Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పేదలకు గుంట భూమి ఇవ్వరా.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

పేదలకు గుంట భూమి ఇవ్వరా..

Thu 02 Feb 04:07:53.439077 2023

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పి కొట్టాలి
- పట్టాలు అందే వరకు పోరాటం ఆగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్‌
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు నియంత పాలన కొనసాగిస్తున్నాయని బడా నేతలకు అప్పనంగా ఎకరాల కొద్దీ భూములు కట్టబెడుతూ.. పేదలకు మాత్రం గుంట భూమి ఇవ్వడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్‌ అన్నారు. ఇండ్ల స్థలాల పట్టాలు అందే వరకు పోరాటం ఆగదని, పేద ప్రజలకు ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు సర్వే నంబర్‌ 280, 283, 284, 285లోని సుమారు 24 ఎకరాల శిఖం భూమిలో ఆరు రోజుల కిందట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. సుమారు 1500 గుడిసెలు వేశారు. బుధవారం అబ్బాస్‌ గుడిసెవాసులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని.. దానిపై పూర్తి హక్కు పేదలకే ఉంటుందన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 32వేల ఎకరాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయని వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కోసం మూడున్నర లక్షల మంది నిరుపేదలు గుడిసెలు వేసుకున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తానన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న ప్రభుత్వం.. పేదలపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. భూపోరాటంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి శిఖం భూములను పేదలకు పంచి పట్టాలు ఇవ్వడంతోపాటు ఇండ్లు కట్టించాలని డిమాండ్‌ చేశారు. భూమిని వదిలేది లేదని కరెంటు నీరు, రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాదులో జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 45 కోట్ల మంది దగ్గర ఉన్న సొత్తు ఎంతో.. కేవలం ఒక అదాని దగ్గర అంత ఉందని చెప్పారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 15 ఎకరాల్లో ఓ ధనవంతుడు ఇల్లు నిర్మించుకుంటే తప్పులేదు కానీ.. పేదలు గుడిసెలు వేసుకుంటే దౌర్జన్యం ఎందుకని ప్రశ్నించారు. పేదలకు ఉపయోగపడే నిత్యావసర సరుకులు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల భారత్‌ పేరుతో పేదలు గ్యాస్‌ పంపిణీ చేసినా.. ధర పెరగడం వల్ల మళ్లీ కట్టెల పొయ్యే దిక్కు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాంపెటి రాజన్న, చెన్నూరి రమేష్‌, పొలం రాజేందర్‌, దమేర కిరణ్‌, నాయకులు డబ్బా రాజన్న, అతుకురి శ్రీకాంత్‌, పొలం చిన్న రాజేందర్‌, సకినాల మల్లయ్య, గుర్రం దేవందర్‌, బొడ్డు కిషోర్‌, బొడ్డు స్మరన్‌, రిత్విక్‌, విజరు, మహేందర్‌, సంపత్‌, రాజు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భగ్గుమన్న కేయూ విద్యార్థి సంఘాలు
హిందువులంటే అదానీ-అంబానీలేనా?
చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది
సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్‌
విద్యార్థులకు పిఎన్‌బి మద్దతు
కలుషిత నీరు తాగి 25మంది కూలీలకు అస్వస్థత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు కుటుంబాన్ని.. పరామర్శించిన తమ్మినేని
దేశంలో అంబానీ, అదానీ ఆదాయం పెంచిన బీజేపీ
నేడే సీతారాముల కల్యాణం
ఇంకెంత మందికి 'లీక్‌' ?
'ఆరోగ్య మహిళ'కు విశేష ఆదరణ
ఉప్పొంగిన ఉత్సా‌హం
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి
టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఇన్సూరెన్స్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
'దిశ' ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా
టోల్‌ పన్ను పెంచి వసూలు చేయడం న్యాయమా?
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం సైబర్‌ నేరాలే
రెండో రోజు కూడా ఈడీ ముందుకు...
ఏప్రిల్‌ 9 వరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ముగిసిన ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
ముగ్గురు ఎల్‌ఈటీ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌
రూ. 6 కోట్లు స్వాహా చేసి పరారైన మోసగాడు అరెస్టు
డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం సొంత జిల్లాల్లో కేటాయించాలి:టీజూడా
బీజేపీ హిందువుల మేలు కోరే పార్టీ కాదు
ఏప్రిల్‌ 17 నుంచి కరెంటోళ్ల సమ్మె
అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.