వృక్ష శిలాజాల గురించి ఎన్నో పరిశోధనలు చేసిన పురావృక్షశాస్త్ర నిష్ణాతుడు, శాస్త్రవేత్త బీర్బల్ సాహ్ని. 1891 నవంబర్ 14న మనదేశంలో పశ్చిమ పంజాబ్లోని భేరా ప్రాంతంలో సాహ్ని జన్మించాడు. 1911లో పంజాబ్ యూనివర్సిటీలో సైన్స్ డిగ్రీ పూర్తి చేసి 1919లో సైన్స్లో డాక్టరేట్ పొందాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, పంజాబ్ యూనివర్సిటీ, లక్నో యూనివర్సిటీలలో అధ్యాపకునిగా పనిచేశాడు. పూర్వకాలంలో నశించి పోయిన జంతు జాతులలాగానే అనేక వృక్ష జాతులు కూడా ఉన్నాయి. వీటి శిలాజాల ఆధారంగా బీర్బల్ సాహ్ని నిరంతర పరిశోధనలు సాగించాడు. గోండ్వానా వృక్షాల గురించి, బీహార్లోని పర్వత ప్రాంతాలలో జురాసిక్ కాలం నాటి వృక్ష అవశేషాలను గురించి ఆయన చేసిన పరిశోధనలు ప్రసిద్ధి చెందాయి. 1936లో ఆయన రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1949 ఏప్రిల్ 10న కన్నుమూశాడు. ఆయన పేరిట లక్నోలో బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ నెలకొల్పబడింది.