Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకి ఆపాదిస్తారా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకి ఆపాదిస్తారా?

Sat 18 Mar 05:52:22.750624 2023

- నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు తగదు
- గుజరాత్‌లో 13సార్లు పేపర్లు లీక్‌ అయ్యాయి...
- మోడీని రాజీనామా కోరే ధైర్యం ఉందా?
- బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ సవాలు
- లీకేజీ నిందితులు బీజేపీ యాక్టివ్‌ కార్యకర్తలే...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
           వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థలకు ఆపాదించి, నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు చేయడం తగదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే తారకరామారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కు హితవు చెప్పారు. గుజరాత్‌లో 13 సార్లు పరీక్ష పేపర్లు లీక్‌ అయ్యాయనీ, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్రమోడీని రాజీనామా కోరే ధైర్యం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఉందా అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజరువి అజ్ఞానపు వ్యాఖ్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి కనీస అవగాహన కూడా ఆయనకు లేదనీ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రభుత్వ శాఖ కాదనీ, అదో రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనీ చెప్పారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. నిరుద్యోగులు ఇలాంటి నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజరు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా, దిగజారుడు వాదనలు చేస్తూ, ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా ఇలాంటి అర్థరహితమైన ఆరోపణలే చేశారని గుర్తుచేశారు. గతంలో ఇంటర్‌ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసి, పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజరు చేస్తున్న కుట్రలకు భవిష్యత్‌లో క్రిమినల్‌ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా వందకు పైగా సందర్భాల్లో ప్రశ్నా పత్రాల లీకేజీలు జరిగాయనీ, దీనిలో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్టు తేలిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్లు లీకైనప్పుడు మంత్రిని కానీ.. అక్కడి ముఖ్యమంత్రిని కానీ ఏనాడు ఆపార్టీ బాధ్యులను చేయలేదని గుర్తుచేశారు. ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందిస్తూ మరోలా వ్యవహరించడం దిగజారుడు రాజకీయం కాక ఇంకేంటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం సిట్‌ను నియమించి బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని గుర్తుచేశారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దుచేయాలనే కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం బాధాకరమైనా తప్పలేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే.. వాటిని పక్కన పడేసి తనతో కలిసి రావాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్‌ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందనీ, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టి పేపర్‌ను లీక్‌ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదేనని స్పష్టం చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.