అంతర్జాతీయం
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
2018 జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఉత్తరా ఖండ్లోని డెహ్రాడూన్లో అటవీ పరిశోధన సంస్థ (ఎఫ్ఆర్ఐ) ప్రాంగ ణంలో 50వేల మంది ఔత్సాహికుల తో కలిసి యోగ సాధన చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ సురినామ్లో అధ్యక్షుడు దీసీ బేతర్షేతో కలిసి ఆసనాలు వేశారు. రాజస్థాన్ లోని కోటలో లక్ష మందికి పైగా ఒకేసారి యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సష్టించారు.
UNHRC నుంచి వైదొలగిన అమెరికా
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి(UNHRC) ఇజ్రాయిల్పై పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని ఆరోపిస్తూ అమెరికా 2018 జూన్ 20న ఆ సంస్థ నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ, విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో కలసి వాషింగ్టన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మెక్సికో అక్రమ వలసదారు లపై అమెరికా అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్' విధానం అన్యాయమని UNHRC విమర్శించింది. దీంతో ట్రంప్ యంత్రాంగం మండలి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది.
నేపాల్ అభివద్ధికి చైనా హామీ
మౌలిక సదుపాయాలు, వ్యాపారం, పెట్టుబడులు, ప్రాజెక్టుల నిర్మాణం తదితరాల్లో నేపాల్కు తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని చైనా హామీ ఇచ్చింది. బెల్టు రోడ్డు ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగంగా ఈ తోడ్పాటును అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ 2018 జూన్ 20న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి స్పష్టం చేశారు. ఓలీ చైనా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సుమారు రూ.4500 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.
అత్యధిక ఆయుధాలున్న దేశం అమెరికా
అత్యధికంగా ఆయుధాలు గల దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో, భారత్ ద్వితీయ స్థానంలో ఉన్నట్టు 'స్మాల్ ఆర్మ్స్ సర్వే' పేరుతో చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. ఈ సర్వే నివేదికను ఐక్యరాజ్యసమితి సదస్సులో ఆవిష్కరించారు. ప్రపంచంలో 100 కోట్లకుపైగా తుపాకులున్నాయని, వీటిలో 85.7 కోట్లు పౌరుల చేతుల్లోనే ఉన్నాయని వెల్లడించింది. ఆయుధాలు కలిగిఉన్న పౌరుల్లో 46% అమెరికన్లేనని, ఆ దేశ పౌరుల వద్ద 39.3 కోట్ల తుపాకులున్నాయని వెల్లడించింది. భారత్లో పౌరుల వద్ద 7.1 కోట్ల ఆయుధాలున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. చైనా (4.97 కోట్లు), పాకిస్థాన్ (4.39 కోట్లు), రష్యా (1.76 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
చైనాలో ఉత్తర కొరియా అధ్యక్షుడి ఆకస్మిక పర్యటన
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ 2018 జూన్ 19, 20 తేదీల్లో చైనాలో పర్యటించారు. కిమ్ జోంగ్ ఉన్ 2018 మార్చి నుంచి చైనాలో పర్యటించడం ఇది మూడోసారి కాగా, కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు అంగీకరించిన అనంతరం చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం.
వీడియో గేమ్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
కొకైన్ వంటి మాదకద్రవ్యాలు తీసుకోవడం, జూదమాడటం తరహాలోనే వీడియో గేములు కూడా వ్యసనంగా మారొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(ఔనఉ) పేర్కొంది. తాజాగా విడుదల చేసిన 'వ్యాధులపై అంతర్జాతీయ వర్గీకరణ' (×జణ) 11వ సంచికలో ఈ మేరకు హెచ్చరించింది. ఆన్లైన్, ఆఫ్లైన్ 'గేమింగ్ రుగ్మత'ను పదార్థాల వినియోగం లేదా వ్యసన పరమైన వ్యవహారశైలితో వచ్చే రుగ్మతగా వర్గీకరించారు.
