సతమతమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎరువులపై సబ్సిడీలను ఎత్తేస్తే వారిపై మరింత భారాలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి గతేడాది కన్నా ఈసారి 22 శాతం తక్కువగా కేటాయింపులు చేయటం దారుణమని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌... రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేదిగా ఉందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో పద్దును నింపేశారని తెలిపారు. జనరల్‌ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను కలపటంతో తీవ్ర గందరగోళం నెలకొంటోందని పేర్కొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. అది దేశంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాలకు వ్యతిరేకంగా ఉందని వారు విమర్శించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భగ్గుమన్న కేయూ విద్యార్థి సంఘాలు
హిందువులంటే అదానీ-అంబానీలేనా?
చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది
సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్‌
విద్యార్థులకు పిఎన్‌బి మద్దతు
కలుషిత నీరు తాగి 25మంది కూలీలకు అస్వస్థత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు కుటుంబాన్ని.. పరామర్శించిన తమ్మినేని
దేశంలో అంబానీ, అదానీ ఆదాయం పెంచిన బీజేపీ
నేడే సీతారాముల కల్యాణం
ఇంకెంత మందికి 'లీక్‌' ?
'ఆరోగ్య మహిళ'కు విశేష ఆదరణ
ఉప్పొంగిన ఉత్సా‌హం
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి
టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఇన్సూరెన్స్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
'దిశ' ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా
టోల్‌ పన్ను పెంచి వసూలు చేయడం న్యాయమా?
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం సైబర్‌ నేరాలే
రెండో రోజు కూడా ఈడీ ముందుకు...
ఏప్రిల్‌ 9 వరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ముగిసిన ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
ముగ్గురు ఎల్‌ఈటీ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌
రూ. 6 కోట్లు స్వాహా చేసి పరారైన మోసగాడు అరెస్టు
డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం సొంత జిల్లాల్లో కేటాయించాలి:టీజూడా
బీజేపీ హిందువుల మేలు కోరే పార్టీ కాదు
ఏప్రిల్‌ 17 నుంచి కరెంటోళ్ల సమ్మె
అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.