అంతర్జాతీయం
జర్మన్ ఛాన్స్లర్గా నాలుగోసారి ఏంజెలా మెర్కెల్
జర్మన్ ఛాన్స్లర్గా ఏంజెలా మెర్కల్ నాలుగోసారి ఎన్నిక య్యారు. ఆధునిక జర్మన్ చరిత్రలో ఎన్నికల తర్వాత ఛాన్స్ లర్ను ఎన్నుకోవడానికి సుదీర్ఘంగా 171 రోజులు పట్టింది.
నేపాల్ అధ్యక్షురాలిగా మళ్లీ బిద్యాదేవి భండారి
నేపాల్ అధ్యక్షురాలిగా బిద్యాదేవి భండారి(56) 2018 మార్చి 13న తిరిగి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికలో ఆమె తన సమీప నేపాలీ కాంగ్రెస్ నాయకురాలు కుమారి లక్ష్మీరారుపై విజయాన్ని సాధించారు. నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రత్యేకంగా నిలిచిన ఆమె మరోమారు అదే పదవిలో కొనసాగనున్నారు.
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 15న ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంను 1983 మార్చి 15న నిర్వహించారు. 2018 ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవం థీమ్ ` Making Digital Marketplaces Fairer
ప్రపంచంలో జీవనవ్యయం డెమాస్కస్లో అత్యంత తక్కువ
ప్రపంచంలో జీవనవ్యయం అత్యంత తక్కువగా ఉన్న నగరాల్లో సిరియా రాజధాని డెమాస్కస్ ప్రథమ స్థానంలో ఉంది. అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ వరుసగా అయిదో ఏడాదీ నిలిచింది. ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకగా ఉన్న నగరాలపై ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) సర్వే చేపట్టి, 'ప్రపంచవ్యాప్త జీవనవ్యయం 2018 నివేదిక'ను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకగా ఉన్న 10 నగరాల్లో భారత్కు చెందిన బెంగళూరు (5వ స్థానం), చెన్నై (8వ స్థానం), ఢిల్లీ (10వ స్థానం) ఉన్నాయి.
పనామా పత్రాల మొసాక్ ఫోన్సెకా మూసివేత
ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేత కుంభకోణం పనామా పత్రాల వ్యవహారంలో కేంద్ర బిందువుగా నిలిచిన మొసాక్ ఫోన్సెకా తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు 2018 మార్చి 15న ప్రకటించింది. ప్రతిష్ట మసకబారడం, మీడియా ప్రచారం, ఆర్థిక పరిణామాలు, పనమాకు చెందిన కొందరు అధికారుల చర్యల వల్ల కోలుకోలేని నష్టం వాటి ల్లడం వల్ల మార్చి నెలాఖరు నుంచి పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
మారిషస్లో వరల్డ్ హిందీ సెక్రటేరియట్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2018 మార్చి 13న మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో వరల్డ్ హిందీ సెక్రటేరియట్ను ప్రారంభించారు. ఈ సెక్రటేరియట్ను పూర్తిగా భారత నిధులతో ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడి 2015లో వరల్డ్ హిందీ సెక్రటేరియట్కు శంకుస్థాపన చేశారు. హిందీని ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల భాష 'జనభాష'గా మార్చడమే ఈ సెక్రటేరియట్ ముఖ్య ఉద్దేశం.
సౌదీ అరేబియా టూరిస్టు వీసాలు జారీ
మొట్టమొదటిసారి సౌదీ అరేబియా తమ దేశంలో పర్యటించే ముస్లిమేతర పర్యాటకులకు టూరిస్టు వీసాలు జారీ చేయా లని నిర్ణయించింది. మహిళలు కూడా సౌదీ పర్యటనకు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారితో ఎవరైనా పురుషులు తోడు ఉండాలనే నిబంధన విధించింది. ముస్లి మేతర సందర్శకులను ఎట్టి పరిస్థితులలో పవిత్ర మక్కా, మదీనాలకు అనుమతించ బోమని సౌదీ స్పష్టం చేసింది.