వలస సంపన్నుల్లో భారత్కు 2వ స్థానం
స్వదేశాల నుంచి విదేశాలకు వలస వెళుతున్న సంపన్నుల సంఖ్యలో భారత్ 2వ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆఫ్రో ఆసియా బ్యాంకు 'గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ' పేరుతో 2018 జూన్ 16న విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడిం చింది. వలస వెళ్లే సంపన్నులు అత్యధికంగా ఆస్ట్రేలియాకు వెళుతుండగా తర్వాతి స్థానాల్లో అమెరికా, కెనడా, న్యూజిలాండ్, అరబ్ దేశాలు ఉన్నాయి.
దక్షిణ కొరియాలో సైనిక విన్యాసాలు నిలిపివేసిన అమెరికా
దక్షిణ కొరియాతో జరిగే సంయుక్త సైనిక విన్యాసాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో చర్చల సందర్భం గా ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చాడు. అమెరికాకు చెందిన 28,500 మంది సైనికులు ద.కొరియాలో మోహరించి ఉంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో కంప్యూటరీకత ఆదేశాలతో రెండు వారాల పాటు సంయుక్త విన్యాసాలు చేస్తుంటారు.
అత్యంత వయసైన సుమత్రా ఒరంగుటాన్ మతి
'సుమత్రా ఒరంగుటాన్' జాతిలోనే అత్యంత వద్ధురాలిగా రికార్డు సాధించిన ప్వాన్ అనే 62 ఏళ్ల వానరం 2018 జూన్ 18న ఆస్ట్రేలియాలోని పెర్త్లో గల ఓ జంతు ప్రదర్శనలో మృతి చెందింది. ప్వాన్కు 11 పిల్లలు. వాటి ద్వారా మరో 54 కోతులు కూడా దాని సంతతిలో చేరాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ జంతు ప్రదర్శనశాలలు, అడవుల్లో ఇవి ఉన్నాయి. ఇండోనేసియా లోని సుమత్రా దీవిలో ఈ అరుదైన సుమత్రా ఒరంగుటాన్ లు కనిపిస్తాయి. ఆడ ఒరంగుటాన్లు 50 ఏళ్లకు మించి బతకడం చాలా అరుదు.
న్యూఢిల్లీలో నేషనల్ డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ 2018 జూన్ 19న న్యూఢిల్లీలో నేషనల్ డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ఐఐటీ ఖరగ్పూర్ అభివృద్ధి చేసిన నేషనల్ డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియాను నేషనల్ రీడింగ్ డే సందర్భంగా ప్రారంభించారు.
జాతీయ ఆరోగ్య వనరుల నిధి ప్రారంభం
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఆరోగ్య పరిరక్షణ సంస్థలన్నిం టిలో లభ్యమయ్యే వివరాలతో కూడిన 'జాతీయ ఆరోగ్య వనరుల నిధి' (నేషనల్ హెల్త్ రీసోర్సెస్ రిపాజిటరీ-చీన==)ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా 2018 జూన్ 19న ప్రారంభించారు. ఈ సమాచార నిధి ఆధారంగా మున్ముందు ఆరోగ్య పరిరక్షణ సవాళ్లపై అధునాతన పరిశోధన జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటిది రావడం దేశంలో ఇదే తొలిసారి.
చిన్నారులపై నేరాల నివారణపై హ్యాండ్బుక్ ఆవిష్కరణ
చిన్నారులపై నేరాల నివారణ, ఆయా కేసుల్లో అనుసరించాల్సిన ప్రక్రియ, సంబంధిత చట్టాలు, న్యాయస్థానాల తాజా తీర్పులను సమగ్రంగా సంకలనం చేసిన హ్యాండ్బుక్ను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ 2018 జూన్ 19న న్యూఢిల్లీలో ఆవిష్కరిం చారు. ప్రతి పోలీసు స్టేషన్లోనూ ఇది అందుబాటులో ఉంచనున్నారు.
