* తప్రపంచంలోని 63 శాతం కుష్ఠువ్యాధిగ్రస్తులు భారతదేశంలో ఉన్నారు. * ప్రతి నాలుగు నిమిషాలకు ఒక్క వ్యక్తి కుష్ఠువ్యాధికి గురవుతున్నారట? * వ్యాధిగ్రస్థులలో పది శాతం పిల్లలు ఉన్నారట? * ప్రత్యేకంగా కుష్ఠువ్యాధిగ్రస్థులకు 2016 లో లెప్రా సొసైటి అందించిన సామాజిక సేవల గురించి తెలుసుకుందాం... * త1,710,245 వ్యక్తులకు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాల ద్వారా కుష్ఠువ్యాధి గురించి అవగాహన కలిపించారు. * 1,57,200 ప్రజలకు పాఠశాల, సామాజిక ఆరోగ్య కార్యక్రమాల ద్వారా కుష్ఠువ్యాధి నిర్థారణ పరీక్షలు జరిపించారు. * 611 వ్యాధిగ్రస్తులకు పునర్నిర్మాణ శస్త్ర చికిత్సకు సహాయపడ్డారు. త7,483 వ్యక్తులకు స్వీయ సంరక్షణ పై శిక్షణ ఇస్తున్నారు. 13,980 కుష్ఠువ్యాధిగ్రస్తులకు 24,612 జతల ప్రత్యేక పాదరక్షలు, ఇతర సహాయ పరికరాలను అందిస్తున్నారు.ముఖ్యంగా 2,024 కుష్ఠువ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కలిపించి, వారి జీవనశైలి మెరుగు పరుచుటలో కీలకమైన పాత్ర పోషించారు.