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్కు ఉద్వాసన
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్పై కొంత కాలంగా ఆగ్రహంగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. టిల్లర్సన్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న సమయంలో అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా సీఐఏ డైరక్టర్ మైక్ పాంపియోను నియమిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి రాజకీయానుభవం లేకపోయినా ఎక్సన్ మొబిల్ సీఈవో టిల్లర్సన్ను 2017 ఫిబ్రవరి 1న ట్రంప్ విదేశాంగ మంత్రిగా నియమించారు.
అత్యంత హింసాత్మకమైన నగరం లాస్ కాబోస్
ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన నగరంగా మెక్సికో లోని లాస్ కాబోస్ నిలిచింది. లక్ష మంది జనాభాకు ఎంత మంది హత్యకు గురవుతున్నారన్న అంశం ఆధారంగా మెక్సి కోకు చెందిన హింస వ్యతిరేక మేధావుల బందం జరిపిన ఈ అధ్యయనంలో వెనిజులాలోని కారకాస్, మెక్సికో లోని అకాపు ల్కో నగరాలు ద్వితీయ, తతీయ స్థానాలను ఆక్రమించాయి.
పొగాకుతో ఏటా 71 లక్షల మంది మృతి
పొగ తాగడం వల్ల సంభవిస్తున్న ప్రతి మరణం నుంచి ప్రపం చంలోని పొగాకు పరిశ్రమ 9,730 డాలర్ల (రూ. 6.3 లక్షలు) వంతున లబ్ది పొందుతున్నట్లు 'టుబాకో అట్లాస్' నివేదిక వెల్లడించింది. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో పొగాకుకు అలవాటుపడిన ప్రజల నుంచి వాటికి లాభాలు పెరుగుతున్నట్లు వెల్లడించింది. అత్యధిక మరణా లకు సిగరెట్లు తాగడమే కారణంగా తెలిపింది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, యూఎస్కు చెందిన వైటల్ స్ట్రాటజీస్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన 'టుబాకో అట్లాస్' నివేదికలో ప్రపంచవ్యాప్తంగా పొగాకు దుష్ప్రభావాలు పెరుగుతున్న తీరును వివరించింది.
జాతీయం
ప్రపంచ స్మార్ట్ సిటీల్లో భువనేశ్వర్
ఒడిశా రాజధాని భువనేశ్వర్కు స్మార్ట్ సిటీల జాబితాలో ప్రపంచంలోనే 20వ స్థానం దక్కింది. జునిపర్ రీసెర్చ్ అనే సంస్థ ఇంటెల్ సాయంతో గ్లోబల్ స్మార్ట్ సిటీ పర్ఫామెన్స్ ఇండెక్స్ పేరుతో 2017 జూలై నుంచి సెప్టెంబరు వరకు ఓ సర్వే నిర్వహిం చింది. ఆ ఫలితాలు తాజాగా విడుదల య్యాయి.ఈ జాబితా లో చోటు సాధించిన ఏకైక భారతీయ నగరం భువనేశ్వర్.
2018 ప్రపంచ సంతోష నివేదికలో భారత్కు 133వ స్థానం
ప్రపంచంలో అత్యంత సంతోషదా యక దేశాల్లో భారత్ 133వ స్థానంలో నిలిచింది. మొత్తం 156 దేశాల వివరాలతో ఐక్యరాజ్య సమితి 2018 ప్రపంచ సంతోష నివేదికను వెల్లడిం చింది. అత్యంత సంతోషదాయక దేశంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానంలో నిలవగా, తూర్పు ఆఫ్రికాలోని బురుండి చివరి స్థానంలో ఉంది.
నగరాల్లో వాహనాల కనీస వేగ పరిమితి గంటకు 70 కి.మీ.లు
నగరాల్లో వాహనాల కనీస వేగ పరి మితిని గంటకు 70 కిలోమీటర్లకు పెంచుతూ కేంద్ర రోడ్డురవాణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్గో వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతిస్తూ కేంద్రం కొత్త ఆదేశాలు ఇచ్చింది. నగరాల్లో ఇక ద్విచక్రవాహనాలు కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకు పోయేందుకు కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చింది.