గౌరీలంకేశ్ హత్య కుట్రకు 'ఆపరేషన్ అమ్మ'
కర్ణాటకకు చెందిన సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కుట్రకు 'ఆపరేషన్ అమ్మ' అని పేరు పెట్టినట్టు సిట్ విచారణలో 2018 జూన్ 16న వెల్లడైంది. ఆమెను హత్య చేయడానికి రహస్య సంకేతం ద్వారా కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో నిందితులు మాట్లాడినట్టు తెలిసింది. బీజాపూర్ జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్ వాగ్మారేని ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు.
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిగా పార్లమెంటు సభ్యుడు : CIC
పార్లమెంటు సభ్యుడిని కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (పీఐవో)గా పరిగణిస్తూ కేంద్ర సమాచార కమిషన్(CIC) 2018 జూన్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటు సభ్యుడి స్థానిక ప్రాంత అభివద్ధి నిధుల(ఎంపీల్యాడ్స్) పథకం అమలు స్థితి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, సంబంధిత సమాచారం సదరు ఎంపీ ఇవ్వాలని పేర్కొంది.
విశ్వవిద్యాలయాల్లో ఏటా స్నాతకోత్సవాలు
విశ్వవిద్యాలయాల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించాలని కేంద్ర మానవవనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ 2018 జూన్ 17న ఆదేశించింది. దేశంలోని కొన్ని వర్సిటీలు స్నాతకోత్సవాలను వాయిదా వేయడంపై కేంద్రం ఈ మేరకు స్పందించింది.
వంట నూనెలపై 5-10% దిగుమతి సుంకం పెంపు
పామాయిలేతర వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5-10 శాతం పెంచింది. దేశీయ నూనె గింజల పెంపకందారులు, ముడి నూనెను శుద్ధి చేసే వారి ప్రయోజ నాల్ని దష్టిలో ఉంచుకొని ముడి, శుద్ధి చేసిన పామాయిలేతర నూనెలపై సుంకాల్ని పెంచారు. 2017 మార్చిలో ప్రభుత్వం ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 30 నుంచి 44 శాతానికి పెంచింది. శుద్ధి చేసిన పామాయిల్పై కూడా సుంకాన్ని 40 నుంచి 54 శాతానికి పెంచింది.
ఎన్నారై వివాహాలను వారంలో నమోదు చేసుకోవాలి
భారత్లో జరిగే ప్రవాస భారతీయుల (ఎన్నారైల) వివాహాల ను వారం రోజుల్లోగానే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కేంద్ర మహిళా-శిశు అభివద్ధి మంత్రిత్వశాఖ 2018 జూన్ 14న వెల్లడించింది. అలా చేయని వారికి పాస్పోర్టులు, వీసాలు జారీ కావని స్పష్టం చేసింది. ఎన్నారై వివాహాలను 48 గంటల్లోపే నమోదు చేసుకోవాలని ఈ శాఖ మంత్రి మేనకాగాంధీ గత వారం పేర్కొన్నారు.
భిలారు ఉక్కు కర్మాగారం జాతికి అంకితం
రూ.18,800 కోట్లతో విస్తరణ, ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకున్న భిలారు ఉక్కు కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రవెడీ 2018 జూన్ 14న జాతికి అంకితం చేశారు.
ఉమ్మడి జల యాజమాన్య సూచీ విడుదల
రాష్ట్రాలకు 'ఉమ్మడి జల యాజమాన్య సూచీ (కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్-జఔవీ×)'లను కేటాయిస్తూ నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2018 జూన్ 14న న్యూఢిల్లీలో విడుదల చేశారు. భారత చరిత్రలోనే తొలిసారిగా దేశం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. భూగర్భ జలనిర్వహణ, జలవనరుల పరిరక్షణ, వ్యవసాయం, తాగునీరు, విధానాల రూపకల్పన-అమలు తదితర 28 అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఈ ర్యాంకుల్ని కేటాయించారు. ఇతర రాష్ట్రాల విభాగంలో అత్యంత సమర్థంగా నీటి నిర్వహణ చేపట్టి గుజరాత్ ప్రథమ స్థానం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, తెలంగాణ 8వ స్థానంలో నిలిచాయి.
జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన
జమ్ముకశ్మీర్లో 2018 జూన్ 20 నుంచి గవర్నర్ పాలన అమలులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచుతూ గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించారు. మద్దతు ఉపసంహరించు కుంటున్నట్టు జూన్ 19న బీజేపీ ప్రకటించడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కుప్పకూలింది. గడచిన నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం ఇది ఎనిమిదోసారి.
ప్రాంతీయం
యంగ్లైవ్స్, సెస్ సంయుక్త అధ్యయనం
తెలంగాణలో పేదరికానికి కులవ్యవస్థతో లోతైన సంబంధం ఉందని యంగ్లైవ్స్, సామాజిక ఆర్థిక అధ్యయన సంస్థ (సెస్) వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితులు వారి జీవనశైలి, సదుపాయాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ఐటీ, డిజిటల్ రంగాల్లో పురోగమిస్తున్నా పేదరికం కారణంగా యువతకు డిజిటల్ అక్షరాస్యత, మొబైల్ ఆధారిత ఇంటర్నెట్ వినియోగం అందని ద్రాక్షగా ఉందని వెల్లడించింది.
తెలంగాణకు స్కోచ్ అవార్డులు
దేశ వ్యాప్తంగా నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చిన పుర పాలక, నగరపాలక సంస్థలకు స్కోచ్ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ పలు అవార్డు లను దక్కించుకుంది. 52వ స్కోచ్ సదస్సు సందర్భంగా సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చర్ ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఘన వ్యర్థాల నిర్వహణ, ఎల్ఈడీలు బల్బులు, నూతన ఆవిష్కరణలు, 'మన సిరిసిల్ల సీనియర్ సిటిజన్ సర్వీసెస్ సేవల'కు గాను సిరిసిల్ల పురపాలక సంస్థకు అవార్డులు దక్కాయి. స్పెషల్ ప్రిస్టీ జియస్ అవార్డు కూడా సిరిసిల్లకు దక్కింది. హరితహారం, ఎల్ఈడీ బల్బుల ఏర్పాటులో కరీంనగర్కు అవార్డులు దక్కాయి. షాద్నగర్, బోడుప్పల్, రెండు ప్రభుత్వ సంస్థలకూ స్కోచ్ అవార్డులు లభించాయి. సాంకేతికను ఉపయోగించు కొని విద్యార్థులకు, కళాశాలలకు మెరుగైన సేవలను సమర్థంగా అందజేసినందుకు తెలంగాణ ఇంటర్ బోర్డుకు స్కోచ్ పురస్కారం లభించింది.
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సభ్యుడిగా రమేశ్
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ జ్యుడీషియల్ సభ్యుడిగా మాజీ జిల్లా జడ్జి కె.రమేశ్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2018 జూన్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. కె.రమేశ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 5 ఏండ్లుగానీ, 67 ఏండ్ల వయస్సు వరకు గానీ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్ష పదవితో సహా సభ్యుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.
'రైతుబంధు సామాజిక బీమా' పథకం మార్గదర్శకాలు
'రైతుబంధు సామాజిక బీమా' పథకం కింద ఒకసారి రైతు పేరు నమోదైతే వెంటనే భూమిని అమ్ముకున్నా ఏడాది పాటు బీమా వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. 2018 ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని 18 నుంచి 59 ఏండ్ల వయసున్న రైతులందరికీ జీవితబీమా కల్పించేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలతో 2018 జూన్ 19న ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ పోలీసుల 'కాప్ కనెక్ట్' యాప్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ అంతర్గత అవసరాల కోసం వాట్సప్ తరహాలో రూపొందిం చిన 'కాప్ కనెక్ట్' యాప్ను డీజీపీ మహేందర్రెడ్డి 2018 జూన్ 18న హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ కాప్ కనెక్ట్ ద్వారా ఒకేసారి సిబ్బంది మొత్తం అంటే 63వేల మంది ఒకే బందంగా ఉండవచ్చు. ఇందులో మళ్లీ తమ అవసరాలకు తగ్గట్టుగా ఉప బందాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకేసారి పదివేల మందితో, వారి స్థానాల నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా మరో ప్రత్యేకమైన యాప్ను కూడా డీజీపీ ప్రారంభించారు.
