Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఆర్థిక వ్యవస్థలో.. విప్లవాత్మక సంస్కరణలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఆర్థిక వ్యవస్థలో.. విప్లవాత్మక సంస్కరణలు

Mon 06 Feb 05:23:32.668827 2023

- దేశంలో మార్పు జరగాల్సిందే
- మోడీ పాలనలో లాభాలు ప్రయివేటుకు.. నష్టాలు ప్రజలకు..
- అదానీ లాభాల కోసమే బొగ్గు దిగుమతి
- మోడీ మిత్రుల కోసం విదేశీ కంపెనీలకు మోకాలడ్డు
- ఎల్‌ఐసీని పూర్తిగా ప్రభుత్వపరం చేస్తాం
- విభజిత, విద్వేష రాజకీయాలను వ్యతిరేకిస్తాం : నాందేడ్‌ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ వెల్లడి
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో పేదరికం నిర్మూలించాలంటే ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు జరగాలని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. చైనా, సింగపూర్‌, మలేషియా, దక్షిణ కొరియా మాదిరిగా చేయాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో పన్నుల పేర పేదల నుంచి లాగడం, పెద్దలకు పంచడం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ తన మిత్రుల వ్యాపారం కోసం విదేశీ కంపెనీలను దేశానికి రాకుండా మోకాలడ్డుతున్నారని విమర్శించారు. అదానీ వ్యవహరంపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే విద్యుత్తు రంగాన్ని జాతీయం చేస్తామని, ఎల్‌ఐసీని పూర్తిగా ప్రభుత్వపరం చేస్తామని అన్నారు. మోడీ పాలనలో నష్టాల ప్రజలకు, లాభాలు ప్రయివేటువాళ్లకు వెళ్తున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో బీఆర్‌ఎస్‌ ఏ విధానం ఉండబోతుందో ప్రకటించారు. ప్రస్తుతం దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఈ స్థితిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామని కేంద్ర నేతలు ప్రకటించడం బూటకమని కొట్టిపారేశారు. దేశంలో ప్రధాని దందా నడుస్తోందని విమర్శించారు. దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతో 125 యేండ్ల పాటు యావత్‌ దేశానికి విద్యుత్తు అందించవచ్చన్నారు. దేశ అభివృద్ధికి విద్యుత్తు రంగం కీలకమని, కానీ కుంటిసాకులతో ఈ రంగాన్ని ప్రయివేటుపరం చేస్తున్నారని వాపోయారు. విద్యుత్తు రంగం పూర్తిగా ప్రయివేట్‌వాళ్ల చేతికి వెళ్తే.. భవిష్యత్తులో దేశాన్ని, సర్కారును బ్లాక్‌మెయిల్‌ చేస్తారని హెచ్చరించారు. లక్షల కోట్ల ఆస్తిని కేవలం వందల కోట్లకు ప్రయివేటుపరం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పవన్‌ హన్స్‌ కంపెనీని ఉదహరించారు. ఈ కంపెనీతో ప్రభుత్వానికి దక్కే డివిడెంట్‌ కంటే తక్కువకు ప్రయివేటీకరణ చేశారని అన్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రయివేటీకరణ చేస్తే ఊరుకోబోమని, 2024 తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ జాతీయం చేస్తామని అన్నారు. బొగ్గు రంగంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. దేశంలో పెద్దఎత్తున బొగ్గు నిక్షేపాలున్నాయని, కిలో బొగ్గు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ ప్రధాని మోడీ.. తన మిత్రుడు అదానీ కోసం రాష్ట్రాలను భయపెట్టి బలవంతంగా ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేయిస్తున్నారని వాపోయారు. కోల్‌ ఇండియా కంపెనీకి అవసరమైన రైలు పట్టాలను వేయడం లేదని విమర్శించారు. ఎల్‌ఐసీని నిర్వీర్యం చేస్తున్నారని, అదానీ కంపెనీల్లో రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెట్టించారని, పైగా నష్టం జరగలేదని బూటకపు ప్రకటనలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద కుంభకోణమని, ఒకవేళ నష్టం జరగకపోతే అదానీ వ్యవహరంపై పార్లమెంట్‌లో చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు. మోడీకి అదానీపై ఉన్న ప్రేమ.. ప్రజలపై ఉండాలని చురకలంటించారు.
మహిళలకు పార్లమెంట్‌లో, అసెంబ్లీ, కౌన్సిల్‌లో 35 శాతం ప్రాతినిథ్యం కల్పిస్తామని అన్నారు. దేశంలో రాజకీయ విధానం, ప్రభుత్వ పరిపాలన ఇలా అన్ని రంగాల్లో మార్పు జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మోడీ మిత్రుడు కాబట్టే అదానీ రెండేండ్లలో ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలోకి వచ్చారని అన్నారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసని, ఈ విషయాన్ని ఇంకా దాచలేరని అన్నారు. నీటి వివాదాలకు భాగస్వామ్య పక్షాలతో చర్చించి పరిష్కరిస్తే సరిపోతుందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మహారాష్ట్రకు నీటి అవసరం ఉంటే ఎస్సారెస్సీ నుంచి కూడా లిఫ్ట్‌ చేసుకోవచ్చని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం
ఆటపాటతో చైతన్యం
ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు
జనరిక్‌ మందులను ప్రచారంలోకి తీసుకురావాలి
కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
రేవంత్‌ దీక్షను అడ్డుకుంటాం
రికార్డు స్థాయిలో రూ.9.62 కోట్లు జరిమానా
అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
23,24 తేదీల్లో ఈదురుగాలులతో వర్షాలు!
ఉగాది శుభాకాంక్షలు: టీడీపీ అధ్యక్షులు కాసాని
ఈ-కుబేర్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
విప్లవాత్మక పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో మెరుగుదల
నిమ్స్‌ డైరెక్టర్‌ను మార్చాలి
24,25 తేదీల్లో ఇంటర్‌-కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఫోన్ల ధ్వంసం ఆరోపణలకు కవిత ఖండన
ఉపాధి పనులకు 25 లోగా ఎఫ్‌టీవో పూర్తి చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌లైన్లను పునరుద్ధరించండి
31న 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
ప్రజలకు గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.