Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
జన చైతన్య యాత్రకు.. జన నీరాజనాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

జన చైతన్య యాత్రకు.. జన నీరాజనాలు

Sat 18 Mar 05:52:15.864891 2023

- వర్షాన్ని సైతం లెక్క చేయక..
- సపరివార సమేతంగా తరలొచ్చిన జనం
నవతెలంగాణ -మట్టేవాడ/హన్మకొండ/వరంగల్‌
            సీపీఐ(ఎం) జెండాలతో ఓరుగల్లు నగరం ఎరుపుమయమైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సభవైపు సాగిన జన సమూహాన్ని చూసి వరుణుడే శాంతించాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన జన చైతన్య యాత్ర శుక్రవారం మొదటిరోజు హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌లలో విజయవంతమైంది. వరంగల్‌లోని ఆజంజహీ మిల్లు గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన జన చైతన్య యాత్ర ప్రారంభ బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు ఎర్రజెండాలు చేత బూని వరంగల్‌ నలువైపులా ఉన్న ప్రధాన కూడళ్లల నుంచి ఆటపాటలతో, డప్పు చప్పులతో, కోలాటాలు ఆడుతూ నినాదాలతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎర్రటి చీరలు, ఎర్రని అంగీలతో రోడ్లను ఎరుపు మయం చేస్తూ భారీ ప్రదర్శన చేశారు. కోలాటాలు ఆడుతూ డబ్బు చప్పులతో డీజే మోతలతో ఎర్రజెండాలు చేత పట్టుకొని నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. కొత్తపేట పైడిపల్లి ఎమ్‌హెచ్‌నగర్‌ జక్కలొద్దీ రంగసాయిపేట్‌ బెస్తం చెరువు వంటి పలు ప్రాంతాల నుండి జనం భారీగా తరలివచ్చారు. సభ వేదికపై కార్యకర్తలను ఉత్సావంతులు చేసే విధంగా పాటలు, నృత్యాలు అలరించాయి. బహిరంగ సభలో పార్టీ అగ్ర నాయకులు మాట్లాడుతుంటే ప్రజల్లో ఆనందం వెల్లి విరిసింది. సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించారు. సీపీఐ(ఎం) తమకు అండగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పార్టీతో కలిసి పోరాటాలు చేసి చిరకాల స్వప్నం అయినా సొంతింటి కలను నెరవేర్చుకుంటామనే భరోసా ప్రజల్లో కనిపించింది. ఎవరిని అడిగినా పార్టీతో పాటు పోరాటాలు చేస్తామనే మాట సభ ప్రాంగణంలో ఎవరిని కలిపినా వినిపించింది.
హన్మకొండ కుడా గ్రౌండ్‌ ఎరుపుమయం
శుక్రవారం ఉదయం హనుమకొండలో నిర్వహించిన జన చైతన్య యాత్ర విజయవంతమైంది. యాత్ర అనుకున్న సమయానికి ఉదయం 9గంటలకు కాజీపేట జంక్షన్‌ నుంచి ప్రారంభమైంది. ఉదయం వర్షం పడుతున్నా జనం లెక్కచేయలేదు. పది గంటల వరకే కుడా గ్రౌండ్స్‌ నిండిపోయింది. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి. సభ ప్రారంభానికి ముందు వర్షం కొద్దిగా వెలిసినా సభ జరుగుతున్నంత సేపు చిరుజల్లులు పడినా ప్రజలు చివరిదాకా ఉన్నారు.
బీజేపీ గద్దె దింపుటకే నేను సైతం పోరాటంలో :ఓడపల్లి అనిత బెస్తం చెరువు
నేను సైతం జనచైతన్య యాత్రకు మేము సైతం అంటూ రెండు సంవత్సరాల బాబుతో తన తల్లి రావడం అక్కడికి వచ్చిన పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఒక కూతురు ఒక కొడుకుతో సభా ప్రాంగణానికి వచ్చాను. ఈ సభలో ముఖ్య నాయకులు మాట్లాడిన మాటలు వింటుంటే బీజేపీ ప్రభుత్వంను గద్దెదించే వరకు పోరాడుదామనే పోరాట పటిమ వచ్చింది. ముఖ్య నాయకులు అన్న మాటలు ఆసక్తిని కల్పించాయి. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే నిరుపేదల బతుకులు మరింత దారిద్య్రంలోకి వెళ్తున్నాయి. బీజేపీ గద్దె దింపుటకే నేను సైతం పోరాటంలో ఉంటాను.
పోరాట పటిమను నింపాయి : యాస్మిన్‌ కాశిబుగ్గ
ప్రజల హక్కులు దినదినం కోల్పోతున్నాం. ఎర్రజెండా అండతోనే మహిళల హక్కులను సాధించుకుంటాం. కులం, వర్గం మతం అసమానతలు బీజేపీలో పెట్రేగిపోతున్నాయి. మహిళలపై హత్యలు లైంగికదాడులు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఐక్యమత్యంతో అందరం ఉద్యమించాలని ముఖ్య నాయకులు చెప్పిన మాటలు మాలో పోరాటపటిమను పెంపొందించాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.