- నిందితుడి అరెస్టు
- నిర్భయ కేసు నమోదు
నవతెలంగాణ - సిటీబ్యూరో
విదేశాల్లో ఉద్యోగం ఇప్పించి సహాయం చేయాలని కోరిన ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై చార్మినార్ పోలీసులు నిర్భయ యాక్టు నమోదు చేశారు. మంగళవారం ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి వివరాల మేరకు..అనంతపూర్కు చెందిన ఓ మహిళ (30)కు ముళ్లా అబ్దుల్ అజీజ్తో 12 ఏండ్ల క్రితం పెండ్లయింది. అయితే మూడేండ్ల క్రితం భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలను కష్టపడి పోషిం చుకుంటోంది. తమ కష్టాలు తీరాలంటే దుబా రు వెళ్లాలని నిర్ణయిం చుకున్న ఆమె భువనగిరిలో నివాసము ంటున్న క్యుమర్ అనే దూరపు బంధువును సంప్రదించింది. హైదరాబాద్, మోయిన్బాగ్లో నివాసముంటున్న పూల వ్యాపారి మహ్మద్ కరీమొద్దీన్ అందుకు సహాయం చేస్తాడని, తనకు బాగా తెలుసని వీసా ఏర్పాటు చేస్తాడని పరిచయం చేశాడు. పూల వ్యాపారంతోపాటు వీసాలు ఇప్పించే కరీం ఆమెపై కన్నేశాడు. వీసా ఇప్పిస్తానని పలుసార్లు ఫోన్లో మాట్లాడాడు. కొన్ని వివరాలు కావాలంటూ ఆమె నుంచి పాస్పోర్టు తీసుకున్నాడు. 18న ఫోన్చేసిన నిందితుడు దుబారులో జాబ్ విసా రెడీగా ఉందని, హైదరాబాద్కు వచ్చి తీసుకోవాలంటూ నమ్మించాడు. అయితే నిజంగా వీసా వచ్చిందని నమ్మిన బాధితురాలు ఈనెల 20న హైదరాబాద్కు చేరుకుంది. ఆటోలో గుల్జార్హౌజ్కు తీసుకెళ్లిన నిందితుడు తాను చెప్పినట్టు వింటేనే వీసా ఇస్తానని లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు నిరాకరించడంతో వీసాలు, పాస్పోర్టు కావాలంటే తాను చెప్పినట్టు వినాలంటూ బెదిరించాడు. అక్కడి నుంచి బలవంతంగా మోహిన్పురాలోని తన రూంకు తీసుకెళ్లాడు. రూంలోకి వెళ్లగానే బాధితురాలిపై దాడిచేసిన కరీమొద్దీన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. రూమ్లో బంధించి పెండ్లి చేసుకోవాలంటూ బెదిరించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తెలిసిన వారింటికి వెళ్లింది.
పోలీసులకు ఫిర్యాదుచేస్తే వీసా, పాస్పోర్టు ఇవ్వడనే భయంతో ఫిర్యాదు చేయలేదు. ఎలాగోల ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు 26న చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు సీకరించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై నిర్భయ కేసు నమోదుచేసి రిమాండ్ తరలించినట్టు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
Authorization