అనగనగా ఒక చేప. దాని పేరు మల్లి. చూడటానికి అందవికారంగా ఉన్నా మనసు చాలా మంచిది. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని తపిస్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్న వస్తువులు, బొమ్మలు పిల్లలకు పంచి పెడుతూ ఉంటుంది. ఆపదల్లో ఉన్నవారిని అదుకుంటుంది. ఈ విధంగా తన గురించి ఆలోచించకుండా పరుల సేవే పరమావధిగా నమ్మి తన జీవితాన్ని హాయిగా గడిపేస్తూ ఉంటుంది.
ఒక రోజు మల్లి తోటి పిల్లలను బడిలో వదలటానికి తీసుకెళ్తుంది. పిల్లలను బడిలో వదిలి పెట్టి వస్తుంటే... దారిలో కాపాడండీ... కాపాడండీ... అని పెద్ద శబ్దం వినిపిస్తుంది. మల్లి వెంటనే అటు వెళ్లి చూస్తే రాళ్లల్లో ఒక చేప ప్రమాదంలో ఉంది. ''దయ చేసి నన్ను రక్షించండి అంటూ కేకలు వేస్తుంది''. నువ్వేం భయపడకు నిన్ను బయటకు లాగి కాపాడుతాను అంది మల్లి. చాలా జాగ్రత్తగా ఆ చేప ప్రాణాలను కాపాడింది. ''చూడు నీ పేరేంటో తెలీదు, నన్ను బయటకు లాగి బతికించావు. చాలా సేపటి నుంచి ఎవరైన సహాయం చేయండి అని అరుస్తూనే ఉన్నాను. కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు. నువ్వు నా ప్రాణాలు కాపాడవు, నిజంగా నీ మనసు బంగారం. నేను ఊరికే వెళ్లను నీకేదైనా వరం ఇచ్చి వెళతాను. చెప్పు నీకేం కావాలో కోరుకో'' అంది ఆ చేప.
'నేను ఏది కోరితే అది ఇస్తానంటున్నావు, నీ దగ్గర ఏదైనా మహాత్యం ఉందా...! ఇంతకూ నువ్వు ఎవరు...!' అడిగింది మల్లి. 'నేనెవరో తెలుసుకోవాలని ఉందా...! అయితే చూడు...! నేను ఈ సముద్రానికి రాణిని. రా మల్లి... దగ్గరకు రా.... నేను ఈ లోకంలోని సమస్త జీవుల మంచి, చెడును గమనిస్తుంటాను. మంచి మనసు, దయ, కరుణా గలవారిని మెచ్చుకొని వరాలు ఇస్తుంటాను. చెడు చేసే వారిని శిక్షిస్తుంటాను. నీలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అడుగు నీకేం వరం కావాలో కోరుకో మలి'్ల... ''నేను చూడటానికి చాలా అందవికారంగా ఉన్నాను. నాకు అందరిలా అందంగా ఉండాలని కోరిక. నన్ను అందంగా మార్చవూ''. సరే అని మల్లిని అందంగా మార్చేసింది. ''నా రూపాన్ని నేనే నమ్మలేకపోతున్నాను''. క్రమ క్రమంగా మల్లిలో గర్వం పెరిగిపోయింది. స్నేహితులను, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మర్చిపోయింది. చివరకు తన స్నేహితులను కూడా దూషించడం మొదలు పెట్టింది. ఇక ఎప్పుడు నా దగ్గరకు రాకండి అంటూ మిత్రులను దూరం చేసుకుంది. అరే ఎమైంది మల్లికి, ఎందుకలా ప్రవర్తిస్తుంది. అది అందంగా తయారైనప్పటి నుంచి చాలా మార్పు మంచిది. దానికి ఇంతకు ముందున్న దయా గుణం ఏమైంది. దాని గురించి ఇక మాట్లాడకండి అనుకుంటూ మిగత చేపలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఒక దుష్ట చేప తనకన్న అందంగా ఉన్న చేపను చంపితేదాని అందం తనకు వస్తుందని మూర్ఖులు చెప్పిన మాటాలను నమ్మి మల్లిని చంపడానికి పూనుకుంది. కానీ అంతలో రాణీ చేప వచ్చి మల్లిని రక్షించింది. భయపడకు మల్లి నీకే ప్రమాదం లేదు. ఇలా జరగటానికి కారణం నువ్వు, నీ అందం. నువ్వు అందంగా తయారవడం వల్ల నీలోని మంచి తనం, దయాగుణం మర్చిపోయి గర్వం పెరిగింది. ''నన్ను క్షమించు రాణి నేను చేసిన పొరపాటుకు చాలా పచ్చాతాపడుతున్నాను. నాకు నా మిత్రులు కావాలి. ఇంతకు ముందు మాదిరి వాళ్లతో కలిసి ఉండాలి. ఈ అందం వద్దు. ఏమీ వద్దు. నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు. పర్వాలేదు ఇక నుంచి మంచి ప్రవర్తన కలిగి ఉండు. చివరగా ఒక మాట చెబుతాను విను... ''జీవితంలో అందం ముఖ్యమైంది కాదు. మంచి మనసు, స్నేహభావం, దయాగుణం ఉంటే మన జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది''.
Authorization