న్యూఢిల్లీలో IACP-2018
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ సదస్సును 2018 మార్చి 14, 15 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ ఈ సదస్సును ప్రారంభించారు. 2018 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ సదస్సు థీమ్` Challen ges to Policing in 2020 – How is Cyber Space shaping our approach to Cybercrime and Terrorism, how do we perform within it and take advantage of it
ఇంఫాల్లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను 2018 మార్చి 16 నుంచి 20 వరకు ఇంఫాల్లోని మణి పూర్ సెంట్రల్ యూని వర్సిటీలో నిర్వహించనున్నారు. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను తిరుపతిలో నిర్వహించారు. 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2018 జనవరి 3 నుంచి 7 వరకు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సి ఉంది. కానీ, యూనివర్సిటీ అధికారులు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అనువైన పరిస్థితులు లేవని తెలపడంతో ఇంఫాల్కు తరలింది. 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ థీమ్ ` Reaching the Unreached Through Science & Technology
విద్వేష నేరాల నమోదుకు ఆమ్నెస్టీ ఇండియా వెబ్సైట్
భారత్లో చోటుచేసుకుంటున్న విద్వేష నేరాల వివరాలను నమోదు చేసేందుకు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇండియా ఓ వెబ్సైట్ను ప్రారంభించింది. 'హాల్ట్ ద హేట్ (విద్వేషాన్ని ఆపుదాం)' పేరుతో ప్రత్యేక విభాగాన్ని రూపొం దించి దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులపై దాడులు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన కేసులను నమోదు చేస్తోంది.
బెలగావిలో అత్యంత ఎత్తయిన జాతీయ జెండా
భారతదేశంలో అత్యంత ఎత్తయిన జాతీయ జెండాను కర్ణాటకలోని బెలగా విలో ఏర్పాటు చేశారు. 9600 చదరపు అడుగుల జాతీయ జెండాను 110 మీటర్ల ఎత్తులో ఎగురవేశారు. పుణెలో ఉన్న 107 మీటర్ల, పంజాబ్లోని ఇండియా-పాక్ సరిహద్దు లోని అత్తారి వల్ల గల 105 మీటర్ల జాతీయ జెండాల కంటే ఎత్తులో బెలగావిలో జాతీయ జెండాను ఎగురవేశారు.
యూరియాపై మరో 2 సం||లు రాయితీ
యూరియా ఎరువుపై ఇస్తోన్న రాయితీని 2020 వరకూ కొనసాగించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (జజజుA) నిర్ణయించింది. ప్రత్యక్ష నగదు బదిలీ(ణదీు) కింద రాయితీ మొత్తాన్ని రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు.
దేశంలో ఆఫీస్ అద్దెలు అధికంగా గల ప్రాంతం కనాట్ప్లేస్
ఆఫీస్ అద్దెలు ఢిల్లీలోని కనాట్ప్లేస్ అత్యంత ఎక్కువగా ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ నైట్ఫ్రాంక్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ (అపాక్) దేశాల్లోనే 3వ స్థానంలో కనాట్ ప్లేస్ కార్యాలయ అద్దెలున్నాయని పేర్కొంది. ముంబయి లోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్ 20 అంతర్జాతీయ నగరాల్లో 5వ అత్యంత ఖరీదైన వాణిజ్య సముదాయని వెల్లడించింది. చదరపు మీటరుకు 212 డాలర్ల అద్దెతో హాంకాంగ్ మొదటి స్థానంలో ఉంది.
'క్షయ రహిత భారత్-2025'
2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడి 'క్షయ రహిత భారత్-2025' కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. సుస్థిరాభివద్ధి లక్ష్యాల్లో విధించిన గడువు(2030) కంటే ఇది ఐదేళ్లు ముందే ఉంది. 'క్షయకు చరమగీతం' పేరిట 2018 మార్చి 13న న్యూఢిల్లీలో సదస్సు నిర్వహించారు.
ఆధార్ గడువు నిరవధికంగా పెంపు
బ్యాంకింగ్ సహా వివిధ రకాల సేవల్ని, సంక్షేమ పథకాలను పొందడానికి మార్చి 31వ తేదీలోగా ఆధార్ను అందరూ తప్పని సరిగా అనుసంధానించుకోవాలన్న గడువును సుప్రీం కోర్టు నిరవధికంగా పెంచింది. ఆధార్ చట్టాన్ని, బయో మెట్రిక్ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ పూర్తిచేసి, తుది తీర్పును తాము వెలువరించేవరకు ఈ గడువును పొడిగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2018 మార్చి 13న ప్రకటించింది.