పంచాయతీ ఎన్నికల వ్యయపరిమితి పెంపు
తెలంగాణలో పంచాయతీ ఎన్ని కల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గ్రామపంచాయతీ జనాభా 5 వేలకు మించి ఉన్న చోట సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థి రూ.50వేల వరకు ఖర్చు పెట్టొచ్చు. రాష్ట్రంలో పంచాయతీలు చిన్నవైన నేపథ్యంలో గరిష్ఠ పరిమితులకు ఇంత వరకు అవలంబిస్తూ వచ్చిన జనాభా సంఖ్య విధానాల్లో ఎన్నికల సంఘం మార్పులు తెచ్చింది.
జిల్లాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు
తెలంగాణలో 21 జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల (ణజూఖ)ను నెలకొల్పేందుకు ప్రభుత్వం 2018 జూన్ 17న ఆమోదం తెలిపింది. బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు వారు లైంగిక వేధింపులకు గురికాకుండా చేయడానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పది జిల్లాల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు (ణజూఖ) ఉన్నాయి.
బయ్యారం ఉక్కుపై అధ్యయన కమిటీ
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఇంధన, పరిశ్రమలు, మైన్స్, సింగరేణి, ఖనిజాభివద్ధి అధికారులు ఉన్నారు. కమిటీ తన నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది.
వార్తల్లో వ్యక్తులు
మిస్ ఇండియాగా అనుక్రితి
మిస్ ఇండియా అందాల పోటీలో తమిళనాడుకు చెందిన 19ఏండ్ల అనుక్రితి విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్-2017 మానుషి ఛిల్లర్ అనుక్రితికి అందాల కిరీటం బహూకరించారు. ముంబయిలో జరిగిన వేడుకలో ఈ ఫలితాలను ప్రకటించారు. పోటీలో రెండో స్థానంలో మీనాక్షి చౌదరి (హర్యానా), మూడో స్థానంలో శ్రేయారావు (ఆంధ్రప్రదేశ్) నిలిచారు. అనుక్రితి మిస్ వరల్డ్-2018 పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
యుద్ధవిమాన పైలట్గా మేఘనా షాన్బో
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అత్యంత క్లిష్టమైన యుద్ధవిమాన పైలట్గా దక్షిణ భారతదేశానికి చెందిన మేఘనా షాన్బో నియమితులయ్యారు. ఎయిర్ఫోర్స్లో 6వ మహిళా ఫైటర్ పైలట్గా ఎంపికయ్యారు. 2018 జూన్16న హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యు యేట్ పరేడ్ జరిగింది. కర్ణాటకలోని చిక్మంగుళూర్ కు చెందిన మేఘనా ఫ్లయింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.
జనరల్ మోటార్స్ సీఎఫ్ఓగా దివ్యా సూర్యదేవర
వాహన రంగంలో అగ్రగామి సంస్థ అయిన అమెరికాలోని జనరల్ మోటార్స్ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ)గా ఇండియన్- అమెరి కన్ దివ్యా సూర్యదేవర (39) నియ మితులయ్యారు. ప్రస్తుతం ఆమె కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఫైనాన్స్)గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీఎఫ్ఓ చక్ స్టీవెన్స్ స్థానాన్ని దివ్యా సూర్యదేవర భర్తీ చేయనున్నారు. 2018 సెప్టెంబరు 1న ఆమె సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టనున్నారు. చెన్నైలో పుట్టిన దివ్యా సూర్యదేవర.. 2017 జులై నుంచి జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్నారు.
