హలో చిన్నారులూ...! మీరు రక్తాన్ని చూసే ఉంటారు... మనకు ఏదైనా బలమైన గాయం తగిలినా, లేదా చర్మం ఏదయినా కారణాల వల్ల తెగినా ముందుగా రక్తం బయటకు వచ్చేసుంది! రక్తం ఎక్కువగా బయటకు పోయినా ప్రమాదమే. ఎందుకంటే అది జీవి మనుగడకు ఎంతో ముఖ్యం. మరి మన శరీరానికి ఎంతో ప్రధానమైన నెత్తురు గురించి ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకుందాం....
- నెత్తురు ద్రవరూపంలో ఉన్న శరీర నిర్మాణ ధాతువు లేదా కణజాలం. జీవి మనుగడకి ఇది అత్యంత అవసరం.రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హిమటాలజీ' అంటారు. వైద్య పరిభాషలో రక్తానికి సంబంధించిన విషయాలకు సాధారణంగా హీమో లేదా హిమాటో అన్న ఉత్తరపదం ఉంటుంది. ఇది గ్రీకు భాషా పదము హైమా (రక్తం) నుండి వచ్చింది.
- రక్తంలో 90 శాతం నీరే ఉంటుంది. మిగిలిన పదిశాతంలో మాంసకృత్తులు, లవణాలు, గ్లూకోజు, కొవ్వు పదార్థాలు, ఫైబ్రినోజన్ ఉంటాయి.
- ఇంకా రక్తంలో ఎర్రరక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఉంటాయి. మన రక్తాన్ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్)తో పరిశీలిస్తే అందులోని యాంటిజన్లు భిన్నంగా ఉంటాయి. యాంటిజన్లు అంటే ఒక రకమైన మాంసకృత్తులు. యాంటిజన్లలో ఉండే తేడాల వల్లనే రక్తంలో వర్గాలు (గ్రూపులు) ఏర్పడ్డాయి.
- ఎర్రరక్తకణాలు: ఇందులో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ పదార్థం ఉండటంతో ఎర్రగా ఉంటాయి. ఒకచుక్క రక్తంలో 200 మిలియన్ల ఎర్రరక్త కణాలుంటాయి. ఇవి ఎముక మూలుగలో వృద్ధి చెంది శరీరమంతటా విస్తరిస్తాయి. జీవితకాలం 120 రోజులు. వీటి ముఖ్యమైన పని శరీరం మొత్తానికి ఆక్సిజన్ను చేరవేయడం. ఎర్రరక్త కణాలు తక్కువైతే అనీమియా వస్తుంది. అనీమియా అంటే.. శరీరంలో రక్తం తక్కువగా ఉండటం.
- తెల్లరక్త కణాలు: ఇందులో హిమోగ్లోబిన్ ఉండదు. ప్రతి 700 ఎర్రరక్త కణాలకు ఒక తెల్లరక్త కణం ఉంటుంది. ఇవి 13 నుంచి 20 రోజులు జీవిస్తాయి. రోగకారక క్రిములతో పోరాడి మన శరీరాన్ని రక్షించడం వీటి ప్రధానమైన పని.
- ప్లేట్లెట్స్: ఇవి సంపూర్ణ కణాలు కావు. ఆకారంలో చాలా చిన్నవి. ఒక క్యూబిక్ మి.మీ. రక్తంలో లక్షన్నర నుంచి నాలుగు లక్షల వరకు ఉంటాయి. రక్తం గడ్డకట్టడానికి ఇవి ఉపయోగపడుతాయి.
- ప్లాస్మా: ప్రతి వ్యక్తిలో 3 నుంచి 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఇందులో సగభాగం కంటే ఎక్కువగా ప్లాస్మా ఉంటుంది. ఇది పసుపు రంగులో ఉండే చిక్కటి ద్రవపదార్థం.
- రక్త గ్రూపులను ఈవిధంగా వర్గీకరించారు. రక్తకణాల్లో యాంటీజన్ ఉంటుంది కదా! భిన్నమైన యాంటీజన్ల వల్ల రక్తం భిన్నమైన గ్రూపులుగా ఉంది. 1900 సంవత్సరంలో రెండు రకాల యాంటీజన్లను కార్ల్ ల్యాండ్ స్టీనర్ గుర్తించాడు. వాటికి ఎ, బి లుగా పేర్లు పెట్టాడు. తరువాత కొందరిలో ఈ రెండు యాంటిజన్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిని ఎబి గ్రూపులుగా పిలిచారు. వీరు ఎవరి రక్తాన్ని అయినా తీసుకోవచ్చు. వీరిని విశ్వ గ్రహీత అంటారు. మరికొందరిలో ఎ, బి యాంటిజన్లు లేని రక్తాన్ని గుర్తించారు. దీనికి 'ఒ' గ్రూపు అని పేరు పెట్టారు. 'ఒ' గ్రూపు వారికి 'ఒ' గ్రూపు మాత్రమే సరిపోతుంది. వీరు ఎవరికైనా రక్తం ఇవ్వవచ్చు. వీరిని 'విశ్వదాత' అని పిలుస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి వర్గం రక్తం పిల్లలకి వస్తుంది.
- పాజిటివ్ (+), నెగెటివ్ (-) రక్తం గురించి....
రక్తంలో నాలుగు గ్రూపులున్నాయి. మళ్లీ ఇందులో పాజిటివ్, నెగెటివ్ అనేది రీసెస్ యాంటిజెన్ని బట్టి తెలుసుకుంటారు. ఎర్రరక్త కణాల్లో ఉండే ఒకరకమైన రీసెస్ యాంటిజెన్ అనే ప్రోటీన్ పదార్థం అనుకూల (+) రక్తం కలవారిలో మాత్రమే ఉంటుంది. ఆర్హెచ్(=ష్ట్ర) అనే ప్రోటీన్ పదార్థం లేకపోతే వారి రక్తం నెగెటివ్ (-) అన్నమాట.
Authorization