దేశంలో ఇంటర్నెట్ వేగంలో చెన్నైకి ప్రథమ స్థానం
దేశంలో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ను వాడుతున్న నగరాల్లో వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా చెన్నై ప్రథమ స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండోస్థానంలో ఉండగా, హైదరాబాద్ మూడో స్థానం పొందింది. నాలుగో స్థానంలో విశాఖపట్నం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగాన్ని గణించే (స్పీడ్ టెస్ట్) సంస్థ ఊక్లా అధ్యయనంలో ఇది తేలింది. అమెరికాలోని సియాటిల్ కేంద్రంగా గల ఈ సంస్థ అధ్యయన నివేదికను 2018 మార్చి 13న విడుదల చేసింది. ప్రపంచంలో అత్యధికవేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని పొందుతున్న దేశంగా సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది.
సురేష్ప్రభుకు అదనపు బాధ్యతగా విమానయాన శాఖ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ప్రభు 2018 మార్చి 10న కేంద్ర విమానయాన శాఖను అదనపు బాధ్యత గా చేపట్టారు. అశోక్గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయడంతో, ఆ శాఖను సురేష్ప్రభుకు అదనపు బాధ్యతగా అప్పగించారు.
న్యూఢిల్లీలో 2018 నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్
2018 నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్ను ప్రధాని నరేంద్ర మోడి న్యూఢిల్లీలో 2018 మార్చి 10న ప్రారంభించారు. 2018 నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్ థీమ్` We For Development
పరోక్ష కారుణ్య మరణం జీవన హక్కులో భాగం : సుప్రీం
'పరోక్ష కారుణ్య మరణాల'పై సుప్రీంకోర్టు 2018 మార్చి 9న చరిత్రాత్మక తీర్పును వెలువరిం చింది. జీవిత చరమాంకంలో ఉన్న రోగి లేదా దీర్ఘకాలంగా అచేతనావస్థలో ఉన్న వ్యక్తి.. వైద్య చికిత్సను నిరాకరిస్తూ ముందస్తు వైద్య నిర్దేశం లేదా 'సజీవ వీలునామా'ను రాయవచ్చని తేల్చి చెప్పింది. హుందాగా జీవించే హక్కులో.. మరణ ప్రక్రియను 'సాఫీగా' సాగేలా చూడటమూ ఓ భాగమేనని స్పష్టం చేసింది. ముందస్తు వైద్య నిర్దేశాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వకుంటే మరణ ప్రక్రియను సాఫీగా సాగేలా చూసే హక్కుకు 'వీలు కల్పించకపోవడమే' అవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
అత్యాచారాలకు మరణశిక్ష బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం
12 సం||ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన కీలక బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ 2018 మార్చి 9న ఆమోదించింది. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ ఇలాంటి బిల్లును ఆమోదించగా రాజస్థాన్ రెండో రాష్ట్రంగా నిలిచింది.
ప్రాంతీయం
ఈ-పెట్టీ కేసెస్ యాప్ ఆవిష్కరణ
రాష్ట్రంలో చిన్న చిన్న తగాదాలపై నమోదయ్యే 'పెట్టీ' కేసులకు చెక్ పెట్టేలా తెలంగాణ పోలీస్శాఖ ఒక యాప్ను రూపొందించింది. 2018 మార్చి 14న హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్రెడ్డి 'ఈ-పెట్టీ కేసెస్' యాప్ను ఆవిష్కరించారు.
తెలంగాణ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్లు
తెలంగాణ శాసన సభ లో ప్యానెల్ స్పీకర్ల ను సభాపతి సిరికొండ మధుసూద నాచారి నియమించారు. బాజిరెడ్డి గోవర్ధన్, రెడ్యానాయక్, కొండా సురేఖ లను ప్యానెల్ స్పీకర్లుగా నియమిస్తు న్నట్లు 2018 మార్చి 13న శాసనసభలో ప్రకటించారు. బాజిరెడ్డిగోవర్ధన్ నిజా మాబాద్ రూరల్, ధరంసోత్ రెడ్యా నాయక్ డోర్నకల్, కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 నూతన జలాశయాలు
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 3 జలాశయాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. పెన్గంగ ప్రాజెక్టులో భాగంగా పిప్పల్కోటి వద్ద 1.42 టీఎంసీల సామర్థ్యం, గోమూత్రి వాగుపై రూ.0.7 టీఎంసీ సామర్థ్యంతో రెండు జలాశయాలు నిర్మించ నున్నారు. భూసేకరణతో కలిపి ఈ రెండింటికి రూ.583. 78 కోట్లు వ్యయంకానుంది. కడెంనదిపై కుప్టి వద్ద 5.30 టీఎంసీలతో రూ.870 కోట్లతో మరో జలాశయం నిర్మించనున్నారు.
తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి 2018 మార్చి 13న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(నల్గొండ), సంపత్కుమార్ (ఆలంపూర్) శాసన సభ సభ్యత్వాలను సభ్యత్వాలను రద్దు చేశారు. కాంగ్రెస్ శాస నసభా పక్ష నాయకుడు సహా 11 మందిని, శాసనమండ లిలో విపక్ష నేత సహా ఆరుగురు సభ్యులను బడ్జెట్ సమా వేశాల వరకు సస్పెండ్ చేస్తూ శాసనసభ, మండలిలో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా 2018 మార్చి 12న ఉభయ సభల సంయుక్త సమావేశంలో చోటు చేసుకున్న సంఘటనలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సిరిసిల్లలో రూ.100 కోట్లతో అపెరల్ సూపర్హబ్
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో గల పెద్దూరు గ్రామంలో 20 ఎకరాల్లో రూ.100 కోట్లతో అపెరల్ సూపర్ హబ్ను ఏర్పాటు చేయడానికి తమిళనాడులోని కరూర్కు చెందిన ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కేఏవై వెంచర్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.
వార్తల్లో వ్యక్తులు
వేదాంత బోర్డులోకి యూకే సిన్హా
మైనింగ్ దిగ్గజం వేదాంత యూకే సిన్హాను కంపెనీ బోర్డులోకి తీసుకుంది. సిన్హా అదనపు నాన్ ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టర్గా వ్యవహరిస్తారు. యూకే సిన్హా 2021 ఆగస్ట్ 10 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. యూకే సిన్హా 2011 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్గా పనిచేశారు.
భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(76) 2018 మార్చి 14న యూకేలో గల కేంబ్రిడ్జ్లోని తన నివాసంలో మృతి చెందారు. స్టీఫెన్ పూర్తి పేరు స్టీఫెన్ విలియమ్ హాకింగ్. స్టీఫెన్ భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురు త్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు. కష్ణబిలాలు కూడా రేడియేషన్కు ఉత్పత్తి చేస్తాయని ధ్రువీ కరించారు. దీన్నే హాకింగ్ రేడియేషన్ అని కూడా పిలుస్తారు. భౌతికశాస్త్రంలో ఐన్స్టీన్ తర్వాత అంత గొప్ప శాస్త్రవేత్తగా హాకింగ్ పేరుగాంచారు. కష్ణబిలాలు, బిగ్బ్యాంగ్ సిద్ధాంతంపై ఆయన చేసిన అద్భుత పరిశోధనలు నేటి తరం శాస్త్రవేత్తలకు మార్గదర్శనం చేస్తాయి. స్టీఫెన్ హాకింగ్ రచించిన ఒక పుస్తకం 'కాలం కథ' పేరుతో తెలుగులో కూడా వెలువడింది.
టైమ్స్ నౌ నెట్వర్క్ చీఫ్ రంజన్రారు మృతి
టైమ్స్ నౌ నెట్వర్క్ చీఫ్, టైమ్స్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు రంజన్రారు(57) 2018 మార్చి 10న న్యూఢిల్లీలో మృతి చెందాడు.
అవార్డులు
ఇండియాకు 2018 బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డు
ఇండియాకు 2018 బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డు లభించింది. 2018 మార్చి 7 నుంచి 10 వరకు జర్మనీ రాజధాని బెర్లిన్లో ఐటీబీ-బెర్లిన్ వరల్డ్ టూరిస్ట్ మీట్ను నిర్వహించారు. ఈ టూరిస్ట్ మీట్లో భాగంగా 2018 మార్చి 10న ఈ అవార్డు అందజేశారు.