ఉద్యమ నేత కేశవరావ్ జాదవ్ కన్నుమూత
తొలితరం తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్(85) 2018 జూన్ 16న హైదరాబాద్లో మృతి చెందారు. హక్కుల పోరాటాలు, తెలం గాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పని చేశారు. కాల్పుల విరమణ కోసం ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య చర్చలకు కషి చేశారు. 2008లో కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్పై పోటీ చేసి ఓడి పోయారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో 'తెహజీబ్' అనే సంస్థను ఏర్పాటు చేశారు. 1947లో 'క్విట్ కాలేజీ' ఉద్యమంలో, 'ముల్కి' ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. పౌర హక్కుల కార్యకర్తగా పలుసార్లు అరెస్టయి జైలు జీవితం గడిపారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా సేవలు అందించారు.
మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ మృతి
మిమిక్రీ సామ్రాట్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్(85) 2018 జూన్ 19న వరంగల్లో మృతి చెందారు. వేణు మాధవ్ కొంతకాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. 1972-78 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా కొనసాగినప్పటికీ రాజకీయాలపై ఆసక్తి లేని ఆయన మళ్లీ కళ వైపే మళ్లారు. వేణుమాధవ్ మిమిక్రీ కళకు చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ''ధ్వని అనుకరణను శాస్త్రంగా, పాఠ్యాంశంగా, కళారూపక ప్రక్రియగా మలిచి 'మిమిక్రీ కళ' పేరిట వేణుమాధవ్ రచించిన పుస్తకాన్నే పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ కోర్సులో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు.
అవార్డులు
హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అవార్డులు
2017-18 సంవత్సరానికిగాను తెలంగాణకు పాస్పోర్ట్ వెరిఫికేషన్, పాస్పోర్ట్ జారీలో అవార్డులు లభించాయి. దేశంలోనే ఉత్తమ పోలీసు వెరిఫికేషన్గా తెలంగాణ గుర్తింపు పొందింది. ఏ కేటగిరీలో పాస్పోర్ట్ జారీలో హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీసుకు మొదటి స్థానం లభించింది. జూన్ 26న పాస్పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
దీపికారెడ్డికి సంగీత నాటక అకాడమీ అవార్డు
ప్రఖ్యాత కూచిపూడి నత్య కళా కారిణి దీపికారెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు-2017కి ఎంపికయ్యారు. కూచి పూడి నత్యానికి ఆమె చేసిన సేవ లకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సజనాత్మక నత్య కళాకారిణిగా, సాంస్కతిక రాయబారిగా, గురువుగా దీపికారెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో గుర్తింపు పొందారు.
తెలంగాణ వ్యవసాయ శాఖకు 'అగ్రి' అవార్డు
వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివద్ధి చెందు తున్న తెలంగాణకు 'ఇండియా టుడే' సంస్థ అగ్రి అవార్డును ప్రకటించింది. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి 2018 జూన్ 23న ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
65వ ఫిలింఫేర్ అవార్డులు 2018
జియో 65వ సౌత్ ఫిలింఫేర్ అవార్డులను 2018 జూన్ 16న హైదరాబాద్లో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణకు అంద చేశారు. ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును 'బాహుబలి 2: ది కన్క్లూజన్' దక్కించుకోగా ఉత్తమ దర్శ కుడి అవార్డు రాజమౌళి (బాహుబలి: ది కన్క్లూజన్)కి లభించింది. ఉత్తమ నటుడిగా విజరు దేవరకొండ (అర్జున్రెడ్డి), ఉత్తమ నటిగా సాయి పల్లవి (ఫిదా) ఎంపికయ్యారు. విమర్శకుల ఉత్తమ నటుడు అవార్డు వెంకటేశ్ (గురు), విమర్శకుల ఉత్తమ నటి అవార్డు రితికా సింగ్ (గురు) గెలుచుకున్నారు.
