మనదేశం మూడువైపుల నీరు, ఒకవైపు నేల ఉన్న ప్రదేశం కాబట్టి ద్వీపకల్పం అంటారు. దేశం లోపల దీవులుండవు. కానీ మనదేశానికి తూర్పున ఉన్న బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవులు, పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రంలో ఉన్న లక్షదీవులు మనదేశానికే చెందుతాయి. అవన్నీ దీవుల సమూహాలు. వాటిలో చిన్న, పెద్ద అన్నీ కలిపి వెయ్యికి పైగా దీవులుంటాయి. అయితే సుమారు వంద దీవుల్లోనే మనుషులుంటారు. మిగిలినవన్నీ మనుష సంచారం లేనివే. ఈ దీవులు భారత ప్రధాన భూభాగం కంటే ఇండోనేషియా దేశానికే దగ్గర. ఈ దీవుల్లో బారెన్ ఐలాండ్ ఉంది. అది అగ్నిపర్వతం.