అనింధిత్కు మోటార్ స్పోర్ట్స్ అవార్డు
తెలంగాణ రేసర్ కొండా అనింధిత్రెడ్డికి 'ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా(ఖీవీూజ×) జాతీయ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించింది. 2018 మార్చి 11న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో 2017 సంవత్స రానికి గాను ఉత్తమ క్రీడాకారుడి అవార్డు అందుకున్నాడు.
ICMR కు ఇంటర్నేషనల్ కొచ్చన్ ప్రైజ్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(×జవీ=)కు 2017 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ కొచ్చన్ ప్రైజ్ దక్కింది. క్షయ నిర్మూలనకు చేస్తున్న కృషికి గాను ×జవీ=కి ఈ అవార్డు లభించింది. కొరియాలోని కొచ్చన్ ఫౌండేషన్ ఈ ప్రైజ్ను అందజేస్తుంది. ×జవీ= ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
అమోల్ పాలేకర్కు గోదావరి గౌరవ్ అవార్డు
ప్రముఖ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్కు గోదావరి గౌరవ్ అవార్డు లభించింది. నాసిక్కు చెందిన కుసుమగ్రాజ్ ప్రతిష్ఠాన్ ఈ అవార్డు ను అందిస్తుంది. 2018 మార్చి 10న నాసిక్లో జరిగిన కార్యక్రమంలో కుసుమగ్రాజ్ ప్రతిష్ఠాన్ ఛైర్పర్సన్, మలయాళ రచయిత మధు మంగేష్ కార్నిక్ అమోల్ పాలేకర్కు గోదావరి గౌరవ్ అవార్డును ప్రదానం చేశారు.
క్రీడలు
భారత్లో ఉబర్ ప్రచారకర్తగా విరాట్ కోహ్లి
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి భారత్లో ఉబర్ కార్యకలాపాలకు ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉబర్ ప్రచారకర్తను నియమిం చుకోవడం ఇదే ప్రథమం. గత నెలలో ఈజిప్టులో ప్రచారం నిమిత్తం ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు మహమ్మద్ సలాV్ాను ప్రచారకర్తగా నియమించుకుంది.
ఐపీఎల్ అంపైర్ పార్ట్నర్గా పేటిఎం
ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ పేటిఎం ఇండి యన్ ప్రీమియర్ లీగ్ (×ూూ)కు 5 సం||ల వరకు అంపైర్ పార్ట్నర్ గా మారింది. 2018 మార్చి 12న దీజజ× ఈ విషయాన్ని వెల్లడించింది. పేటిఎం ఇండియన్ క్రికెట్కు టైటిల్ స్పాన్సర్ గా కూడా ఉంది.
నేపాల్కు ఐసీసీ హోదా
నేపాల్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడేందుకు అర్హత సాధించింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నేపాల్ పపువా న్యూ గునియాను వెనక్కినెట్టి వన్డే హౌదా దక్కించుకుంది.
సైన్స్ Ê టెక్నాలజీ
రష్యా హైపర్సోనిక్ క్షిపణి 'కింఝాల్' పరీక్ష విజయవంతం
అత్యాధునిక ఆయుధాల సమీకర ణలో భాగంగా ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకు వెళ్లగలిగే హైపర్సోనిక్ క్షిపణిని 2018 మార్చి 11న విజయవం తంగా రష్యా పరీక్షిం చినట్లు తెలిపింది. దీనిని 'ఆదర్శవంత మైన ఆయుధం'గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొ న్నారు. ఈ 'కింఝాల్' (డాగర్) క్షిపణిని మిగ్-31 సూపర్ సోనిక్ జెట్ నుంచి ప్రయోగించారు.
కత్రిమ గుండెను రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు
రాకెట్ నిర్మాణ సాంకేతికతను ఉప యోగించి చైనా శాస్త్ర వేత్తలు కత్రిమ గుండెను రూపొం దించారు. ఇప్పటికే వీటిని 6 గొర్రెలకు అమర్చ గా... అవన్నీ ఆరోగ్యంగా జీవనం సాగిస్తు న్నాయి. చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికిల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు విద్యుత్తును చోదకశక్తిగా మార్చే రాకెట్ సర్వో సిస్టంను ఆధారం చేసుకుని కత్రిమ గుండె (స్పేస్హార్ట్)ను తయారుచేశారు.