సింగరేణి యోగా రికార్డు
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి వ్యాప్తంగా 1.26 లక్షల మంది సామూహిక యోగా కార్యక్రమాల్లో పాల్గొని కొత్త రికార్డును సష్టించారు. గతేడాది 176 కేంద్రాల్లో 60,369 మందితో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించి లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్లో సింగరేణి స్థానం సాధించింది. ఇప్పుడు దాన్ని తిరగరాసింది. తెలంగాణ 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో గనులు, విభాగాలు, కార్యాలయాలు, మైదానాలు ఈ రికార్డుకు వేదికగా మారాయి.
సదస్సులు-సమావేశాలు
రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం
రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో నీతి ఆయోగ్ 4వ పాలక మండలి సమావేశం 2018 జూన్ 17న జరిగింది. నీతి ఆయోగ్ చైర్మన్, ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వెనకబడ్డ జిల్లాల (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) అభివద్ధి, ఆయు ష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, పౌష్టికాహార మిషన్, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు వంటి అంశాలపై మోడీ మాట్లాడారు.
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్
2019లో జరిగే 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్కు జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఆతిథ్యమివ్వనుంది. 2019, జనవరి 3-7 మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని 'ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ' అనే థీమ్తో నిర్వహించనున్నారు.
సంపన్నుల చేతిలో ప్రపంచ సంపదలో సగం : బోస్టన్ నివేదిక
ప్రపంచ వ్యాప్తంగా కుబేరుల సంపద వేగంగా వద్ధి చెందుతోంది. గతేడాది అంతర్జాతీయంగా వ్యక్తిగత సంపద 201.9 లక్షల కోట్ల డాలర్లుకు చేరింది. 2016తో పోలిస్తే ఇది 12 శాతం అధికం. గత అయిదేండ్లలోనే ఇది వేగవంతమైన వద్ధి అయింది. ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా రాణించడం ఇందుకు ప్రధాన కారణమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
సైన్స్&టెక్నాలజీ
మునగ విత్తుతో నీటి శుద్ధికి 'ఎఫ్-శాండ్'
భారత్లో విరివిగా కనిపించే మునగ చెట్టులోని ప్రొటీన్లు వర్ధమాన దేశాల్లో తక్కువ ఖర్చుతో నీటి శుద్ధికి సాయపడతా యని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాజాగా అమెరికాలోని కార్నెగీ మెలాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇసుకలోని సిలికా రేణువులను, మునగ విత్తనాల్లోని ప్రొటీన్లను ఉపయోగించి చౌకైన నీటి శుద్ధి మాధ్యమాన్ని తయారు చేశారు. దీన్ని 'ఎఫ్-శాండ్'గా పేర్కొంటున్నారు. ఇది సూక్ష్మజీవులను చంపేస్తుంది.
కత్రిమ మేధస్సులో IBM 'ప్రాజెక్టు డిబేటర్'
కత్రిమ మేధస్సు శరవేగంగా దూసుకొస్తోంది. ఇద్దరు మనుషుల తో ఒక కంప్యూటర్ బహిరంగ చర్చకు దిగింది. ఐబీఎం సంస్థ ఈ యంత్రాన్ని రూపొందించింది. కత్రిమ మేధో పరిజ్ఞానంతో కొన్నేండ్ల పాటు పరిశోధించి దీన్ని సాకారం చేసింది. 'ప్రాజెక్టు డిబేటర్' అనే ఈ కంప్యూటర్ను ఐబీఎం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా 'ప్రభుత్వ సబ్సిడీతో అంతరిక్ష పరిశోధన' అంశంపై మాట్లాడాల్సిందిగా ఆ యంత్రానికి సూచించారు. నిజానికి ఈ అంశంపై అది ముందస్తు అధ్యయనం చేయలేదు. అయినా అక్కడక్కడా స్వల్ప విరామాలు మినహా తన వాదనను గట్టిగా వినిపించింది.
