ఏటా పుట్టిన రోజు పండగ జరుపుకుంటాం. మన పుట్టిన రోజు మనకు, ఇంట్లో వాళ్లకు మాత్రమే పండగ. కానీ నెహ్రూ పుట్టిన రోజు పిల్లలందరికీ పండగ. ఆ రోజు బళ్లో పిల్లలందరికీ మిఠాయిలు, బోలెడు పోటీలు, గెలిచిన వారికి బహుమతులు.. ఆ రోజంతా మీదే!
నెహ్రూ చెప్పిన మాటలు
సాపిల్లలు మొగ్గల్లాంటి వాల్లు. అందుకే వారి పట్ల ఎంతో శ్రద్ధ చూపాలి. దేశ భవితవ్యం వారిపైనే ఆధారపడి ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు. దేశ సేవకు పాటుపడే వారే దేశపౌరులు.
సా లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి.
సా మన ఆదర్శాలను, సిద్ధాంతాలను, లక్ష్యాలను మర్చిపోయినప్పుడే అపజయం మనల్ని చేరుతుంది.
- బాలల దినోత్సవాన్ని అన్ని దేశాల వారూ ఏవో తేదీలు, సంప్రదాయాలను బట్టి నిర్ణయించుకున్నారు. మనం మాత్రం దేశ తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ (14-11-1889, 27-5-1964) పుట్టిన రోజును బాలల పండగగా జరుపుకుంటున్నాం. ఆయన పిల్లల అభివృద్ధి కోసం , సమాజంలో వారి ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు చేసిన కృషికి గాను ఈవిధంగా ఆయన్ను గౌరవిస్తున్నాం.
-- అల్లరి చేసినా.. మారాం చేసినా.. ముద్దు ముద్దుగా మాట్లాడినా.. చిట్టిపొట్టిగా చిందేసినా.. చిన్నారులు ఏం చేసినా.. ఆనందమే. అందుకే ప్రతి ఒక్కరూ పిల్లల ప్రపంచంలో భాగం కావాలని ఆశపడుతుంటారు. మన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకి కూడా పిల్లలంటే ఎంతో అభిమానం. 'పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. ఏ పవిత్ర స్థలంలోనూ నాకు అంతటి శాంతి, సంతప్తి లభించవు' అన్నారు నెహ్రూ. పిల్లల్ని అంతగా ప్రేమించినందునే ఆయనను కూడా.. పిల్లలు అంతే ప్రేమించారు. అందుకే ముద్దుగా 'చాచా' (చాచా అంటే బాబారు) గా పిలుచుకున్నారు.
- మన దేశ తొలి ప్రధానిగా సేవలందించిన జవహర్లాల్ నెహ్రూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అత్యవసర పనులున్నా.. ఎన్ని సమస్యలున్నా.. బాధ్యతలున్నా.. పిల్లల కోసం సమయాన్ని కేటాయించేవారు. తీరిక చేసుకుని వాళ్లతో మాట్లాడేవారు. పిల్లలంటే ఆయనకు ఎంత ఇష్టమంటే.. ఓ రోజు.. ఒక చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇచ్చింది. వెంటనే ఆయన కోటుకు పెట్టుకున్నారు. అది చూసిన ఆ చిన్నారి.. ఎంతో మురిసిపోయింది. ఆ నవ్వుల చిన్నారి.. అరవిరిసిన గులాబీ.. నెహ్రూకు ఒకేలా అనిపించాయట. అంతే ఆ రోజు నుంచి చిన్నారుల గుర్తుగా దాన్ని 'కోటు'పై ధరించడం అలవాటు చేసుకున్నారు.
- నెహ్రూ పూర్వీకులు కశ్మీర్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. వారి కుటుంబం ఢిల్లీలో ఓ కాలువ ఒడ్డున ఉండేది. హిందీలో కాలువను 'నెహర్' అంటారు. అలా వారికి 'నెహ్రూ' అనేది ఇంటి పేరుగా మారింది. నిజానికి వారి ఇంటి పేరు 'కౌల్'.
- 1959 కి ముందు ప్రపంచ వ్యాప్తంగా 'బాలల దినోత్సవాన్ని' అక్టోబర్ నెలలో జరుపుకునేవారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి, అందులోని సభ్య దేశాలు కలిసి నవంబర్ 20న 'అంతర్జాతీయ బాలల దినోత్సవం'గా జరుపుకోవాలని తీర్మానించాయి. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడంతో పాటు, పరస్పర అవగాహన పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు 'ఐరాస' ఈ దినోత్సవానికి రూపకల్పన చేసింది. అంతేకాకుండా ఈ రోజు వివిధ దేశాల నుంచి పిల్లల అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం నిధులను సేకరిస్తుంది.
సా బాలల అవసరాలను గుర్తించడం, వారి అభివృద్ధికి తోడ్పడటం, హక్కులను పరిరక్షించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఒక్కో తేదీనాడు ఈ పండుగను నిర్వహిస్తున్నారు. జపాన్లో బాలల దినోత్సవాన్ని నిర్వహించే పద్ధతి 8వ శతాబ్దం నుంచే ఉంది. ఆడపిల్లలకు, మగపిల్లలకు వేరువేరు రోజుల్లో ఈ వేడుకల్ని జరుపుతారు. ఏటా మార్చి 3న ఆడపిల్లల పండుగను జరుపుతారు. మే 5న అబ్బాయిల కోసం విడిగా పండుగను నిర్వహిస్తారు.
Authorization