పిల్లలూ! చాచానెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే కదా! బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. ఈ రోజు శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. టీవీలు, రేడియోల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు, బాలల దినోత్సవం సందర్భంగా దాని గురించిన విశేషాలు తెలుసుకుందాం.
ఈరోజు భారత దేశంలో బాలల దినోత్సవం. అదే విధంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం కూడా. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పిల్లలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్సర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందు కుగాను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటారు. నిజానికి 1959కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించి బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా.
కొన్ని దేశాలు వాటి వాటి ప్రత్యేకతలను బట్టి వేరు వేరు రోజుల్లో బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ నవంబరు 14న భారత దేశంలో జరుపుకునే బాలల దినోత్సవం. ఈ రోజు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు. నెహ్రూకి నాయకత్వ బాధ్యతలతో క్షణం తీరిక లేకున్నా పిల్లలతో గడపడంటే చాలా ఇష్టం. నిజానికి ఒక పిల్లాడు తన కోటు మీద గులాబిని ఉంచినప్పటినుంచే ఆయన తప్పనిసరిగా గులాబిని ధరించటం ఒక నియమంగా పెట్టుకున్నారు. పిల్లలకు కూడా ఆయన్ని సొంత బాబాయిగా బావించి చాచా అని పిలిచేవారు. అందుకని మన దేశానికి ఒక బాలల దినోత్సవం కావాలని అనుకున్నప్పుడు మరో ఆలోచన లేకుండానే న్నెహ్రూ పుట్టిన రోజునే ఎంచుకున్నారు. ఆయన జీవితంలో ఎక్కువ భాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు
Authorization