గుండెపోటు నివారణకు స్మార్ట్ స్టెంట్
గుండెపోటు నివారణ దిశగా శాస్త్రవేత్తలు ముందంజ వేశారు. హదయంలో రక్త ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించే స్మార్ట్ స్టెంట్ను అభివద్ధి చేశారు. వైద్యరంగంలో ఉపయోగించే తుప్పుపట్టని ఉక్కుతోనే తాము తాజా స్టెంట్ను తయారు చేసినట్టు బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సూలూరు కేంద్రంగా 'తేజస్' సేవలు
తేలికపాటి యుద్ధ విమానం- తేజస్(వాయుసేన 45వ స్క్వాడ్రన్) విభాగం ఇకపై తమిళనాడులోని వాయుసేన స్థావరం సూలూరు కేంద్రంగా సేవలందించనుంది. ఇప్పటి వరకూ తేజస్ విమానాల తయారీ కేంద్రమైన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో సంబంధిత విభాగం విధులు నిర్వహించింది.
9.9 కోట్ల ఏండ్ల నాటి కప్ప శిలాజం
ఉత్తర మయన్మార్లో అంగుళం కంటే చిన్నగా ఉన్న 9.9 కోట్ల ఏండ్ల నాటి కప్ప శిలాజాలు నాలుగు దొరికాయి. డైనోసార్లు భూమిపై రాజ్యమేలిన క్రెటారియస్ యుగంలో సైతం తడి, ఉష్ణ మండల అడవుల్లో కప్పలు జీవించేవి అనడానికి ఇదే తిరుగులేని సాక్ష్యమని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీకి చెందిన డేవిడ్ బ్లాక్బర్న్ వెల్లడించారు. దీనికి 'ఎలెక్టరనా లిమోయి' అనే కొత్తజాతిగా నామకరణం చేశారు.
కష్ణబిలానికి స్టీఫెన్ హాకింగ్ స్వరం
జీవితాంతం కష్ణబిలాల పరిశోధనలోనే గడిపిన బ్రిటిషు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్కు 2018 జూన్ 15న అద్భుతమైన, అరుదైన నివాళి అర్పించారు. ఆయన స్వరానికి వినసొంపైన ఆరున్నర నిముషాల సంగీతాన్ని మేళవించి, దాన్ని స్పెయిన్లోని ఏంటెన్నా ద్వారా అంతరిక్షంలోని '1ఎ 0620-00' కష్ణబిలానికి పంపించారు. '1ఎ 0620-00' కష్ణబిలం భూమికి 3500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో హాకింగ్ అస్థికలను ఖననం చేశారు. దివంగత ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చార్లెస్ డార్విన్, సర్ ఐజాక్ న్యూటన్ సమాధుల మధ్య వాటిని పూడ్చిపెట్టారు.
క్రీడా విశేషాలు
కియా సూపర్ లీగ్లో ఆడనున్న స్మతి మంధానా
భారత క్రికెట్ మహిళల జట్టు ఓపెనర్ స్మతి మంధానా ఇంగ్లాండ్లోని కియా సూపర్ లీగ్లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్గా రికార్డు సష్టించింది. 2018 జులై 22 నుంచి ఆరంభం కానున్న ఈ లీగ్లో స్మతి వెస్టర్న్ స్టార్మ్ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మతి ఇదివరకు బిగ్బాష్ లీగ్లో ఆడింది.
లంచ్ విరామంలోపే సెంచరీ సాధించిన ధావన్
టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సష్టిం చాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో లంచ్ విరామం లోపే సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచాడు. మొత్తంగా లంచ్లోపే సెంచరీ చేసిన ఆటగాళ్లలో శిఖర్ది ఆరో స్థానం. 2018 జూన్14న బెంగళూరులో ఆప్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్ ఈ రికార్డు సాధించాడు.
Authorization