జుజూ అతిచిన్న కంప్యూటర్ 'లివా క్యూ'
కంప్యూటర్ విడిభాగాలు, మొబైల్ పరికరాల తయారీ సంస్థ ఎలైట్ గ్రూప్ కంప్యూటర్ సిస్టమ్స్ (జుజూ) విండోస్ ఆధారంగా పనిచేసే అతి చిన్న పాకెట్ సైజ్ కంప్యూటర్ 'లివా క్యూ'ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లివా క్యూ బరువు కేవలం 260 గ్రాములు.
కత్రిమ మేధో వ్యవస్థను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్
అత్యంత స్పష్టతతో, కచ్చితత్వంతో మాండారిన్ (చైనీస్) నుంచి ఇంగ్లీషులోకి అనువదించే కత్రిమ మేధో వ్యవస్థను సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూపొందించింది.
దేశపు తొలి క్లోనింగ్ అస్సామీ గేదెదూడ జననం
దేశపు మొట్టమొదటి క్లోనింగ్ అస్సామీ గేదె దూడను శాస్త్రవేత్తలు సష్టించినట్లు గేదెల పరిశోధన కేంద్ర సంస్థ (జ×=దీ) తెలిపింది. దీనికి సచ్ గౌరవ్ అని పేరు పెట్టారు.
ఆర్థిక అంశాలు
2018-19లో భారత వద్ధి 7.3 శాతం
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వద్ధి 7.3 శాతానికి చేరొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2019-20లో వద్ధి మరింత పెరిగి 7.5 శాతానికి చేరొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ పేరిట విడుదల చేసిన ద్వైవార్షిక ప్రచురణలో ప్రపంచ బ్యాంక్ ఈ అంశాలను వెల్లడించింది.
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా
ఆర్బీఐ మార్గదర్శకాల్ని ఉల్లఘించడం, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించకపోవడంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.5 కోట్ల జరిమానా విధించింది. 2017 జనవరి నుంచి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
ఎస్బీఐ కనీస నిల్వ ఛార్జీలు తగ్గింపు
ఖాతాలో నెలవారీ సగటు కనీస నిల్వ (Aవీదీ) లేకపోతే విధి స్తున్న ఛార్జీలను 75 శాతం వరకు తగ్గిస్తూ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ూదీ×) నిర్ణయం తీసుకుంది. 2018 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. మహా నగరాలు (మెట్రో), పట్టణాల్లో Aవీదీ లేకపోతే గరిష్ఠంగా ఛార్జీ రూ.50+వస్తు సేవల పన్ను (+ూు) వసూలు చేస్తుండగా, ఇప్పుడు రూ.15ం +ూు మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది.
వీూవీజులకు ఐసీఐసీఐ బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (వీూవీజు) తక్షణ ఓవర్డ్రాఫ్ట్ (ఇన్స్టా ఓడీ) సదుపాయం కల్పిస్తున్నట్లు ఐసీ ఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఇందుకోసం ఖాతాదారులు బ్యాంకు శాఖలకు రావాల్సిన అవసరం లేదని, ముందస్తు అర్హత (ప్రీ క్వాలిఫైడ్) పొందిన వారికి కాగితాలతో పని లేకుండా ఆన్లైన్లోనే తక్షణం ఓవర్డ్రాఫ్ట్ పొందే వెసులుబాటు కల్పిస్తున్నామని బ్యాంకు తెలిపింది.
ూశీఖల జారీపై బ్యాంకులపై ఆర్బీఐ నిషేధాజ్ఞలు
లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్(ూశీఖ) రూపంలో హామీలను జారీ చేయకుండా ప్రభుత్వరంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(=దీ×) నిషేధం విధించింది. నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలు పీఎన్బీకి చెందిన ఒక శాఖ ద్వారా ఎల్ఓయూలను ఇప్పించుకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్లో ఈ తరహా మోసాలు జరగకుండా ఉండేందుకే తక్షణం అమల్లోకి వచ్చేలా వీటిపై నిషేధం జారీ చేసింది.
- యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270
Authorization