ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ఘనుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5న జన్మించారు. చిన్నతనం నుంచి చదువులో ముందుండేవారు. ఆయన మొదట మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో అధ్యాపకునిగా పనిచేశారు. తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్కతా యూనివర్సిటీలో పనిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు రాధాకృష్ణన్. ఆయన ప్రముఖ జర్నల్స్ 'ది క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్'కు ఆర్టికల్స్ రాశారు. 1952లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ తొలి రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. రెండవసారి కూడా కొనసాగారు. అలా అందరికీ ఆదర్శప్రాయుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే ప్రతి ఏడాది అన్ని స్కూళ్లలో, కాలేజీల్లో గురుపూజోత్సవం జరుపుకుంటారు. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైన సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న 'టీచర్స్ డే'గా జరుపుకోవడం మొదలుపెటఆటరు. 1954లో ఆయనను ప్రతిష్టాత్మకమైన 'భారత రత్న'తో గౌరవించింది భారత ప్రభుత్వం. సర్వేపల్లి రాధాకృష్ణన్ తన 87 ఏండ్ల వయసులో 1975 ఏప్రిల్ 17న కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్యలేకపోయినప్పటికీ అమరజీవిగా ప్రతి ఉపాధ్యాయుడిలోనూ జీవించే ఉంటారు.
Authorization